×
ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.

అల్-ఇస్లాము. పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో 'ఇస్లాం ధర్మం యొక్క సంక్షిప్త వివరణ'

الإسلام - نبذة موجزة عن الإسلام كما جاء في القرآن الكريم والسنة النبوية - (نسخة مشتملة على الأدلة من القرآن الكريم والسنة النبوية)

ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త'సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.

{ఈ కాపీ పవిత్ర ఖురాను మరియు దైవప్రవక్త సున్నతు ఆధారాలతో ఇమిడి ఉంది}

ఇస్లాం ధర్మం'- 'అల్లాహ్ తరుపున ప్రజలందరి కొరకు పంపబడిన దైవసందేశం,ఇది శాశ్వతమైన దైవసందేశం,దైవసందేశాలకు ముగింపు పలుకుతుంది.

'అల్లాహ్ తరుపునుండి సర్వమానవాళి కొరకు వచ్చిన దైవసందేశమే-ఈ ఇస్లాం ధర్మం. మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేశాడు:-{మరియు మేము నిన్ను(ఓ ముహమ్మద్!) సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు}{సబా :28}:మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{(ప్రవక్త)చెప్పండి!ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరివైపుకు ప్రభవింపబడిన అల్లాహ్ సందేశహరుడను}{అల్ ఆరాఫ్ : 158}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చివున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి,ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందినదని తెలుసుకోండి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు}{అన్-నిసా : 170}.ఇస్లాం ధర్మం'-ఇది శాశ్వతమైన దైవసందేశం,దైవసందేశాలను ముగిస్తుంది మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.}{అల్ అహ్'జాబ్ :40 }

'ఇస్లాం ధర్మం' ఒక జాతికి లేదా దేశానికి ప్రత్యేకమైన ధర్మం కాదు,ఇది సర్వమానవాళి కొరకు చెందిన అల్లాహ్ ధర్మం.

మరియు 'ఇస్లాం ధర్మం' ఒక జాతి లేదా దేశానికి ప్రత్యేకమైన ధర్మం కాదు,ఇది సర్వమానవాళి కొరకు చెందిన అల్లాహ్ ధర్మం,పవిత్ర ఖురాను గ్రంధం యొక్క మొదటిఆదేశం;ప్రకారం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

{ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!}

[అల్ బఖర :21]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{ఓ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒకప్రాణం నుండి సృష్టించాడు,ఆ ప్రాణం నుండి దాని జంటను సృష్టించాడు,మరియు వారిద్దరి నుండి అనేక మగ,ఆడ ప్రాణులను సృష్టించాడు.}.

[అన్నిసా :1]

ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమ కథనం –మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మక్కా విజయం రోజున ప్రసంగిస్తూ ప్రజలకు తెలిపారు:-

ఓ ప్రజలారా నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి అజ్ఞానపు అంధకారాలను మరియు తాతముత్తాతల కీర్తనలను తొలగించాడు,ప్రజల్లో రెండు రకాలు ఉన్నారు:- దేవునిపట్ల భయబీతులతో ఉదారవైఖరి కలిగిన పుణ్యాత్ముడు,మరియు దేవుని పట్ల లోభత్వం చెడువైఖరి కలిగిన పాపాత్ముడు,ప్రజలందరూ ఆదము అలైహిస్సలాం సంతానం,అల్లాహ్ ఆదమును మట్టితో సృష్టించాడు.అల్లాహ్ సెలవిచ్చాడు :-ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరి మీ పరస్పర పరిచయం కోసం మ్మిమ్మల్ని వివిధవర్గాలుగా తెగలుగా చేశాము,యధార్ధానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆధరణీయుడు,నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు అప్రమత్తుడు][అల్ హుజ్రాత్ 13].

తిర్మిజీ ఉల్లేఖనం[3270]

మీకు పవిత్ర ఖురాను గ్రంధం ఆదేశాలలో లేదా దైవప్రవక్త ఆదేశాలలో ఏదేని ఒకజాతీ,వర్గం కొరకు వారి వంశం,జాతీ,లేదా లింగం కారణంగా ప్రత్యేకించబడిన 'చట్టం,శాసనం' మీకు లభించదు.

ఇస్లాం ధర్మం అనేది మునుపటి ప్రవక్తలు మరియు సందేశహరులు తమ జాతుల కొరకు తెచ్చిన(అలైహిముస్సలాతు వస్సలాం) సందేశాలను పూర్తి చేయడానికి వచ్చిన ఒక దైవిక సందేశం.

మునుపటి ప్రవక్తలు మరియు సందేశహరులు తమ జాతుల కొరకు తెచ్చిన(అలైహిముస్సలాతు వస్సలాం) సందేశాలను పూర్తి చేయడానికి వచ్చిన ఒక దైవిక సందేశం ఈ ఇస్లాం ధర్మం-మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :

{(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.}

(అన్నిసా : 163)

అల్లాహ్ఈ ధర్మాన్నితన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై దైవవాణి రూపంలో వెల్లడించాడు,మునుపటి ప్రవక్తల కోసం ఆయన ఈ ధర్మాన్ని శాసనంగా ఆజ్ఞాపించి,వీలునామా చేశాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-

{ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు}

[అష్ షూరా :13]

ఈ ధర్మాన్ని,అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు దైవవాణి రూపంలో వెల్లడించాడు,ఇది మార్పులకు గురికాని మునుపటి దైవికగ్రంధాలైన తౌరాతు,ఇంజీలుని దృవపరుస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-

{మరియు (ఓ ముహమ్మద్!) మేము నీపై అవతరింపజేసిన గ్రంథమే నిజమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలలో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరిచేది. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను బాగా ఎరిగేవాడు, సర్వసృష్టికర్త}

{ఫాతిర్ : 31}

దైవప్రవక్తలందరి (అలైహిముస్సలాం) ధర్మం ఒక్కటే,కానీ వారి శాసనాలు మాత్రం విభిన్నమైనవి;

దైవప్రవక్తల-(అలైహిముస్సలాం)-ధర్మము ఒక్కటే కానీ వారి యొక్క చట్టాలు విభిన్నమైనవి.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు.{మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు}[అల్ మాయిదా :48]మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-"ప్రజలందరిలో నేను ఈసా అలైహిస్సలాం'కు ఇహపరలోకంలో అత్యంత సామీప్యుడను,ప్రవక్తలంతా ఒకపితృ సోదరులు;వారి తల్లులు భిన్నంగా ఉంటారు,కాని అందరిధర్మం ఒకటే"బుఖారీ ఉల్లేఖించారు(3443)

సమస్త ప్రవక్తలు ఈమాను వైపుకు పిలిచినట్లుగా:నూహ్,ఇబ్రాహీం,మూసా, సులైమాన్,దావూద్ మరియు ఈసా అలైహిముస్సలాం వలె –ఇస్లాం ధర్మం'ఆహ్వానిస్తుంది అది'నిశ్చయంగా ప్రభువు ఆయన'అల్లాహ్'సర్వసృష్టికర్త,ఉపాధికర్త,జీవన్మరణాలకు కర్త,విశ్వసామ్రాజ్యాధినేత,మరియు ఆయనే సర్వవ్యవహారాలను నిర్వహించువాడు,వాత్సల్యవంతుడు,కరుణామయుడు.

ఇస్లాంధర్మం – సమస్త ప్రవక్తలు ఆహ్వానించినట్లుగా -నూహ్,ఇబ్రాహీం,మూసా,సులైమాన్,దావూద్ మరియు ఈసా అలైహిస్సలాం వలె-ఈమాన్ విశ్వాసం వైపునకు ఆహ్వానిస్తుంది-అది ప్రభువు నిశ్చయంగా అల్లాహ్'యే ఆయన సృష్టికర్త,ఉపాధికర్త, జీవన్మరణాలకు కర్త,విశ్వమహాచక్రవర్తి, ఆయనే వ్యవహారాలను ప్రణాళికరించువాడు,దయగలవాడు,కరుణామయుడు.-మహోన్నతుడైన అల్లహ్'సెలవిచ్చాడు{ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు?}[ఫాతిర్:3]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{వారిని అడుగు: "ఆకాశం నుండి,భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?"}(యూనుస్:31)మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఏమీ? ఆయనే కాడా? సృష్టిని తొలిసారి ప్రారంభించి, తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు. ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి!"}[అన్-నమ్ల్ :64]సమస్త ప్రవక్తలు మరియు సందేశహరులు ఏకైకుడైన అల్లాహ్ దేవుణ్ణి మాత్రమే ఆరాధించమని పిలుపునిచ్చారు.{మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు) : "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి".వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చింతమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో!}[అన్-నహల్:36].మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా:"నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.}[అల్ అంబియా :25]నూహ్ అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు :{వాస్తవంగా, మేము నూహ్ ను అతని జాతివారి వద్దకు పంపాము. అతను వారితో: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను." అని అన్నాడు.}[అల్-ఆరాఫ్ :59]అల్లాహ్'తన మిత్రుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలుపుతూ ఇలా సెలవిచ్చాడు:-{మరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది"}.[అల్-అన్'కబూత్:16]సాలిహ్ అలైహిస్సలాం చెప్పారు -అల్లాహ్ అతని గురించి తెలుపుతూ ఇలా సెలవిచ్చాడు:-{ఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము. అతను వారితో! "నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి.ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది}[అల్-ఆరాఫ్ :73]షుఐబ్'అలైహిస్సలాం చెప్పారు -అల్లాహ్ అతని గురించి చెప్పినట్లు-{మరియు మేము మద్'యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది}[అల్-ఆరాఫ్ :85]మొట్టమొదటగా అల్లాహ్ మూసా [అలైహిస్సలాం]కు చెప్పిన సందేశం: అల్లాహ్ అతనితో చెప్పాడు:-{మరియు నేను నిన్ను ('ప్రవక్తగా') ఎన్నుకున్నాను.నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను}.{నిశ్చయంగా,నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు,కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.}[తాహా :13-14 ]అల్లాహ్ మూసా గురించి తెలియజేస్తూ చెప్పాడు: అతను అల్లాహ్ శరణు కోరాడు,ఇలా అన్నాడు:{మరియు మూసా అన్నాడు:"నిశ్చయంగా,నేను లెక్క తీసుకోబడే రోజును విశ్వసించని ప్రతి దురహంకారి నుండి రక్షణకై ,నాకూ మరియు మీకూ కూడా ప్రభువైన ఆయన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను!}[గాఫిర్:27]ఈసా మసీహ్ అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు :అతను ఇలా చెప్పాడు:"నిశ్చయంగా, అల్లాహ్'యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి.ఇదే ఋజుమార్గము."[ఆల్ ఇమ్రాన్ :51]ఈసా మసీహ్ అలైహిస్సలాం గురించి తెలుపుతూ మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :అతను ఇలా చెప్పాడు:{ఓ ఇస్రాయీలీ సంతతి జనులారా !అల్లాహ్'నే ఆరాధించండి,ఆయనే నాకు ప్రభువు మరియు మీకు కూడా ప్రభువు,ఎవడైతే అల్లాహ్'కు ఇతరులను సాటికల్పిస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గం' నిషేదించాడు,మరియు అతని నివాసం నరకాగ్ని అవుతుంది మరియు దౌర్జన్యపరులకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు.}[అల్ మాయిదా : 72]అంతెందుకు తౌరాతు మరియు ఇంజీలు లో కూడా ఏకైకుడైన అల్లాహ్ ను ఆరాధించాలని తాకీదు చేయబడింది,మూసా మోషే చెప్పిన విషయం ద్వితీయోపదేశకాండంలో ప్రస్తావించబడింది:-{వినండి ,ఓ ఇస్రాయీలీలారా 'అర్-రబ్బు'ప్రభువే'మనందరికీ దైవం,ఆయన ప్రభువుఏకైకుడు}తౌహీదు ఏకత్వాన్ని తాకీదుపరుస్తూ 'బైబిలు మార్కలో వచ్చింది,అక్కడ ఈసా మసీహ్ అలైహిస్సలాం ఇలా అన్నారు:(మొదటి ఆజ్ఞ:వినండి ఓ ఇశ్రాయేలీయులారా,మన దేవుడైన యెహోవాదైవం ఏకైకుడు)సర్వశక్తిమంతుడైన అల్లాహ్'దేవుడు ఒక గొప్ప మిషన్ కొరకు ప్రవక్తలందరినీ పంపించాడని సూచించాడు అదే తౌహీద్ ఏకత్వం వైపునకు ఆహ్వానించడం;అల్లాహ్ దైవం ఇలా అన్నాడు:-ి{మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి."వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి,ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో!}[అన్-నహల్:36]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి.}[అల్ అహ్'ఖాఫ్:4]షైఖ్ స'అది'రహిమహుల్లాహ్ చెప్పారు:-తెలిసిందేమిటంటే !బహుదైవారాధకులు వారుచేసే షిర్కులో'ఎటువంటి ఆధారం,ప్రమాణం లేకుండా వాదిస్తారు మరియు నిజమేమిటంటే వారు తప్పుడు ఊహలు,అనుమానాలు,మందకోడి అభిప్రాయాలు,అసత్యపు ఆలోచనలపై ఆధారపడ్డారు.వారి పరిస్థితులను అద్యయనం చేయడం మరియు వారి జ్ఞాన,ఆచరణలను అనుసరించడం వల్ల మీరు అసత్యం వైపునకు మార్గనిర్దేశం చేయబడతారు,జీవితాంతం వాటి ఆరాధనకై గడిపివారిని గమనించండి?అవి (అల్లాహ్ కాకుండా ఈ మిథ్యాదైవాలు )వారికి కొంచమైన ఈ ప్రపంచంలో లేక పరలోకంలో?ప్రయోజనం చేకూర్చాయా?తైసీరుల్ కరీముల్ మన్నాన్ :779

పరమపవిత్రుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ దేవుడు!అతనే సృష్టికర్త మరియు ఆరాధనకు ఏకైక అర్హుడు,మరియ అతనితో ఇతరులను ఆరాధించకూడదు.

అల్లాహ్ దైవం! అతనే ఆరాధనకు ఏకైక అర్హుడు,మరియ అతనితో మరెవరినీ ఆరాధించకూడదు.మహాన్నతుడైన అల్లాహ్'సెలవిచ్చాడు:-{ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!}(21).ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా,మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.}(22).[అల్ బఖర :21-22]మనను,మన ముందు తరాలను సృష్టించినవాడు.మనకోసం భూమిని పాన్పులా చేసినవాడు,ఆకాశం నుండి మనకు నీటిని కురిపించి,దాని ద్వారా మన సదుపాయాల కోసం జీవనోపాధికోసం ఫలాలను,సమకూర్చినవాడు ఆయనే ఏకైకుడు ఆరాధనకు అర్హుడు.మరియు మహోన్నతుడు ఇలా అన్నాడు:{ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు?}.[ఫాతిర్:3]సృష్టించేవాడు,ఉపాధినొసగేవాడు అతనే ఏకైక ఆరాధనకు అసలు సిసలైన అర్హుడు,మరియు అల్లాహ్'సెలవిచ్చాడు.ఆయనే అల్లాహ్! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు.ఆయనే సర్వానికి సృష్టికర్త,కావున మీరు ఆయననే ఆరాధించండి.మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త.{అల్ అన్'ఆమ్:102}.మరియు అల్లాహ్'తో పాటు ఆరాధించబడే ఏదీ ఆరాధనకు అర్హత చెందినది కాదు,ఎందుకంటే భూమ్యాకాశాలలోని చిన్నఅణువుపై కూడా వారికి అధికారం లేదు.అల్లాహ్'కు ఏ విషయంలో భాగస్వామ్యం లేదు మరియు అల్లాహ్' కు సహాయకుడుగాని లేదా మిత్రుడు గానీ లేడు,మరి అలాంటప్పుడు అల్లాహ్'తో పాటు ఎలా ప్రార్ధిస్తారు లేదా ఆయనకు సాటి ఎలా కల్పిస్తారు? అల్లాహ్'సెలవిచ్చాడు:-{వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో,వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.}{సబా:22}అల్లాహ్ పరమపవిత్రుడు మహోన్నతుడు ఆయనే ఈ సర్వజీవులను సృష్టించాడు,మరియు ఆది నుండి అస్తిత్వాన్ని ఉనికిని కల్పించాడు,వాటి ఉనికి అల్లాహ్ ఉనికిని,ఆయన(రుబూబియ్యత్,ఉలూహియ్యత్)పోశకత్వం,దైవత్వం'ని సూచిస్తుంది.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం.ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు!మరియు ఆయన సూచనలలో;ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం;మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి.నిశ్చయంగా,ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.మరియు ఆయన సూచనలలో,మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.(23)మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం; మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి.(24).మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం. ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి.(25)మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి.(26)మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.}[అర్రూమ్ :20-27]నమ్రూద్'- తన ప్రభువు ఉనికిని ఖండించాడు,కాబట్టి ఇబ్రాహీం,{అలైహిస్సలాం} అతనితో ఇలా అన్నాడు:-అప్పుడు ఇబ్రాహీమ్:"అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు.}[అల్ బఖర:258].ఇదే విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతీప్రజలకు సూచిస్తూ'అల్లాహ్'యే తనకు ఋజుమార్గం ప్రసాదించాడు మరియు ఆయనే తనకు అన్నపానీయాలు కల్పించాడు'-తను అనారోగ్యానికి గురైతే స్వస్థత చేకూరుస్తాడు,మరియు ఆయనే మరణింపజేస్తాడు,బ్రతికింపజేస్తాడు.అల్లాహ్'తన గురించి చెప్పినట్లు ఆయన ఇలా అన్నాడు:-{ఆయనే నన్ను సృష్టించాడు.ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.ఆయనే నాకు తినిపిస్తాడు మరియు త్రాగిస్తాడు.మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిస్తాడు.మరియు ఆయనే నన్ను మరణింపజేస్తాడు,తరువాత మళ్ళీ బ్రతికింపజేస్తాడు.[షు'అరా: 78-81]అల్లాహ్ మూసా అలైహిస్సలాం గురించి తెలుపుతూ'- ఫిరౌన్ ఆయనతో వాదిస్తూ :నిశ్చయంగా ప్రభువు తానే':అనిచెప్పాడు.{ఆయన ప్రతీవస్తువు నొసగాడు దాన్ని సృష్టిస్తాడు మరియు మార్గంచూపాడు}{తాహా :50 }అల్లాహ్ భూమ్యాకాశాలలో ఉన్న సమస్తాన్ని మనిషికి లోబర్చాడు,మరియు అనేక అనుగ్రహాలతో అతనిని ఆవరించాడు,తద్వారా అతను అల్లాహ్'ను ఆరాధించాలి మరియు తిరస్కరించకూడదు.మహోన్నతుడైన అల్లాహ్' సెలవిచ్చాడు:{ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు!}{లుఖ్మాన్ :20}.భూమ్యాకాశాలలో ఉన్న సమస్తాన్నిఅల్లాహ్ మనిషి కోసం లోబరిచినట్లే,ఆయనే మనిషిని కూడా సృష్టించాడు,అతనికి అవసరమైన ప్రతీదీ చెవులు,కంటిచూపు మరియు హృదయం'అమర్చాడు,తద్వారా అతను తన ప్రభువును గుర్తించడానికి ,సృష్టికర్త వైపుకు మార్గనిర్దేశం చేసే ప్రయోజనకరమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి" అల్లాహ్' సెలవిచ్చాడు:-{మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని.}[అన్-నహ్ల్ : 78 ]

మహోన్నతుడు పరమపవిత్రుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ లోకాలన్నింటినీ సృష్టించాడు,మనిషిని సృష్టించాడు మరియు అతనికి అవసరమైన అవయవాలు,బలాలతో సహా అతన్ని సిద్ధం చేశాడు.పిదప అతను అల్లాహ్'ను ఆరాధించడానికి మరియు భూ భవనాలను నిర్మించేందుకు సహాయపడే ప్రతిదాన్ని అతనికి అందిచాడు,ఆపై ఆకాశం మరియు భూమిలోని ప్రతిదీ అతనికి లోబర్చాడు.

అల్లాహ్ ఈ సమస్త జీవులను సృష్టించి తన రుబూబియ్యతు/పరిపోషకత్వాన్ని నిరూపించాడు ఇది ఆయనే వాస్తవ దైవం అనే విషయాన్ని తప్పనిసరిచేస్తుంది.{వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?"}(యూనస్:31)పరమపవిత్రుడైన అల్లాహ్' సెలవిచ్చాడు :{వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."}[అల్ అహ్'ఖాఫ్:4].మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతో పాటు కదలకుండా ఉండాలని; మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేసాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను) ఉత్పత్తి చేశాము.ఇదంతా అల్లాహ్ సృష్టియే! ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి.అలా కాదు ఈ దుర్మార్గులు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.}{లుఖ్మాన్ :10-11}పరమపవిత్రుడైన అల్లాహ్' సత్యం సెలవిచ్చాడు :{వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?}{లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.}{వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?}{అత్తూర్ :35-37}షైఖ్ సాదీ రహిమహుల్లాహ్ తెలిపారు :మరియు ఇది వారికి వ్యతిరేఖంగా ఒక ఆదేశంతో రుజువు పరుస్తుంది,దీంతో వారు సత్యాన్ని స్వీకరించడం లేదా బుద్ది,ధర్మాల నుండి తొలగిపోవడం జరుగుతుంది.తఫ్సీర్ ఇబ్ను సాదీ :816

అల్లాహ్ ఆయనే విశ్వంలోని ప్రతీ వస్తువుకి సృష్టికర్త,అది మనకు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు,ఆయన మినహా సమస్తం ఆయనకు సృష్టితాలే మరియు అల్లాహ్ యే భూమ్యాకాశాలను ఆరు రోజుల్లో సృష్టించాడు.

అల్లాహ్ ఆయనే విశ్వంలోని ప్రతీ వస్తువుకి సృష్టికర్త,అందులో మనం కొన్ని చూడగలుగుతాము మరికొన్ని చూడలేము,ఆయన మినహా సమస్తం ఆయనకు సృష్టితాలే;మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)}[అర్రాద్:16].మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు ఆయన మీకు తెలియనివి ఎన్నోసృష్టిస్తున్నాడు.}[అన్-నహ్ల్ :8]మరియు అల్లాహ్ యే భూమ్యాకాశాలను ఆరు రోజుల్లో సృష్టించాడు:-{ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతో పాటు ఉంటాడు మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.}[అల్ హదీదు :4]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు.}[ఖాఫ్ : 38 ]

పరమపవిత్రుడు మహోన్నతుడైన అల్లాహ్ కు తన సామ్రాజ్యంలో ,సృష్టిలో,నిర్వహణలో లేదా ఆరాధనలో ఎలాంటి భాగస్వామి లేడు.

పరమపవిత్రుడు మహోన్నతుడైన అల్లాహ్ యే 'విశ్వసామ్రాజ్యాలకు అధినేత,తన సామ్రాజ్యంలో,సృష్టిలో,నిర్వహణలో లేదా ఆరాధనలో ఆయనకు సరిసాటి ఏ భాగస్వామి లేడు.అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ప్రార్థిస్తున్న వాటిని గురించి ఆలోచించారా? అయితే నాకు చూపండి. వారు భూమిలో ఏమి సృష్టించారో? లేదా, వారికి ఆకాశాలలో ఏదైనా భాగముందా? మీరు సత్యవంతులే అయితే, దీనికి (ఈ ఖుర్ఆన్ కు) ముందు వచ్చిన ఏదైనా గ్రంథాన్ని లేదా ఏదైనా మిగిలి ఉన్న జ్ఞానాన్ని తెచ్చి చూపండి."}[అల్ అహ్'ఖాఫ్:4]షైఖ్ స'అది' రహిమహుల్లాహ్ చెప్పారు :-{అనగా:-అల్లాహ్'తోపాటు విగ్రహాలను,సహచరులను సాటికల్పించే ఈ జనులకు {మీరు చెప్పండి ఓ ప్రవక్త } వారు ఎలాంటి లాభనష్టాలకుగానీ,జీవనమరణాలకు గానీ,మరణాంతరజీవనం పట్లగానీ అనువంతకూడా అధికారం కలిగిలేరు.మీరు వారికి స్పష్టంగా చెప్పండి-వారి ఆ విగ్రహాలు చాలా బలహీనమైనవి మరియు ఆరాధనకు ఏమాత్రం అర్హత కలిగి లేవు'{నాకు మీరు చూపించండి భూమిలో వారు ఏమి సృష్టించారు?లేక ఆకాశాలలో వారికేమైనా భాగస్వామ్యం ఉందా?}వారు భూమ్యాకాశాల నిర్మాణం లో ఏదైనా నిర్మించారా?వారు పర్వతాలు నిర్మించారా?వారు నదులను ప్రవహింపచేసారా?వారు జీవరాశులను వ్యాపింపచేశారా?వారు చెట్లను వృక్షాలను నాటారా?లేక వీటి నిర్మాణంలో వారెవరైనా ఏదైనా సహాయం చేశారా?ఇందులో వారే కాదు మరెవరూ ఏమీ చేయలేదని స్వయంగా వారే అంగీకరిస్తారు,నిజానికి ' అల్లాహ్ ను తప్పఇతరుల ఆరాధన చేయడమనేది అన్యాయం అని నిరూపించడానికి ఇది ఒక హేతుబద్ధమైన బలమైన గట్టిరుజువు.}ఆపై లిఖితపూర్వక ఆధారాలు కూడా లేవనే విషయాన్ని ప్రస్తావించింది:- ఇలా సెలవిచ్చాడు {దీనికి ముందు ఏమైనా పుస్తకం ఆధారం ఉంటే తీసుకురండి}-షిర్కు వైపుకు పిలిచే ఏదైనా ఒక ఆధారం,ప్రమాణం {లేక విద్య/జ్ఞానపరమైన ఆధారం}దైవప్రవక్తలతో వారసత్వంలో షిర్కు చేయమని ఆదేశించిన ఏదైన రుజువు',కాబట్టి తెలిసిందేమిటంటే వారు ఏ ఒక్క ప్రవక్త నుండి కూడా షిర్కు ఆజ్ఞాపించినట్లుగా నిరూపించడంలో విఫలమవుతారు,కానీ వాస్తవానికి దైవప్రవక్తలందరూ'తమప్రభువు యొక్క తౌహీద్ ఏకత్వం వైపుకు'ఆహ్వానించారు మరియు షిర్కుబిల్లాహ్ ను ఖండించారు అని మేము దృఢంగా నమ్ముతాము,మరియు ఇదియే వారినుండి జ్ఞానపరంగా లభించిన గొప్పరుజువు)తఫ్సీర్ ఇబ్ను సాదీ :779పరమపవిత్రుడు మహోన్నతుడైన అల్లాహ్'యే సర్వసామ్రాజ్యాధినేత,తన సామ్రాజ్యంలో ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు.{ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు}.[ఆలే ఇమ్రాన్ :26]మరియు మహోన్నతుడైన అల్లాహ్ స్పష్టంగా తెలిపాడు:- పరలోకదినాన 'సర్వసామ్రాజ్యం 'తన ఆధీనం లో ఉంటుంది.ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ అయిన అల్లాహ్ దే![గాఫిర్:16]8-పరమపవిత్రుడు మహోన్నతుడైన అల్లాహ్ కు తన యజమాన్యంలో (స్వాధీనంలో),సృష్టిలో,నిర్వహణలో లేదా ఆరాధనలో ఎలాంటి భాగస్వామి లేడు:-మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-ఇంకా ఇలా అను: "సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటు వంటి అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి!"[అల్ ఇస్రా :111]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.[అల్ ఫుర్ఖాన్ : 2]ఆయనే సర్వాధినేత(యజమాని) మరియు మిగతావన్నీపవిత్రుడైన ఆయనకే సొంతం,ఆయనే సృష్టికర్త, మరియు మిగతావన్నీ ఆయనచే సృష్టించబడ్డాయి,ఆయనే సర్వవ్యవహారాలను నిర్వహిస్తాడు,ఈ కీర్తి ఇంకెవరికి ఉంది,కనుక ఆయనను ఆరాధించడం విధి,ఇతరుల ఆరాధన పిచ్చితనాన్నిసూచిస్తుంది,షిర్కు ప్రాపంచిక,పరలోక జీవితాన్ని నాశనం చేస్తుంది.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{మరియు వారంటారు: "మీరు యూదులుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది!" వారితో అను: "వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకదైవ సిద్ధాంతం (హనీఫా). మరియు అతను బహు-దైవారాధకుడు కాడు."}[అల్ బఖర:135]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.}[నిసా :125]పరమపవిత్రుడైన అల్లాహ్ న్యాయాన్నిస్పష్టపరుస్తూ చెప్పాడు 'ఎవరైతే తనమితుడైన ఇబ్రాహీం ధర్మాన్ని వదలి మరొక దాన్ని అనుసరిస్తాడో అతను తనని అవివేకానికి గురిచేసుకున్నాడు,మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :-మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.[అల్ బఖర :130]

అల్లాహ్ పరమపవిత్రుడు,మరియు అల్లాహ్ పరమపవిత్రుడు అతను ప్రసవించలేదు,ప్రసవించబడలేదు,ఆయనకు సరిసమానమైనది కానీ పోలినదికానీ ఏదీ లేదు.

అల్లాహ్ పరమపవిత్రుడు అతను ప్రసవించలేదు,ప్రసవించబడలేదు,ఆయనకు సరిసమానమైనది కానీ పోలినదికానీ ఏదీ లేదు:-మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.}అల్లాహ్ ఏ అవసరం లేనివాడు.(నిరుపేక్షాపరుడు){ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.}{మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."}[అల్ ఇఖ్లాస్:1-4]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:"ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?"[మర్యం :65]మరియు సత్యవంతుడు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సెలవిచ్చాడుఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. ఈ విధంగా, ఆయన మిమ్మల్ని వ్యాపింప జేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.[షూరా :11]

అల్లాహ్ పరమపవిత్రుడు మహోన్నతుడు,ఆయన తన సృష్టితాల్లో ఏ జీవిలోకి ప్రవేశించడు మరియు ఏ జీవి శరీరఆకృతుని దాల్చడు

పరమపవిత్రుడు మహోన్నతుడు అల్లాహ్,ఆయన తన సృష్టి జీవుల్లో ఏ జీవిలోకి ప్రవేశించడు మరియు వాటి ఏ ఆకృతుని దాల్చడు.దేనిలో లీనమవ్వడు,ఎందుకంటే 'ఆయనే సృష్టికర్త మిగతావన్నీ ఆయన సృష్టితాలు,ఆయన సజీవుడు మిగతావన్నీ నశించిపోతాయి,ప్రతీది ఆయన ఆధీనంలో ఉంది మరియు ఆయనే యజమాని,అల్లాహ్ తన సృష్టి యొక్క ఏ జీవిలో ప్రవేశించడు,మరియు సృష్టిలోని ఏ జీవి పరమపవిత్రుడైన ఆయన అస్తిత్వంలో ప్రవేశించదు,మరియు మహోన్నతుడు పవిత్రుడైన అల్లాహ్ సమస్తజీవుల కంటే పెద్దవాడు,మరియు అన్నింటికంటే మహోన్నతుడు.'ఎవరైతే అల్లాహ్'ను ఈసా మసీహ్'లో ప్రవేశించాడని వెర్రికూతలు కుశారో వారిని మహోన్నతుడైన అల్లాహ్ ఖండించాడు.{"నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (ఏసు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (ఏసు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు."}[అల్ మాయిదా :17]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.మరియు వారు: "అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు)." అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్న వన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి.ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది.{అల్ బఖర:115-117}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు."}(88)వాస్తవానికి, మీరు ఎంత పాపిష్ఠికరమైన విషయాన్ని కల్పించారు.దాని వలన ఆకాశాలు ప్రేలి పోవచ్చు! భూమి చీలి పోవచ్చు! మరియు పర్వతాలు ధ్వంసమై పోవచ్చు!ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.(91)ఎవరినైనా కొడుకునిగా చేసుకోవటం అనంత కరుణామయునికి తగినది కాదు.ఎందుకంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు.వాస్తవానికి, ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు మరియు వారిని సరిగ్గా లెక్క పెట్టి ఉన్నాడు.మరియు పునరుత్థాన దినమున వారందరూ, ఒంటరిగానే ఆయన ముందు హాజరవుతారు.[మర్యం :95-98]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.[అల్ బఖర :255 ]ఈ గొప్పతనం ఎవరిది?ఈ గొప్పతనం అతన్ని సృష్టించినవాడిది,అప్పుడు ఆయన వారిలో ఎందుకు ప్రవేశిస్తాడు?లేదా అతన్ని తన కుమారుడిగా ఎందుకు చేసుకుంటాడు? లేదా తనతో పాటు దైవంగా ఎందుకు చేస్తాడు?

మహోన్నతుడు పరమపవిత్రుడైన అల్లాహ్ తన దాసుల పట్ల అమితంగా కనికరించేవాడు మరియు దయచూపేవాడు కాబట్టి ఆయన ప్రవక్తలను ప్రభవింపచేశాడు మరియు గ్రంధాలను అవతరింపచేశాడు.

మహోన్నతుడు పరమపవిత్రుడైన అల్లాహ్ తన దాసుల పట్ల అమిత వాత్సల్యుడు,మరియు దయచూపేవాడు.ఆయన తన దాసులకు చూపిన జాలీదయలో ఒకటి 'ప్రవక్తలను ప్రజలవద్దకు ప్రభవింపచేయడం మరియు గ్రంధాలను అవతరింపచేశాడు,తద్వారా వారిని షిర్కు మరియు కుఫ్ర్ వంటి అంధకారాల నుండి తౌహీద్ మరియు హిదాయతు జ్యోతి వైపుకు అతను తీస్తాడు,మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{తన దాసుని (ముహమ్మద్)పై స్పష్టమైన ఆయాత్ (సూచనలు) అవతరింప జేసేవాడు ఆయనే! అతను వాటి ద్వారా మిమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి తీసుకు రావటానికి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని ఎంతో కనికరించేవాడు, అపార కరుణా ప్రదాత.}[అల్ హదీదు :9]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.}[అల్ అంబియా :107]మరియు అల్లాహ్ తన ప్రవక్తతో అల్లాహ్ తన దాసులకు అమితమైన వాత్సల్యం కురిపించువాడు మరియు దయామయుడు'అని చెప్పండి' ఆదేశించాడు.{నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.}{అల్ హజర్ : 49 }మరియు ఆయన చూపించిన జాలీ,కరుణలో ఇది కూడా ఒకటి :ఆయన కీడుని దూరం చేస్తాడు మరియు మంచిని మేలును తన దాసులపై దింపుతాడు,మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.}[యూనుస్ :107 ]

అల్లాహ్ ఆయన అత్యంత దయగల ప్రభువు,ఆయన ఏకైకుడు' పునరుత్థాన రోజున అతిత్వరలో తన సృష్టితాల లెక్క తీసుకుంటాడు వారందరినీ వారి సమాధుల నుండి లేపుతూ పునర్జన్మ ఇచ్చిన తదుపరి,ప్రతీ వ్యక్తికి అతను చేసిన మంచి,చెడులకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు,ఎవరైతే ఒక మోమిన్'విశ్వాసిగా ఉంటూ సత్కార్యాలు ఆచరిస్తాడో అతనికొరకు [పరలోకంలో] అంతమవ్వని శాశ్వత అనుగ్రహాలు ఉంటాయి,మరెవరైతే అవిశ్వసించి దుష్కార్యాలకు పాల్పడుతాడో అతనికొరకు పరలోకంలో అతిహీనమైన పెద్ద శిక్ష ఉంటుంది.

అల్లాహ్ ఆయన అత్యంత దయగల ప్రభువు,ఆయన ఏకైకుడే అతీత్వరలో పునరుత్థాన రోజున తన సృష్టితాల లెక్క తీసుకుంటాడు వారందరినీ వారి సమాధుల నుండి లేపుతూ పునర్జన్మ ఇచ్చిన తదుపరి,ప్రతీ వ్యక్తికి తాను చేసిన మంచి,చెడులకు తగ్గ ప్రతిఫలం ఆయన ఇస్తాడు,ఎవరైతే ఒక మోమిన్'విశ్వాసిగా ఉంటూ సత్కార్యాలు ఆచరిస్తాడో అతని కొరకు [పరలోకంలో] అంతమవ్వని అనుగ్రహాలు ఉంటాయి,మరెవరైతే అవిశ్వసించి దుష్కార్యాలకు పాల్పడుతాడో అతనికొరకు పరలోకంలో అతిహీనమైన పెద్ద శిక్ష ఉంటుంది.ఇది సృష్టితాలకు అల్లాహ్'న్యాయం,వివేకమర్మం మరియు దయను పరిపూర్ణపర్చడానికి జరుగుతుంది'ఈ ప్రపంచాన్ని ఆచరణల కొరకు మైదానంగా చేశాడు మరియు రెండవ నివాసం ఏర్పర్చాడు,అందులో బహుమతి,లెక్కింపు ,పుణ్యఫలాలు ఇవ్వబడుతాయి;చివరికి సద్వర్తనుడు తన ఉత్తమవైఖరికి పుణ్య ఫలాన్నిపొందుతాడు,నీచుడు,దుర్మార్గుడు,అపరాధి తన తప్పుకు,అన్యాయానికి బదులుగా శిక్షను పొందుతాడు,అయితే ఈ విషయం కొంతమందికి అరగకపోవచ్చు అంచేత ఆ అల్లాహ్ దీని కొరకు అనేక రుజువులను సిద్దంచేశాడు,అవి మరణాంతరజన్మను నిశ్చయపరుస్తూ అందులో ఎలాంటి సందేహంలేదు'అని నిరూపిస్తాయి.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :-{మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.}[ఫుస్సీలత్ :39]{మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:}{ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది}[అల్ హజ్జ్ :5 ]ఈ మూడు ఆయతుల్లో అల్లాహ్ మూడు హేతుబద్దమైన సాక్ష్యాలను ప్రస్తావించాడు అవి మరణాంతర జీవనం సత్యమని నిరూపిస్తాయి.అవి :-

1- నిశ్చయంగా మనిషిని మొట్టమొదట మట్టితో అల్లాహ్ యే సృష్టించాడు,ఎవడైతే మట్టితో సృజించడంలో శక్తిశామర్థ్యాలు కలిగిఉన్నాడో,అతనికి మట్టిగా మారిన తరువాత తిరిగి జీవనం పోయడంలో కూడా శక్తి ఉంటుంది.

2-వీర్యం నుండి మానవులను సృష్టించినవాడు ఆ మనిషిని మరణం తరువాత తిరిగి బ్రతికించడంలో కూడా శక్తిని కలిగి ఉంటాడు.

3-మృతభూమికి వర్షం ద్వారా తిరిగి జీవం పోసేవాడు,ప్రజలమరణం తరువాత తిరిగి వారికి పరలోకపునర్జన్మ ప్రసాదించగలడు,ఈ గొప్ప ఆయతు ఖుర్ఆను అద్భుతాన్ని'నిరూపిస్తుంది,-ఈ ఆయతు పొడువుగా లేనప్పటికి-ఒక క్లిష్టసమస్యకు మూడు ముఖ్యమైన ఆధారాలను సూచిస్తుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.}[అల్ అంబియా :104 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు.అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?"ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయన ప్రతి సృష్టి సృజన పట్ల జ్ఞానముకలవాడు"[యూనుస్ :78 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది!}(27)ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;(28)మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.(29)మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు.(30)దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;(31)మరియు పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు.(32)[నాజియాతు :27-32 ]భూమ్యాకాశాలది మరియు వాటిలో ఉన్నదాని నిర్మాణం కంటే మనిషి యొక్క నిర్మాణం కఠినమైనదేమి కాదు,ఆకాశాలను, భూమిని సృష్టించగలవాడికి మనిషిని రెండవసారి పునఃసృష్టించడంలో ఎలాంటి అడ్డు,బలహీనత ఉండదు.

పరమపవిత్రుడైన మహోన్నతుడైన అల్లాహ్ ఆదమ్ ను మట్టితో సృష్టించాడు,తరువాత అతని సంతానాన్నిఅధికంగా వ్యాప్తిపర్చాడు,నిజానికి ప్రజలందరి మూల దాతువు ఒక్కటే,ఒకరికి మరొకరిపై గానీ,ఒక జాతికి మరొక జాతిపై గానీ ఎలాంటి విశీష్టత,ఆధిక్యత లేదు,ఉంటే అది కేవలం తఖ్వా ఆధారంగానే ఉంది.

పరమపవిత్రుడైన మహోన్నతుడైన అల్లాహ్ ఆదమ్ ను మట్టితో సృష్టించాడు,తరువాత అతని సంతానాన్నిఅధికంగా వ్యాప్తిపర్చాడు,నిజానికి ప్రజలందరి మూల దాతువు ఒక్కటే,ఒకరికి మరొకరిపై గానీ,ఒక జాతికి మరొక జాతిపై గానీ ఎలాంటి విశీష్టత,ఆధిక్యత లేదు,ఉంటే అది కేవలం తఖ్వా ఆధారంగానే ఉంది-మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు}[అల్-హుజ్'రాత్ :13 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంధంలో వ్రాయబడనిదే, పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవరి వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్ కు ఎంతో సులభం.}[అల్-ఫాతిర్ :11]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).}[గాఫిర్:67]మరియు అల్లాహ్ స్పష్టంగా ఈ విషయాన్ని తెలిపాడు:-ఆయన మసీహ్ అలైహిస్సలాం ను 'అయిపో'అనే ఆజ్ఞ ద్వారా సృష్టించాడు,ఎలాగైతే ఆదమ్ ను మట్టితో అయిపో ఆజ్ఞ ద్వారా సృష్టించాడు,మహోన్నతుడైన అల్లాహ్ తెలిపాడు:-{నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం, ఆదమ్ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్ ను) మట్టితో సృజించి: "అయిపో!" అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు.}[ఆల్ ఇమ్రాన్ :59]మరియు ఇది పేరా నెంబర్ (2) లో ప్రస్తావించబడింది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ బోధించారు:- ప్రజలంతా సమానమే ఒకరికి మరొకరిపై ఎలాంటి ఆధిక్యత,విశీష్టత లేదు,కానీ అది కేవలం 'తఖ్వా'ఆధారంగా మాత్రమే ఉంది

ప్రతీ శిశువు 'సహజ స్వభావం'పై పుట్టించబడతాడు.

ప్రతీ శిశువు'సహజస్వభావం'పై పుట్టించబడతాడు.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.[రూమ్:30 ]'సిసలైన సన్మార్గం'ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ వారిదే అలైహిస్సలాం'మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :-తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు."[అన్నహ్ల్ :123]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{ప్రతీ శిశువు సహజగుణం పై పుట్టించబడతాడు,అయితే వారి తల్లిదండ్రులు అతన్ని యూదునిగా,లేక క్రైస్తవునిగా లేక మజూసిగా మార్చేస్తారు,ఎలాగైతే ఒక జంతువు పరిపూర్ణశిశువును కంటుంది అప్పుడు దానిలో నీవేమైన లోపాన్ని చూస్తావా?}పిదప అబూ హురైరా(రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు :-{కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు}.[రూమ్ :30]సహీహ్ బుఖారి 4775రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{'తస్మాత్! నిశ్చయంగా నా ప్రభువు నాకు ఆదేశించినది ఏమనగా మీకు తెలియని విషయాలను నన్నుబోధించమని ఈ రోజు వాటిని నాకు తెలియజేశాడు,నా దాసుడికి నేను ఇచ్చిన ప్రతీ సంపద హలాలుగావించినది,మరియు నేను నా సమస్త దాసులను ముస్లిములుగా పుట్టించాను,తరువాత వారి వద్దకి షైతానులు వచ్చి ధర్మం నుండి వారిని మార్గబ్రష్టులుగా మార్చారు,మరియు హలాలు విషయాలను హరాముగా నిషేదించారు మరియు వారికి నాతో పాటు ఇతరులను భాగస్వామ్యాన్ని కల్పించమని ఆదేశించాయి,యదార్ధమేమిటంటే అలాచేయమని నేను ఎలాంటి రుజువును పంపలేదు.}ముస్లిం ఉల్లేఖనం 2865

ఏ మానవుడు పుట్టుకతో పాపిగా లేదా ఇతరుల పాపానికి వారసుడిగా జన్మించడు.

మానవుల్లో ఎవరు పాపిగా లేదా ఇతరుల పాపానికి వారసుడిగా జన్మించలేదు,మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు తెలిపాడు : ఆదమ్ అలైహిస్సలాం దైవఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు - అతను మరియు అతని భార్య 'హవ్వా' చెట్టు నుండి తిన్నారు పిమ్మట అతను చేసినదానికి సిగ్గుపడి పశ్చాత్తాపం చెందారు మరియు అల్లాహ్'నుక్షమించమని అర్ధించారు,అప్పుడు అల్లాహ్ అతనికి శ్రేష్టమైన వాక్యాలతో ప్రార్ధించమని వాణి పంపారు అతను అలాగే ప్రార్ధించాడు ఆపై అల్లాహ్ వారిరువురి పశ్చాత్తాపాన్ని స్వీకరించి క్షమించాడు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.{మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు!"}{ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది."}{తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.}{మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!}[అల్ బఖర :35-38]అల్లాహ్ ఆదమ్ అలైహిస్సలాం యొక్క తౌబాను (క్షమాపణను)స్వీకరించిన ఆ తరువాత అతను పాపిగా పరిగణించబడలేదు,అందువల్ల'పశ్చాత్తాపం' ద్వారా తొలగించబడిన పాపానికి అతని సంతానం వారసులు కారు,మరియు ప్రాథమిక సూత్రం ఏమిటంటే 'ఒక వ్యక్తి మరొక వ్యక్తి భారాన్నిఎన్నటికీ మోయడు.అల్లాహ్ సెలవిచ్చాడు:{ప్రతి ప్రాణీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది.అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో,వాటిని మీకు తెలియజేస్తాడు."}{అల్ అన్ఆమ్ :164}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు.(a) మరియు మేము ప్రవక్తను పంపనంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము}[అల్ ఇస్రా :15]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా, నీవు వారినే హెచ్చరించ గలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు నమాజ్ ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్ వైపునకే మరలి పోవలసి ఉన్నది.[అల్ ఫాతిర్:18]

ప్రజల పుట్టుక పరమార్ధం,ముఖ్య ఉద్దేశ్యం: ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం.

ప్రజల పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశ్యం : ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు :-{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}[జారియాతు :56]

ఇస్లాం మనిషి కి (స్త్రీ-పురుషుడు)గౌరవం ఇచ్చింది అతని పూర్తి హక్కులను సంరక్షించింది,మరియు అతని బాధ్యతలలో,ఆచరణలో,నిర్వాహణలో జవాబుదారుడిగా చేసింది,మరియు జవాబుదారీతనాన్ని అతని పై అనివార్యపరిచింది అంటే అతని కర్మల ద్వారా స్వీయహానీ తలపెట్టడం లేదా ఇతరులకు హానీ తలపెట్టడం వంటివి.

ఇస్లాం స్త్రీ పురుషులను గౌరవించింది,అల్లాహ్ మనిషిని సృష్టించాడు తద్వారా అతను ఈ భూమికి ఉత్తరాధికారి(ఖలీఫా)కాగలడు.మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దైవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పాడు[అల్ బఖర :30]ఈ గౌరవం ఆదమ్ యొక్క ప్రతీ సంతానానికి వర్తిస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:{(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము. అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు, తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు.}[అల్ ఇస్రా :70 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాము.}[అత్ తీన్:4]మహోన్నతుడైన అల్లాహ్ మనిషిని 'తనకు కాకుండా ఇతర దైవాలకు, నాయకులకు,పండితులకు అనుచరులుగా'సేవకులుగా మారడాన్నినిషేధించాడు.అల్లాహ్ సెలవిచ్చాడు:-{అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను, అల్లాహ్ కు సాటి కల్పించుకుని, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్న వారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసినప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్ కే చెందుతుంది మరియు నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునే వారు).}[అల్ బఖర :165-166]మరియు పునరుత్తాన రోజున అనుచరుల మరియు నాయకుల యొక్క పరిస్థితి గురించి మహోన్నతుడైన అల్లాహ్ స్పష్టంగా తెలిపాడు:-{దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు!"}(32)మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు: "అలా కాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని - అల్లాహ్ ను తిరస్కరించి - ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు." మరియు వారు శిక్షను చూసినప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్ళు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా?[సబా :32-33]పరలోక దినాన పరమ పవిత్రుడు,మహోన్నతుడైన అల్లాహ్ చేసే న్యాయ పరిపూర్ణతలో ఒకటి ఏమనగా-'మార్గ బ్రష్టులైన దాయీలు,ఇమాములు తమ స్వీయపాపాలను మోయడంతోపాటు,అజ్ఞానంతో వీరు మార్గబ్రష్టులుగా మార్చిన వారి పాపాల భారాన్నికూడా ఆయన మోపిస్తాడు.అల్లాహ్ సెలవిచ్చాడు:-కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి![నహ్ల్ :25]ఇస్లాం మనిషికి చెందవలసిన హక్కులన్ని ఇహపరలోకాల్లో పరిరక్షించింది,మరియు ఇస్లాం సంరక్షించేహక్కుల్లో అన్నింటికంటే పెద్దది మరియు ప్రజలకు తెలియజేసినది ఏమనగా :- ప్రజలు నెరవేర్చాల్సిన అల్లాహ్'హక్కులు మరియు అల్లాహ్ తీర్చవలసియున్న ప్రజల హక్కులు.ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు :ఒకసారి నేను దైవప్రవక్త వెనుక ఉన్నాను,అప్పుడు ఆయన" ఓ మూఆజ్"అని పిలిచారు,నేను'లబ్బైక్ వ సఅదైక్"[హాజరు ప్రవక్త]అనిచెప్పాను.ప్రవక్త మళ్ళీ మూడు సార్లు అలాగే పిలిచారు:{ప్రజలు తీర్చవల్సిన అల్లాహ్ యొక్క హక్కులు ఏమిటోనీకు తెలుసా ?}అని అడిగారు నేను 'తెలియదు'అనిచెప్పాను,ప్రవక్తచెప్పారు {ప్రజలు తీర్చవల్సిన అల్లాహ్ యొక్క హక్కులు ఏమిటంటే ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయనకు ఇతరులను భాగస్వామ్యం కల్పించకూడదు,}మళ్ళీకాస్త సమయం గడిచాక 'ఓ ము ఆజ్'అని మళ్ళీ పిలిచారు,అప్పుడు నేను'లబ్బైక్ వ సఅదైక్"[హాజరు ప్రవక్త]అనిచెప్పాను.ప్రవక్త అడిగారు:{అల్లాహ్ తీర్చవల్సిన ప్రజల హక్కులు ఏమిటోనీకు తెలుసా?}వారు అలా చేసినప్పుడు :- ఆయన వారిని శిక్షించకూడదు}సహీహ్ బుఖారి (6840)మరియు ఇస్లాం మనిషి ధర్మాన్ని,సంతానాన్ని,సంపదను మరియు గౌరవాన్నిపరిరక్షిస్తుంది.మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:-[నిశ్చయంగా అల్లాహ్ మీపై మీ రక్తాలను,మీ సంపదలను మరియు మీగౌరవాలను పవిత్రపర్చాడు [నిషేధించాడు],మీఈరోజు,మీ ఈ మాసము మరియు మీ ఈ నగరముకు నొసగిన పవిత్రతవలె}సహీహ్ బుఖారి (6501)దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ గొప్పప్రకటన హజ్జతుల్ విదా రోజున చేసారు,ఆ రోజున లక్షమంది సహాబాలు హాజరయ్యారు,ఆయన ఈ అర్ధాన్ని పునరావృతం చేసి,నహర్ రోజున తాకీదు చేశారు.ఇస్లాం మనిషిని తన సమస్త అధికారాలు ,కార్యకలాపాలు మరియు వ్యవహారాలకు జవాబు దారీగా చేసింది.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు.}[అల్ ఇస్రా :13]అనగా అతను చేసిన మంచి లేదా చెడును అల్లాహ్ అతని కొరకు ఖచ్చితంగా లెక్కిస్తాడు,అతను చేసినవి ఇతరుల కొరకు లెక్కించడు మరియు ఇతరుల కర్మలతో అతని కర్మలను లెక్కించడు.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.}[అల్ ఇన్షిఖాక్:6 ]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.}[ఫుస్సీలత్:46]మరియు ఇస్లాం మనిషి చేసే ప్రతీ కార్యానికి అది అతనికి హనీచేసిన లేక ఇతరులకు హనీ చేసినా సరే!'పనికి జవాబు దారీగా చేస్తుంది.అల్లాహ్ సెలవిచ్చాడు:-{కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.}[నిసా :111]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఈ కారుణం వల్లనే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: "నిశ్చయంగా - ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ గాక - ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే, మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!" }[అల్ మాయిదా:32]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:అన్యాయంగా ఒకరిని ఎవరైనా హత్య చేసినట్లైతే అందులోని ఒక పాపం ఆదమ్ యొక్క మొదటి కుమారునికి చేరుతుంది,ఎందుకంటే హత్య చేసే సంప్రదాయాన్నిమొట్టమొదట ప్రారంభించింది అతనేకాబట్టిసహీహ్ ముస్లిం (5150)

ఇస్లాం,స్త్రీపురుషులిరువురిని కర్మలలో,జవాబుదారీలో,పుణ్యపాప ఫలాలలో సమానులుగా చేసింది

ఇస్లాం,స్త్రీ పురుషులిరువురిని కర్మలలో,జవాబుదారీలో,పుణ్యపాప ఫలాలలో సమానులుగా చేసింది.అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.}[అన్నిసా 124]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.}[అన్-నహ్ల్ :97]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు,పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది.}[గాఫిర్:40]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్మాగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.}[అల్ అహ్'జాబ్:35]

ఇస్లాం స్త్రీలను గౌరవిస్తుంది ,మరియు స్త్రీలను పురుషులకు సహోధరిమనులుగా పరిగణించింది,మరియు స్తోమత కలిగిన పురుషులపై వారి పోషణ ఖర్చులను తప్పనిసరి చేసింది,కూతురి పోషణ ఖర్చులను తండ్రి పై మరియు తల్లి సంరక్షణా ఖర్చులను యువకుడు,సమర్ధుడైన కుమారుడి పై ,అలాగే భార్య పోషణ ఖర్చులను [బాధ్యతను]భర్త పై విధి పరిచింది.

మరియు ఇస్లాం స్త్రీలను పురుషులకు [సహవర్తులుగా]సహోధరిమనులుగా పరిగణించింది.మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{నిశ్చయంగా స్త్రీలు [షరీఅతు నిర్వహణలో]పురుషులకు సహవర్తులు/సహోధరిమనులు}తిర్మిజీ ఉల్లేఖనం[113]ఇస్లాం స్త్రీకు ఇచ్చిన గౌరవంలో ఒకటి"తల్లి పోషణ ఖర్చులను సమర్ధుడైన ఆమె కుమారుడి పై విధిపరిచింది.మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:"ఇచ్చేవారి చేయి గొప్పది,మొదట ఖర్చు చేయండి: మీ తల్లి మరియు తండ్రి పై, మీ సోదరి మరియు సోదరుడు, తరువాత మీకు సన్నిహితంగా ఉండే మీ బంధువులు"దాన్ని ఇమామ్ అహ్మద్ ఉల్లేఖించారుతల్లిదండ్రుల స్థానం,విశీష్టత గురించి వివరణ పేరా నెం.(29'లో)రాబోతుంది.[బిఇజినిల్లాహ్].ఇస్లాం స్త్రీకు ఇచ్చిన గౌరవంలో ఒకటి-'భార్య పోషణ ఖర్చులను భర్తపై స్తోమత మేరకు తప్పనిసరి చేసింది అల్లాహ్.సెలవిచ్చాడు.{సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చు పెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధి గల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దాని కంటే మించిన భారం వేయడు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు.}[అత్-తలాక్ :7]మరియు ఒక వ్యక్తి మహాదైవప్రవక్త తో ఇలా ప్రశ్నించాడు :- భర్త నెరవేర్చవలసిన భార్య హక్కులు ఏమిటి?దానికాయన సమాధానమిచ్చారు:- {నీవు తిన్నది ఆమెకు తినిపించు,నీవు ధరించినప్పుడు ఆమెకు కూడా వస్త్రధారణ చేయి,మరియు ఆమె ముఖంపై కొట్టకు మరియు ఆమెను చెడుగా దూషించకూ!}దాన్ని ఇమామ్ అహ్మద్ ఉల్లేఖించారుమరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భర్త పై భార్యలకు గల కొన్ని హక్కులను స్పష్టంగా తెలిపారు:-"మరియు వారి కొరకు మీపై గల బాధ్యత వారికి ఉత్తమంగా తినిపించడం,వస్త్రాధారణ చేయడం"సహీహ్ ముస్లింమరియు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:"ఒక వ్యక్తిని పాపాత్ముడని భావించడానికి ఇది చాలు అది ఏమనగా 'తన [సంరక్షణలో]బాధ్యతలో ఉన్నవారిపట్ల నిర్లక్ష్యంవహించడం"ఇమామ్ అహ్మద్ దీనిని ఉల్లేఖించారుమరియు ఇమామ్ ఖత్తాబీ తెలిపారు :-{("من يقوت")'అతని ఖర్చుకు అసలు హక్కుదారులు 'అర్ధం ఏమనగా'బహుశా దాత కు చెప్పి ఉండవచ్చు :- నీ ఇంటిల్లిపాదిని వదిలి పుణ్యఫలార్జనకై ప్రాముఖ్యత లేని దానిలో ఖర్చు చేయకూడదు,అలా చేసి నువ్వు వారిని వృధాపరిస్తే అది పాపంగా నీకు చుట్టుకుంటుంది.}ఇస్లాం మహిళలకు నొసగిన గౌరవాల్లోఒకటి 'తండ్రిపై కూతురి ఖర్చులను అనివార్యపర్చడం,అల్లాహ్ సెలవిచ్చాడు:-{పూర్తి రెండు సంవత్సరాల పాలగడువు పూర్తి చేయవలెనని (తల్లిదండ్రులు) కోరినట్లయితే,తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది.}[అల్ బఖర:233]అల్లాహ్ తాలా బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి గురించి చెప్తూ 'తన బిడ్డకు ఉత్తమరీతిలో తిండి,బట్ట సౌకర్యాన్ని కల్పించాలి అల్లాహ్ సెలవిచ్చాడు:-ఒకవేళ వారు మీ బిడ్డకు పాలు పట్టడాన్ని సమ్మతీస్తే,వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి.[తలాక్:6]శిశువుకు అయ్యే పాల ఖర్చులను అల్లాహ్ తండ్రిపై అనివార్యం చేశాడు,కాబట్టి శిశువు ఖర్చులు తండ్రి యొక్క బాధ్యత,ఆ శిశువు మగ లేదా ఆడ కూడా కావచ్చు,ఈ క్రింది హదీసు భార్య మరియు పిల్లల ఖర్చులు తండ్రి పై తప్పనిసరి అని సూచిస్తుంది.ఆయెషా రదియల్లాహు అన్హా కథనం:- ఒకసారి హిందా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకి వచ్చి ఇలా ఫిర్యాదు చేసుకుంది :- నిశ్చయంగా అబూ సుఫ్యాన్ ఒక పిసినారి వ్యక్తి,కాబట్టి నాకు అతని డబ్బు తీయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది'ప్రవక్త చెప్పారు:-నీకు మరియు నీ పిల్లలకు సరిపడా డబ్బును ఉత్తమరీతిలో తీసుకో'అని చెప్పారు.దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కూతుళ్లపై,అక్కచెల్లళ్లపై ఖర్చు చేసే ప్రాముఖ్యతను గురించి ఈ విధంగా తెలియజేశారు:-{ఎవరికైతే ఇద్దరు లేదా ముగ్గురు కుమార్తెలు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సొదరీమనులు కలిగి వారిని తన మరణం వరకు పోషించినట్లైతే నేను మరియు అతను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన రెండు వేళ్ళతో చూపుడు వేలు,మధ్యవేలుతో సైగచేస్తూ చూపించారు}సిల్'సిలతు సహీహా 296

మరణం జీవితానికి శాశ్వత ముగింపు కాదు,మరణం అంటే మనిషి కార్యాచరణల గూటి నుండి ప్రతిఫలాల గూటికి చేరడం'మృత్యువు శరీరం మరియు ఆత్మను కలిగి ఉంటుంది,ఆత్మ యొక్క చావు అంటే శరీరం నుండి అది వేరు చేయబడటం,పిదప పరలోకదినాన మళ్ళీ తిరిగి మరలించడం,మరణాంతరం ఆత్మ మరొక శరీరాన్ని ధరించదు,మరొక నూతన పునర్జన్మ ఉండదు,పునర్జన్మ అనే వాదన మెదడు,ఆచరణ పరంగా ఏ విధంగా రూడీ అవ్వలేదు,దైవప్రవక్తల నుండి దీనిని రుజువుపర్చే ఎటువంటి సాక్ష్యాధారాలు మనకు కనిపించవు.

మరణం అనేది శాశ్వత ముగింపు కాదు అల్లాహ్ తెలియజేశాడు:-{వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."}[సజ్దా :11]మృత్యువు శరీరం మరియు ఆత్మను కలిగి ఉంటుంది,ఆత్మ యొక్క చావు అంటే శరీరం నుండి దాన్ని వేరుచేయడం,మళ్ళీ దాన్ని పరలోకదినాన తిరిగి పంపడం.అల్లాహ్ సెలవిచ్చాడు:-అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[జుమర్:42]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:'ఆత్మ వశపర్చుకోబడినప్పుడు నిశ్చయంగా కళ్ళు దానిని అనుసరిస్తాయి'ముస్లిం ఉల్లేఖనం 920మనిషి మరణాంతరం కార్యాచరణలగూటి నుండి ప్రతిఫలాల గూటికి చేరుతాడు'అల్లాహ్'సెలవిచ్చాడు.{ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి.}[యూనుస్:4]

మరణాంతరం ఆత్మ మరొక నూతన శరీరాన్ని ధరించదు,పునర్జన్మ లేదు,పునర్జన్మ అనే వాదనకు మెదడు,ఆచరణ రూపంగా ఏ విధంగా రూడీ అవ్వలేదు,దీనిని దైవప్రవక్తల నుండి రుజువుపర్చే ఎటువంటి సాక్ష్యాధారాలు మనకు కనిపించవు.

ఇస్లాం విశ్వాసపు [ఈమాన్] గొప్ప మౌలికసూత్రాల ఆధారంగా విశ్వసించమని ఆహ్వానిస్తుంది,అవి అల్లాహ్ పట్ల,ఆయన (దైవ) దూతల పట్ల విశ్వాసం,దైవగ్రంధాలగు తౌరాతు,ఇంజీలు,జబూర్ (వాటి వక్రీకరణకు మునుపు)మరియు పవిత్ర ఖురాను గ్రంధం ను విశ్వసించడం,సమస్త దైవప్రవక్తలను,సందేశహరులను విశ్వసించడంతో పాటు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారందరిలో అంతిమ ప్రవక్తగా విశ్వసించాలి,మరియు పరలోక దినాన్నివిశ్వసించాలి,మనకు తెలుసు ఒకవేళ ఈ ప్రాపంచిక జీవితమే శాశ్వత ముగింపు,అంతం అయితే మన ఈ జీవిత ఉనికి పనికిరాని చెత్తలాంటిది,మరియు తక్దీర్ పట్ల విశ్వాసం కలిగి ఉండటం.

ఇస్లాం విశ్వాసం [ఈమాన్] యొక్క గొప్ప మౌలిక సూత్రాల ఆధారంగా విశ్వసించమని ఆహ్వానిస్తుంది,సమస్త ప్రవక్తలు,సందేశహరులు{అలైహిముస్సలాం}కూడా దీని వైపునకే ఆహ్వానించారు.అవి:-

మొదటిది :- అల్లాహ్ యే ప్రభువు,సృష్టికర్త,ఉపాధికర్త మరియు ప్రణాళిక నిర్వహణ కర్త'అని విశ్వసించాలి,ఎందుకంటే ఆయన ఏకైకుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు,ఆయన తప్ప మిగతా వారందరి ఆరాధనలు ఖండించబడినవి,ఆయన తప్ప ఆరాధించబడే ప్రతీది అసత్యమే,కేవలం ఆయనకు మాత్రమే ఆరాధన శోభిస్తుంది,ఆయనకు చేయబడే ఆరాధన మాత్రమే ఫలిస్తుంది,ఈ అంశానికి సంబంధించిన ఆధారాలు పేరా నెంబర్ (8) లో వివరించబడ్డాయి.

అల్లాహ్ తఆలా ఈ గొప్ప మౌలిక సూత్రాలను పవిత్ర ఖురాను గ్రంధంలో అనేక ఆయతుల్లో ప్రస్తావించాడు అందులోని ఒక ఆయతులో ఆయన ఇలా సెలవిచ్చాడు:-{ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి,తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది}[అల్ బఖర :285]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{(వినయ విధేయత,ధర్మనిష్ఠాపరత్వం) సదాచారణ అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమ దినాన్ని, దైవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను విడిపించడానికి వ్యయపరచడం, మరియు నమాజ్ ను స్థాపించడం, జకాత్ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తి చేయడం. మరియు దురవస్థలో మరియు అపత్కాలాలలో మరియు యుద్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటి వారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.}[అల్ బఖర :177]అల్లాహ్ తాలా ఈ మౌలిక సూత్రాలతోపాటు ఈమాన్ వైపుకు ఆహ్వానించాడు,మరియు వీటిని ధిక్కరించినవాడు తిరస్కరించినవాడు బహుదూరబ్రష్టత్వానికి లోనయ్యాడు అని దైవం తెలియజేశాడు,అల్లాహ్ సెలవిచ్చాడు.{ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!}[నిసా :136]ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కథనం తెలియజేశారు:-మేము ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్ద కూర్చుని ఉన్నాము అప్పుడు మా వద్దకి అతితెల్లని దుస్తులతో,అత్యంత నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నఒక వ్యక్తి వచ్చాడు,అతని పై ఎటువంటి ప్రయాణ ఆనవాలు కనిపించలేదు మరియు మాలోని ఎవ్వరికీ అతని గురించి తెలియదు,అతను దైవప్రవక్త వద్దకి వచ్చి తన మోకాళ్ళను ప్రవక్త మోకాళ్ళతో కలిపి కూర్చుని తన రెండు అరచేతులను రెండు తొడలపై పెట్టుకుని ముఖాముఖీ కూర్చున్నాడు,ఇలా అడిగాడు :- ఓ ముహమ్మద్ నాకు ఇస్లాం అంటే ఏమిటి?తెలియజేయండి అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సమాధానమిస్తూ తెలియజేశారు :-{ ఇస్లాం'అంటే అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం మరొకడు లేడు,మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ దైవ సందేశహరుడు అని నువ్వు సాక్ష్యం చెప్పాలి,నమాజును స్థాపించాలి,జకాతు చెల్లించాలి,రమదాను ఉపవాసాలు పాటించడం,కాబతుల్లాహ్ యొక్క హజ్జ్ అది చేయగలిగే స్తోమత ఉంటే.చేయడం}దానికి ఆ వ్యక్తి'మీరు సత్యం చెప్పారు'అని దృవీకరించాడు,ఉల్లేఖఖుడు చెప్తున్నారు 'మాకు'అతను ఆశ్చర్యకరంగా కనిపించాడు అతను ప్రశ్నించాడు తిరిగి సమాధానాన్ని దృవీకరిస్తున్నాడు'ఆపై మళ్ళీ'నాకు 'ఈమాన్'అంటే ఏమిటి తెలియజేయండి'?అని అడిగాడు ప్రవక్త ఇలా బదులిచ్చారు : {నువ్వు అల్లాహ్ ను ఆయన దైవదూతలను,ఆకాశగ్రంధాలను,దైవప్రవక్తలను మరియు పరలోకదినాన్ని విశ్వసించడం మరియు మంచి,చెడు విధివ్రాతను విశ్వసించడం} ఆ వ్యక్తి ఇలా చెప్పాడు { మీరు సత్యం చెప్పారు,ఇలా అడిగాడు 'నాకు ఇహ్'సాన్'అంటే ఏమిటి ?తెలియజేయండి,ప్రవక్త బదులిచ్చారు :{బహుశా నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించాలి,ఒకవేళ అది సాధ్యపడకపోతే ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అని భావించి ఆరాధించాలి}సహీహ్ ముస్లిం (8)ఈ హదీసు ప్రకారం జీబ్రీల్ అలైహిస్సలాం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకి వచ్చారు,ధర్మం యొక్క దశలు అనగా 'అల్ ఇస్లాం,అల్ ఈమాన్,అల్-ఇహ్'సాన్,గురించి ఆయనను అడిగారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ జీబ్రీల్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆ పిమ్మట దైవప్రవక్త సహచరులతో మీ వద్దకి జీబ్రీల్ అలైహిస్సలాం మీకు జ్ఞానబోధ చేయడానికి వచ్చాడు అని తెలిపారు,ఇదియే ఇస్లాం దైవసందేశం,జీబ్రీల్ అలైహిస్సలాం దాన్ని తీసుకొచ్చారు,దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రజలకు భోదించారు,దాన్ని సహచరులు[రదియల్లాహు అన్హుమ్] కంఠస్తపరుచుకున్నారు, దైవప్రవక్త అనంతరం వారు ప్రజలకు ఆ సందేశాన్ని చేర్చారు.రెండవది:- దైవదూతలను విశ్వసించడం,వీరు అగోచర లోకానికి చెందినవారు,అల్లాహ్ వారిని సృష్టించాడు,ఒక నిర్దిష్ట రూపంలో సృజించాడు,వారికి గొప్ప కార్యక్రమాల బాధ్యతను అప్పగించాడు,ఆ గొప్ప కార్యక్రమాలలో ఒకటి:-అల్లాహ్ సందేశాలను, దైవాదేశాలను అల్లాహ్ ప్రవక్తలకు,సందేశహరులకు (అలైహిముస్సలాం) చేరవేయడం,ఆ దైవదూతలలో గొప్పవాడు,నాయకుడు జీబ్రీల్ అలైహిస్సలాం,దైవప్రవక్తల వద్దకి జీబ్రీల్ అలైహిస్సలామ్ దైవవాణి తీసుకుని అవతరించాడని కొన్ని సాక్ష్యాధారాలు రూడి పరుస్తున్నాయి:అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-ఆయనే తన ఆజ్ఞతో,దైవదూతల ద్వారా,దివ్యజ్ఞానాన్ని(రూహ్ ను) తాను కోరిన,తన దాసులపై అవతరింపజేస్తాడు,వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి:"నిశ్చయంగా,నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"}[అన్ నహ్ల్ :2]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం)}(192)దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;(193)నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;(194)స్పష్టమైన అరబీ భాషలో!(195)నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.(196)[షుఅరా:192-196]మూడవది :- (వక్రీకరణకు మునుపు)దైవగ్రంధాలగు తౌరాతు,ఇంజీలు,జబూర్ మరియు పవిత్ర ఖురానుగ్రంధం ను విశ్వసించడం,అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!}[నిసా :136]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంధాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు.}(3)దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు.నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది.మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు,ప్రతీకారం తీర్చుకోగలవాడు.[ఆల్ ఇమ్రాన్:3-4]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తన పై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}[అల్ బఖర :285]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి-"మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరపు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము.వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము.మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము."}[ఆల్ ఇమ్రాన్ :84]నాలుగవది:సమస్తప్రవక్తలను,సందేశహరులను(అలైహిముస్సలాం) విశ్వసించడం,సమస్తప్రవక్తలను సందేశహరులను విశ్వసించడం మరియు వారందరూ అల్లాహ్ వైపునుండి పంపబడిన ప్రవక్తలుగా,తమ తమ జాతి ప్రజలకు దైవ సందేశాలను ఉపదేశించారని నమ్మడం విధి,అనివార్యం.అల్లాహ్ సెలవిచ్చాడు:-{(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరుపు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము."}[అల్ బఖర :136]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}[అల్ బఖర :285]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరుపు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."}[ఆల్ ఇమ్రాన్ :84]మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆ సందేశహరులలో చిట్టచివరివాడిగా,అంతిమ ప్రవక్త అని విశ్వసించాలి.{మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని(a) (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది."అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు:"అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.}[ఆల్ ఇమ్రాన్ :81]సమస్త ప్రవక్తలను,సందేశహరులను(అలైహిముస్సలాం) విశ్వసించడాన్నీ ఇస్లాం విధి పరిచింది అలాగే ఆ సందేశహరులలో చిట్టచివరి వాడిగా,అంతిమ ప్రవక్తగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్'ని విశ్వసించడాన్ని తప్పనిసరిచేసింది.{ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరుపు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!"}[అల్-మాయిదా :68]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:ఇలా అను:" ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే:'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.[ఆల్ ఇమ్రాన్ :64]ఇందులో ఏ ఒక్క ప్రవక్తను తిరస్కరించిన అతను సమస్త ప్రవక్తలను,సందేశహరులను ధిక్కరించినదానికి సమానం.అల్లాహ్ తఆలా నూహ్ అలైహిస్సలాం జాతీ ప్రజలనుద్దేశించి ఆదేశించిన తన సందేశం గురించి ఇలా తెలిపాడు.{నూహ్ జాతి,సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.}[అష్షుఅరా :105]మనకు తెలుసు నూహ్ అలైహిస్సలాం కు మునుపు కానీ,ఆయనతో పాటు కానీ ఏ ప్రవక్త ఆవిర్భవించలేదు నూహ్'జాతీయులు ఆయనను ధిక్కరించారు అయితే ఈ దిక్కరణ ఆ జాతీ ప్రజల నుండి నూహ్'పట్ల జరిగింది,ఆయనకు జరిగిన ధిక్కారణ సమస్త ప్రవక్తల,సందేశహరుల ధిక్కారణగా భావించబడింది,ఎందుకంటే వారందరి ఆహ్వానం ఒక్కటే మరియు లక్ష్యం కూడా ఒక్కటే.ఐదవది;- పరలోకదినం పట్ల విశ్వాసం కలిగియుండటం,అది ప్రళయం రోజు,ప్రాపంచిక జీవితము ముగింపు రోజు ఆ నాడు అల్లాహ్ 'ఇస్రాఫీల్'దూతకు 'సయిఖ్ 'శంకం పూరించమని ఆజ్ఞాపిస్తాడు,అతను సయిఖ్'ను పూరిస్తాడు,అల్లాహ్ తలచిన సమస్తం మరణిస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు.}[జుమర్:68]అయిదవది;-పరలోకదినం పట్ల విశ్వాసం కలిగియుండటం,అది ప్రళయంరోజు,ప్రాపంచిక జీవితము ముగింపు రోజు ఆ నాడు అల్లాహ్ 'ఇస్రాఫీల్'దూతకు 'సయిఖ్ 'శంకం పూరించమని ఆజ్ఞాపిస్తాడు,అతను సయిఖ్'ను పూరిస్తాడు,అల్లాహ్ తలచిన సమస్తం మరణిస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{(జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.}[అల్ అంబియా :104 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.}[జుమర్:67]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{'ప్రళయ దినాన అల్లాహ్ ఆకాశాలను చుట్టేసి వాటిని తన కుడిచేతిలో పట్టుకుని తరువాత అంటాడు నేను సామ్రాజ్యాధినేతను ఎక్కడ శక్తిమంతులు,ఎక్కడ గర్విష్టులు?ఆ పై భూములను చుట్టేస్తాడు పిదప వాటిని ఎడమ చేతిలో పట్టుకుని 'నేను సామ్రాజ్యాధినేత ను ఎక్కడ శక్తిమంతులు ఎక్కడ గర్విష్టులు? అని ప్రకటిస్తాడు}దాన్ని ముస్లిం ఉల్లేఖించారుపిదప అల్లాహ్ దైవదూతకు ఆజ్ఞాపిస్తాడు,అతను వెంటనే'రెండవ శంకం'పూరిస్తాడు,ఆపై వారంతా లేచి నిలబడి వేచిచూస్తూ ఉంటారు అల్లాహ్ సెలవిచ్చాడు:-ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు.[జుమర్:68]అల్లాహ్ సృష్టితాలను పునఃజీవితం ప్రసాదించిన పిదప వారందరినీ లెక్కల అప్పచెప్పు కోసం సమీకరిస్తాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగెడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం.}[ఖాఫ్:44]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఆ రోజు వారందరూ బయటికి వస్తారు. వారి ఏ విషయం కూడా అల్లాహ్ నుండి రహస్యంగా ఉండదు. ఆ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది? అద్వితీయుడూ, ప్రబలుడూ అయిన అల్లాహ్ దే!}[గాఫిర్:16]మరియు ఆరోజున అల్లాహ్ సమస్తప్రజలతో లెక్కతీసుకుంటాడు,దుర్మార్గుడితో ప్రతీపీడితుని ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు మరియు ప్రతీ మనిషికు అతను చేసిన కర్మలకు ప్రతిఫలం ముట్టజెప్పుతాడు.అల్లాహ్ సెలవిచ్చాడు:{ఆ రోజు ప్రతి ప్రాణికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఆ రోజు ఎవ్వరికీ అన్యాయం జరుగదు. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.}[గాఫిర్:17]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరుపు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.}[నిసా:40]అల్లాహ్ సెలవిచ్చాడు :- {మరెవరైతే రవ్వంత (పరమాణువంత) మేలును చేసియున్న దానిని అతను చూసుకుంటాడు(7){మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.}[జల్'జల :7-8]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!}{అల్ అంబియా :47}పునర్జీవనం మరియు లెక్కల అప్పచెప్పులు ముగిసిన తరువాత ప్రతిఫలాలు బహుమానాలు ఉంటాయి,మంచి చేసిన వాడికోసం అంతు లేని శాశ్వతమైన అనుగ్రహాలు ఉంటాయి,కీడు చేసినవాడికి సత్యతిరస్కారికి శిక్ష ఉంటుంది.అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఆ రోజు సర్వాధిపత్యం అల్లాహ్ దే. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కావున విశ్వసించి సత్కార్యాలు చేసేవారు పరమానందకరమైన స్వర్గవనాలలో ఉంటారు.}కాని, ఎవరైతే సత్యతిరస్కారులై, మా సూచనలను అబద్ధాలని తిరస్కరించారో, వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.(57)[అల్ హజ్జ్ :56-57]మరియు మనకు తెలుసు ఒకవేళ 'ఈ ప్రాపంచిక జీవితమే అంతం ముగింపు అయినట్లైతే ఈ జీవితం మరియు ఉనికి'శుద్ద పనికిమాలినవని అర్ధం. అల్లాహ్ సెలవిచ్చాడు:-"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"అల్ మోమినూన్:115ఆరవది:- విధివ్రాత,తీర్పు పట్ల విశ్వాసం కలిగి ఉండటం.నిశ్చయంగా ఈ ఈమాను విశ్వసించడం'అనివార్యం అల్లాహ్'కు గతము,భవిష్యత్తు మరియు ఈ విశ్వంలో ఏం జరుగబోతుందో పూర్తిగా తెలుసు,నిశ్చయంగా అల్లాహ్ భూమ్యాకాశాల సృజనకు పూర్వమే ప్రతీదీ వ్రాసిపెట్టాడు.అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.}[అల్ అన్ఆమ్:59]నిశ్చయంగా అల్లాహ్ జ్ఞాన పరంగా ప్రతీ దానిని ఆవరించి ఉన్నాడు,అల్లాహ్ తెలిపాడు:{అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసుకోవటానికి.}[తలాఖ్ :12]{మరియు ఈ విశ్వంలో జరిగే ప్రతీవిషయం అల్లాహ్ సంకల్పనుసారం,కోరికప్రకారం జరుగుతాయి,ఆయన వాటిని పుట్టిస్తాడు మరియు ఆ వ్యవహారాలు పూర్తికావడానికి సౌలభ్యాలను ఏర్పాటుచేస్తాడు.}{భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.}[అల్ ఫుర్ఖాన్ : 2]ఈ విషయంలో ఆయనకు పరిపూర్ణ వివేచన'చాతుర్యాలు'ఉన్నాయి,ప్రజలు వాటిని చేరుకోలేరు.అల్లాహ్ సెలవిచ్చాడు:-{కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.}[అల్ ఖమర్:5]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.}[రూమ్ :27]మహోన్నతుడైన అల్లాహ్ తన కోసం 'వివేకం'లక్షణాన్ని రూఢీ పర్చాడు,మరియు తనను 'అల్ హకీం'(వివేచనాపరుడు)పేరుతో కొనియాడాడు.{నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.}[ఆలే ఇమ్రాన్ :18]అల్లాహ్ తఆలా ఈసా అలైహిస్సలాం గురించి ప్రస్తావిస్తూ పరలోకదినాన అల్లాహ్ తఆలా తో ఇలా చెప్తాడు అని పెర్కున్నాడు:{"ఒకవేళ నీవు వారిని శిక్షించదలిస్తే వారు నీ దాసులే! మరియు నీవు వారిని క్షమించదలిస్తే! నీవు సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు!"}[అల్ మాయిదా:118]అల్లాహ్ తాలా మూసా అలైహిస్సలాం తో అతన్ని తూర్'ప్రదేశం లో పిలిచినప్పుడు ఇలా చెప్పాడు{ఓ మూసా! నిశ్చయంగా ఆయన అల్లాహ్ ను నేనే! సర్వశక్తిమంతుడను,మహా వివేకవంతుడను}[అన్ నమ్ల్ :9]మహోన్నత పవిత్ర ఖురాను కోసం 'అల్ హిక్మా'అనే లక్షణంతో కొనియాడబడింది.అల్లాహ్ తాలా సెలవిచ్చాడు.{అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరుపు నుండి వివరించబడ్డాయి.[అల్ హూద్:1 ]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఇవి వివేకంతో నిండి ఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు.}[అల్ ఇస్రా :39]

దైవప్రవక్తలు (అలైహిముస్సలాం) అల్లాహ్ సందేశాలను గ్రహించి వ్యాప్తి పర్చడంలో పావనపరులు,బుద్దిని,సక్రమ నైతికతను పటాపంచలు పరిచే ప్రతీ విషయం నుండి పరిశుద్దులు,మరియు దైవసందేశహరులు అల్లాహ్ ఆదేశాలను దాసులకు ఉపదేశించే గొప్పబాధ్యత పొందినవారు,ప్రభుతకు,దైవత్వం'కు మాత్రమే ప్రత్యేకమైన లక్షణాలలో ఏ ఒక్కటి వారికి లేదు,వారు కేవలం మానవమాత్రులు ఇతర సామాన్య మానవుల మాదిరిగా అయితే అల్లాహ్ వారికి తన దైవవాణి పంపి దైవదౌత్య ప్రత్యేకత నొసగాడు.

దైవప్రవక్తలు (అలైహిముస్సలాం) అల్లాహ్ సందేశాలను గ్రహించి వ్యాప్తి పర్చడంలో పావనపరులు,ఎందుకంటే అల్లాహ్ తన సృష్టితాల నుండి వారిని ఎన్నుకున్నాడు,తద్వారా వారు అల్లాహ్ సందేశాలను వ్యాప్తిచేయగలరు. అల్లాహ్ సెలవిచ్చాడు-:{అల్లాహ్ దైవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు.నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు}[అల్ హజ్జ్ :75]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు.}[ఆలే ఇమ్రాన్ :33]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{(అల్లాహ్) అన్నాడు : "ఓ మూసా నిశ్చయంగా నేను నా సందేశాల ద్వారా మరియు నా సంభాషణ ద్వారా ప్రజలందరిలో, నిన్ను ఎన్నుకున్నాను. కావున నేను నీకిచ్చిన దానిని తీసుకో. మరియు నీవు కృతజ్ఞులలో చేరు"}[అల్ ఆరాఫ్:114]దైవప్రవక్తలకు తెలుసు వారికి ఇవ్వబడేది దైవవాణి అని,అంతేకాదు వారు దైవదూతలను దైవవాణితో ప్రత్యేక్షమవ్వడాన్ని స్వయంగా వీక్షిస్తారు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఆయనే అగోచర జ్ఞానం గలవాడు, కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు -{26}తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప - ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షకభటులను నియమిస్తాడు.(27)వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్క పెట్టి ఉంచుతాడు.(28){అల్ జిన్ను: 26-28}అల్లాహ్ తన సందేశాలను ప్రజలకు ఉపదేశించాలని వారికి ఆజ్ఞాపించాడు అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరుపు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నువ్వలా చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.}[అల్ మాయిదా :67]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము.(a) ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని!(b) మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.}[నిసా:165]దైవసందేశహరులు అల్లాహ్'కు తీవ్రంగా భయపడుతూ భీతిల్లుతూ ఉంటారు,అల్లాహ్ సందేశాలలో హెచ్చుతగ్గులు చేయరు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!}44మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం.(45)తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.(46)అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు.(47)[అల్ హాఖ్ఖ :44-47]ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:-అల్లాహ్ సెలవిస్తున్నాడు:{{وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا}} అనగా ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి వాదన ప్రకారం దైవదౌత్యంలో ఏదైనా స్వయంగా జోడించినా లేక తొలగించిన లేక తన సొంత విషయాన్నిచెప్పి నాకు (అల్లాహ్కు) ఆపాదించినట్లైతే-అలాజరుగలేదు-నేను వెంటనే అతన్నిశిక్షించేవాడిని,ఈవిషయాన్నిఅల్లాహ్ తెలిపాడు {{لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ}చెప్పబడింది :-దీనిఅర్ధం అతనితో నేను నా కుడిచేతితో ప్రతీకారాన్నితీర్చుకుంటాను ఎందుకంటే ఆయన దృఢంగా పట్టుకునేవాడు.మరియు ఇలా చెప్పబడింది :- నేను నా కుడి చేయితో దాని ప్రతీకారం తీర్చుకుంటాను.మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ : "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు! "నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ' నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్ నే ఆరాధించండి.' అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!"}[అల్ మాయిదా :116-117]దైవసందేశహరులకు,ప్రవక్తలపై అల్లాహ్ చేసిన కనికరాలలో అత్యుత్తమమైనది-'తన సందేశాలను వ్యాప్తిపర్చడంలో అల్లాహ్ వారికి స్థిరత్వాన్ని అనుగ్రహించాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-"అతను (హూద్) జవాబిచ్చాడు:"ఆయన (అల్లాహ్) తప్ప! మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా, నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి; ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి.(55)నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ప్రతీ ప్రాణి జుట్టు ఆయన చేతిలో ఉంది.నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గంపై (సత్యంపై) ఉన్నాడు.[హూద్ :54-56]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:(ఓప్రవక్తా!)వాళ్లు,మేము నీవద్దకుపంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోనుచేసే ఉద్దేశంతో,దీనికి బదులు మరి దేన్నయినా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరు తున్నారు.నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్లు నిన్ను స్నేహితునిగాచేసుకుని ఉండేవారు.(73)మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే,నువ్వు కొంతైనా వారివైపుకు మొగ్గేవాడివి.ఒకవేళ (నీ తరఫున) అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్లం.మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం.మరి మాకు వ్యతిరేకంగా,నువ్వు ఏ సహాయకుడినీ పొందలేక పోయేవాడివి.[అల్ ఇస్రా :73-75]ఇవి మరియు ఇంతకుముందు గడిచిన ఆయతులు 'ఖురాను సర్వలోకాల ప్రభువు తరుపునుండి అవతరించిందనడానికి రుజువులు'మరియు సాక్ష్యాలుగా ఉన్నాయి.ఎందుకంటే ఒకవేళ అవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తరుపు నుండి స్వతహాగా వచ్చియున్నట్లైతే ఆయనను ఉద్దేశించి ఇలాంటి సంభాషణ వచ్చేది కాదు.అల్లాహ్ సుబ్'హానహూ తఆలా తన ప్రవక్తలను ప్రజలనుండి రక్షిస్తాడు"-అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.}[అల్ మాయిదా :67]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు వారికి నూహ్ గాథను వినిపించు. అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన (ఆయాత్) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్ నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించినవారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏ మాత్రం వ్యవధి నివ్వకండి.}[యూనుస్:71]అల్లాహ్ మూసా అలైహిస్సలాం మాట గురించి తెలుపుతూ చెప్పాడు :-(మూసా మరియు హారూన్) ఇద్దరూ ఇలా అన్నారు: "ఓ మా ప్రభూ! వాస్తవానికి, అతడు మమ్మల్ని శిక్షిస్తాడేమోనని, లేదా తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడేమోనని మేము భయపడుతున్నాము!"(అల్లాహ్) సెలవిచ్చాడు:-"మీరిద్దరు భయపడకండి,నిశ్చయంగా, మీరిద్దరితో పాటు నేనూ ఉన్నాను. నేను అంతా వింటూ ఉంటాను మరియు అంతా చూస్తూ ఉంటాను.}[తాహా:45-46]అల్లాహ్ తెలియపరిచాడు ఆయన తన సందేశహరులను శత్రువుల నుండి రక్షించాడు,వారు ప్రవక్తల వరకు కీడించే ఉద్దేశ్యంతో చేరలేకపోయారు,అల్లాహ్ సత్యాన్ని తెలియజేసాడు ఆయన తన దైవవాణిని సంరక్షించాడు,అందులో హెచ్చులు కానీ తగ్గులు కానీ చేయబడలేదు.అల్లాహ్ సెలవిచ్చాడు:-{మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము}[అల్ హిజ్ర్ :9]దైవప్రవక్తలు అలైహిముస్సలాం బుద్దిని,సక్రమనైతికత ను విభేధించి పటాపంచలు పరిచే ప్రతీ విషయం నుండి పరిశుద్దహస్తులు. అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను శుద్దిపరుస్తూ తెలిపాడు:-మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు![అల్ ఖలమ్:4]ఆయన గురించి మరొక చోట ఇలా ప్రస్తావించాడు:-{మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!}[తఖ్వీర్:22 ]అంచేత వారు సందేశాలవ్యాప్తి అత్యుత్తమ విధానంలో స్థాపించగలరు, మరియు దైవసందేశహరులు అల్లాహ్ ఆదేశాలను దాసులకు ఉపదేశించే గొప్పబాధ్యత పొందినవారు,ప్రభుతకు,దైవత్వం'కు చెందిన ప్రత్యేకమైన లక్షణాలలో ఏ ఒక్కటి వారికి లేదు,ఇతర సామాన్య మానవుల వలె వారు కూడా మానవ నిమిత్తులే కానీ అల్లాహ్ వారికి తన దైవవాణి పంపి దైవదౌత్య ప్రత్యేకత నొసగాడు అల్లాహ్ సెలవిచ్చాడు.{వారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము మీ వంటి మానవులం మాత్రమే! కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు - అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప - మీ కొరకు ప్రమాణం తీసుకు రావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలని.}[ఇబ్రాహీం :11]అల్లాహ్ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఆజ్ఞాపిస్తూ తన జాతిప్రజలకు ఉపదేశించమని సెలవిచ్చాడు:{(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు."}{అల్ కహఫ్:110}

ఇస్లాం గొప్ప ఆరాధనల సూత్రాలతో ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన వైపునకు ఆహ్వానిస్తుంది,అవి :-నమాజు అనగా 'ఇందులో ఖియాం[నిలబడటం],రుకూ[వంగటం],సజ్దా [సాష్టాంగము]అల్లాహ్ స్మరణ,ప్రశంస,మరియు దుఆ ఉంటాయి,ప్రతీ రోజు అయిదు నమాజులు ముస్లిం ఆచరిస్తాడు,ఇది నమాజులో బేధాలను దూరం చేస్తుంది,అనగా ధనిక,బీధ,పాలకుడు,పాలితుడు అందరూ నమాజులో ఒకే పంక్తిలో నిలబడతారు,మరియు జకాతు అంటే సంపదలోని ఒక చిన్నవిలువ,-అల్లాహ్ నిర్దారించిన షరతులతో,కొలతలతో కూడి ఉంది-ధనికుల సంపదలో అనివార్యం చేయబడింది,ఇది పేద,బీధ ఇతరాత్ర వర్గాలలో ఏడాదికొకసారి పంచబడుతుంది,మరియు ఉపవాసం:- రమదాను మాసంలో పగటివేల అన్నపానీయాలను త్యజించి నిష్టతో వ్రతాన్ని ఆచరించడం.ఇది ఆత్మలో సంకల్పం మరియు సహనాన్ని భోదిస్తుంది.హజ్జ్ 'అంటే'-అల్లాహ్ గృహం కాబతుల్లా'దర్శనం కొరకు పవిత్ర మక్కా నగరానికి జీవితంలో ఒకసారి సామర్ధ్యం స్తోమత కలిగిన ప్రతీ ఒక్కరూ సందర్శించడం,ఈ హజ్జ్ పుణ్య క్షేత్రంలో పవిత్ర అల్లాహ్ ఆరాధన ప్రతీ ఒక్కరికీ సమానంగా ఉంటుంది,మరియు ఎలాంటి బేధాభావాలకు,బంధాలకు తావు ఉండదు.

ఇస్లాం గొప్ప ఆరాధనలతోపాటు,ఇతర ఆరాధనల ద్వారా అల్లాహ్ వైపుకు ఆహ్వానిస్తుంది,ఈ మహత్తరఆరాధనలను దైవప్రవక్తలపై సందేశ హరులపై ఇంతకు మునుపు కూడా విధి చేయబడ్డాయి,ఈ గొప్పఆరాధనలలో కొన్ని ఇవి :

మొదటిది:- నమాజు'ను ముస్లిములపై అల్లాహ్ విధి చేశాడు,గతించిన సమస్త ప్రవక్తలపై సందేశహరులపై విధి చేయబడినట్లుగా,మరియు అల్లాహ్ తన మిత్రుడైన 'ఇబ్రాహీం అలైహిస్సలాం'కు ఆదేశించాడు తన గృహాన్ని ప్రదక్షిణలు,నమాజులు,రుకూ సజ్దాలు చేసేవారి నిమిత్తం పావనపర్చమని ఆదేశించాడు:అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు ఈ (కఅ్బహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి, ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము.}{అల్ బఖర -125 }మూసా అలైహిస్సలాం పై ఆయనకు ఇచ్చిన మొట్టమొదటి పిలుపులో ఆయన కోసం విధి పరిచాడు అల్లాహ్ సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు.}{మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను.}{నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.}[తాహా :12-14 ]ఈసా మసీహ్ అలైహిస్సలాం తనకు నమాజు మరియు జకాతు గురించి అల్లాహ్ ఆదేశించాడని చెప్పారు:- ఇలా చెప్పారు:- అల్లాహ్ ఆ విషయాన్నిఇలా చెప్పారు :{మరియు నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు; నేను బ్రతికి వున్నంత కాలం నమాజ్ చేయమని మరియు విధిదానం (జకాత్) ఇవ్వమని నన్ను ఆదేశించాడు.}[మర్యం:31]ఇస్లామీయ నమాజు విధానంలో ఖియాం,రుకూ సజ్దాలు,దైవస్మరణ ,దైవప్రశంసలు,దుఆ ఉన్నాయి ముస్లిం ప్రతీ రోజు అయిదు పూటలు ఆచరిస్తాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{మీరు మీ నమాజ్ లను కాపాడుకోండి మరియు ముఖ్యంగా మధ్య నమాజ్ ను మరియు అల్లాహ్ సన్నిధానంలో వినయవిధేయతలతో నిలబడండి}.[అల్ బఖర :238]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను నిలుపు. మరియు తెల్లవారు జామున (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా తెల్లవీరు జామున ఖుర్ఆన్ పఠనం (దైవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది.}[అల్ ఇస్రా :78]ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:(రుకూ విషయానికొస్తే మీరు శక్తిమంతుడైన ప్రభువు మహోన్నతను అధికంగా కొనియాడండి'ఇక సజ్దాలో దుఆ ఎక్కువ చేయడానికి కృషిచేయండి,మీ దుఆ లు ఆమోదించబడటానికి దగ్గరగా ఉంటాయి.)సహీహ్ ముస్లింరెండవది:- జకాతు,ఇది వరకు గతించిన ప్రవక్తలపై,సందేశహరుల పై (అలైహిముస్సలాం) విధి పరిచినట్లుగా అల్లాహ్ దీనిని ముస్లిములపై కూడా విధి పరిచాడు,ఇది సంపదలోని ఒక చిన్నమొత్తం,-అల్లాహ్ దీని కొరకు కొలమానాలు షరతులు నిర్దారించాడు- ధనికుల డబ్బులో విధి పర్చబడింది,బీధవర్గాల పంచడం కోసం తీసుకోబడుతుంది,సంవత్సరానికి ఒకసారి ఉంటుంది,అల్లాహ్ సెలవిచ్చాడు.{(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.}[తౌబా :103]దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు'ను యమన్ వైపుకు పంపిస్తున్నప్పుడు ఇలా ఉపదేశించారు:-{"నిశ్చయంగా నీవు గ్రంధవహులకు చెందిన ఒకజాతి వద్దకు వెళ్తున్నావు,మొదట వారిని 'అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవంలేడు మరియు నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క సందేశ హరుడను'అనే విషయం వైపుకు ఆహ్వానించు,ఒకవేళ వారు ఈ విషయానికి విధేయులైతే అప్పుడు వారికి 'అల్లాహ్ వారిపై రాత్రిపగలు కలిపి రోజుకు ఐదు వేళల నమాజులను విధి పరిచిన విషయం తెలియజేయి,ఒకవేళ వారు దీనికి కూడా విధేయత చూపినట్లైతే అప్పుడు వారిపై అల్లాహ్ 'జకాతు'ను విధిగా చేశాడని తెలియజేయి,అది వారిధనికుల నుండి తీసుకోబడి బీదప్రజలకు పంచబడుతుంది,వారు ఒకవేళ దానికి కూడా విధేయత చూపినట్లైతే అప్పుడు వారి ప్రియగౌరవసంపాదకు దూరంగా ఉండండి.పీడితుని దుఆ కు గురి కాకండి,ఎందుకంటే అల్లాహ్ కు మరియు అతని దుఆకు మధ్య ఎటువంటి తెర ఉండదు"}తిర్మిజీ ఉల్లేఖనం[625]మూడవది:- ఉపవాసం,అల్లాహ్ ముస్లుము సముదాయంపై దీనిని ఇదివరకు గతించిన ప్రవక్తలపై,సందేశహరులపై(అలైహిముస్సలాం) విధి పరిచినట్లుగా విధి పరిచాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడిందో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!}[అల్ బఖర:183]మరియు ఇది:- రమదాను మాసంలో పగటివేల అన్నపానీయాలను త్యజించి నిష్టతో వ్రతాన్ని ఆచరించడం.ఇది ఆత్మలో సంకల్పం మరియు సహనాన్ని బోధిస్తుంది.ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:-అల్లాహ్ తెలుపుతున్నాడు:- {ఉపవాసం నాకొరకు,నేను మాత్రమే దానికి ప్రతిఫలం ఇస్తాను,అతను తన మనోవాంఛలకు,అన్నపానీయాల సేవనకు కేవలం నా కొరకు దూరంగా ఉంటాడు,ఉపవాసం ఒక ఢాలు,ఉపవాసకుడికి రెండు సంతోషాలు ఉంటాయి:- ఒకటి ఇఫ్తార్ చేసేటప్పుడు,రెండు తన ప్రభువును కలిసినప్పుడు}సహీహ్ బుఖారి 7492నాలుగవది:-హజ్జ్ ,అల్లాహ్ ముస్లిము సముదాయంపై ఇది వరకు గతించిన ప్రవక్తలపై,సందేశహరులపై(అలైహిముస్సలాం) విధి పరిచినట్లుగా దీనిని విధి పరిచాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-మరియు అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం' తో ప్రజలను హజ్జ్ కోసం పిలువమని ఆదేశించాడు:- అల్లాహ్ సెలవిచ్చాడు-{మరియు ప్రజలకు హజ్జ్ యాత్రను గురించి ప్రకటించు: "వారు పాదాచారులగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె (సవారీ) మీద, విశాల (దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు}అల్ హజ్జ్ :27మరియు ఆయనతో హాజీల కోసం బైతుల్ అతీక్ ను పరిశుద్దపర్చమని అల్లాహ్ ఆదేశించాడు,అల్లాహ్ సెలవిచ్చాడు:మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅ్బహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము.అల్ హజ్జ్:26అల్ హజ్జ్ :-అల్లాహ్ గృహం 'కాబతుల్లాహ్'సందర్శనకై జీవితంలో ఒకసారి మక్కానగర యాత్రకి నియమిత కార్యక్రమాల నిమిత్తం వెళ్ళడం.{మరియు అల్లాహ్ కొరకుప్రజలపై దైవగృహ సందర్శన హజ్జ్ స్తోమత కలిగి ఉన్నవారు చేయవసల్సి ఉంది;మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు'}[ఆలే ఇమ్రాన్:97]మరియు హజ్జ్ లో భాగంగా హాజీ ముస్లిములందరు ఒకే ప్రదేశంలో ఏకైక సర్వసృష్టికర్త కొరకు ఆరాధననను చిత్తశుద్దితో అంకితం చేస్తారు,మరియు హాజీలందరూ హజ్జ్ మనాసిక్ (నియమిత ప్రత్యేక కార్యక్రమాలను)ఒకే విధంగా పూర్తిచేస్తూంటారు, ఇందులో పర్యావరణ,సంస్కృతిక మరియు జీవనప్రమాణాలలోని తేడాలను హజ్జ్ రూపుమాపుతుంది.

ఇస్లాంలో ఆరాధనలను ప్రత్యేక పరిచే గొప్పలక్షణాలలో ఒకటి,-ఆరాధన విధానాలు,సమయాలు మరియు షరతులు.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వీటిని శాసనాలుగా చేశాడు,దైవప్రవక్తలు (అలైహిముస్సలాం) వ్యాప్తిపర్చారు,మరియు నేటి వరకు ఏ మానవుడు ఇందులో ఏ హెచ్చుతగ్గులు చేయలేదు,ఈ పెద్దపెద్ద ఆరాధనల వైపునకు దైవప్రవక్తలంతా (అలైహిముస్సలాం) పిలుపునిచ్చారు.

ఇస్లాం ఆరాధనలను ప్రత్యేక పరిచే గొప్ప లక్షణాలలో ఒకటి, ఆరాధన విధానాలు,సమయాలు మరియు షరతులు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వాటిని శాసనాలుగా చేశాడు మరియు దైవప్రవక్తలు (అలైహిముస్సలాం) వాటిని వ్యాప్తిపర్చారు,మరియు నేటి వరకు ఏ మానవుడు ఇందులో ఏ హెచ్చుతగ్గులు చేయలేదు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఈరోజు మీకోరకు మీ ధర్మాన్ని సంపూర్ణపరిచాను,మరియు నా అనుగ్రహాన్నిపరిపూర్ణంచేశాను మరియు మీకొరకు ఇస్లాం'ను ధర్మంగా ఇష్టపడ్డాను}[అల్ మాయిదా:3]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:4{కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.}[జుక్'రుఫ్:43 ]అల్లాహ్ తాలా నమాజు గురించి సెలవిచ్చాడు:-{ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పడుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.}నిసా:103జకాతు ఖర్చుల గురించి అల్లాహ్ సెలవిచ్చాడు :-{నిశ్చయంగా దానాలు (సదఖాత్)(a) కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి(b), (జకాత్) వ్యవహారాలపై నియమితులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు.ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.}తౌబా:60అల్లాహ్ తఆలా ఉపవాసాల గురించి సెలవిచ్చాడు:-రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది(a)! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!}[అల్ బఖర :185]అల్లాహ తాలా హజ్జ్ గురించి తెలియజేశాడు:-{హజ్జ్ మాసములు నిర్ధారితమై ఉన్నాయి. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్ కు తెలుసు. (హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుద్ధమంతులారా! కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి.}[అల్ బఖర :197]ఈ గొప్పఆరాధనల వైపునకే సమస్త దైవప్రవక్తలు అలైహిముస్సలాం ఆహ్వానించారు:-

ఇస్లాం యొక్క ప్రవక్త 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ఆయన ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయీల్ వంశానికి చెందినవారు,క్రీ.శ 571వ సంవత్సరంలో మక్కానగరం లో జన్మించారు,అక్కడే ప్రవక్తగా ప్రభవించారు ఆపై మదీనాకు వలస వెళ్లారు,ఆయన విగ్రహారాధనలో ఏనాడూ తన జాతీప్రజలతో పాల్గునలేదు కానీ ప్రాపంచిక బాహ్యవ్యవహారాలలో వారితో కలిసి చేసేవారు,ఆయన దైవదౌత్యం పొందక మునుపు నుంచే గొప్ప నైతికతను కలిగి ఉన్నారు.ఆయన ఆ జాతిప్రజలు ఆయనకు అల్ అమీన్'అనే బిరుదును ఇచ్చారు,నలబై సంవత్సరాల వయసుకు చేరిన తరువాత అల్లాహ్ గొప్ప దైవసూచనలతో{అద్భుతాలతో }ప్రవక్తగా పంపారు. అందులో అతిగొప్పది 'అల్-ఖుర్ఆను'పవిత్ర గ్రంధం,ఇది దైవప్రవక్తలకు ఇవ్వబడిన గొప్పసూచన,మరి ఆ సూచన నేటివరకు అలాగే మిగిలి ఉంది.అల్లాహ్ దానిద్వారా ధర్మాన్ని పరిపూర్ణ పరిచాడు మరియు దానిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అహర్నిశలు కష్టించి ప్రజలకు చేర్చారు,మరణించారు,ఆయన వయసు 'అరవై మూడు 63 సంవత్సరాలు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నగరం మదీనాలో సమాధి చేయబడ్డారు,మరియు ముహమ్మద్ {స} దైవ సందేశహరుల దైవ ప్రవక్తల పరంపరలో అంతిమ ప్రవక్తగా ప్రభవింపబడ్డారు,అల్లాహ్ ఆయనకు 'హిదాయతు'మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపించాడు తద్వారా ఆయన ప్రజలను విగ్రహారాధన,కుఫ్ర్,అజ్ఞానం లాంటి అంధకారాల నుండి తీసి తౌహీదు ఏకత్వం,ఈమాన్ జ్యోతి వైపునకు మార్గదర్శనం చేశారు,మరియు అల్లాహ్ స్వయంగా సాక్ష్యామిస్తూ 'తానే స్వయంగా అనుమతిస్తూ ప్రవక్తను అల్లాహ్ వైపుకు ఆహ్వానించే దాయీగా చేసి పంపానని చెప్పాడు.

ఇస్లాం యొక్క ప్రవక్త 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ఆయన ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయీల్ వంశానికి చెందినవారు,క్రీ.శ 571వ సంవత్సరంలో మక్కానగరం లో జన్మించారు,అక్కడే ప్రవక్తగా ప్రభవించారు ఆపై మదీనాకు వలస వెళ్లారు,ఆయన విగ్రహారాధనలో ఎన్నడూ తన జాతీప్రజలతో పాల్గునలేదు కానీ ప్రాపంచిక బాహ్యవ్యవహారాలలో వారితో కలిసి చేసేవారు,ఆయన దైవదౌత్యం పొందక మునుపు నుంచే గొప్ప నైతికతను కలిగి ఉన్నారు,ప్రభువు ఆయన గురించి 'గొప్పనైతికతను'కలిగి ఉన్నారని పొగిడారు;అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!}[అల్ ఖలమ్:4]నలభై సంవత్సరాల వయసుకు చేరిన తరువాత అల్లాహ్ గొప్ప దైవ సూచనలతో{అద్భుతాలతో }ప్రవక్తగా పంపారు.అందులో అతిగొప్పది 'అల్-ఖురాను'పవిత్ర గ్రంధం.మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{దైవప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా ప్రజలు విశ్వసించేవారు,నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది,అల్లాహ్'దాన్ని నా వైపుకు పంపాడు,కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను నమ్ముతున్నాను}సహీహ్ అల్ బుఖారిమరియు పవిత్ర ఖురాను గ్రంధం ఇది అల్లాహ్ తరుపునుండి తన ప్రవక్త వైపుకు పంపించబడిన దైవవాణి!అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-{ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం'ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము}[అల్ బఖర :2]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరపు నుండి గాక ఇతరుల తరపు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!}[నిసా :82]అల్లాహ్ మానవులతో,జిన్నాతులతో 'ఇలాంటి ఒక గ్రంధాన్ని తేవాలని' సవాలు (ఛాలెంజ్) విసిరాడు,అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు."[అల్ ఇస్రా:88]మరియు అల్లాహ్ వారికి సవాలుచేస్తూ దీనిని పోలిన పదిసూరాహ్లను తేవాలని సవాలు విసిరాడు:- అల్లాహ్ సెలవిచ్చాడు:-లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"[హూద్:13]ఆపై చివరికి అల్లాహ్ వారికి సవాలుచేస్తూ దీనిని పోలిన ఒక సూరాహ్ను తేవాలని సవాలు విసిరాడు:- అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).}[అల్ బఖర :23]

[అల్ ఇస్రా:88]

మరియు అల్లాహ్ వారికి సవాలుచేస్తూ దీనిని పోలిన పదిసూరాహ్లను తేవాలని సవాలు విసిరాడు:- అల్లాహ్ సెలవిచ్చాడు:-

లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"

[హూద్:13]

ఆపై చివరికి అల్లాహ్ వారికి సవాలుచేస్తూ దీనిని పోలిన ఒక సూరాహ్ను తేవాలని సవాలు విసిరాడు:- అల్లాహ్ సెలవిచ్చాడు:-

{మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).}

[అల్ బఖర :23]

'అల్-ఖురాను'పవిత్ర గ్రంధం,ఇది దైవప్రవక్తలకు ఇవ్వబడిన గొప్పసూచన,మరి ఆ సూచన నేటివరకు అలాగే మిగిలి ఉంది.అల్లాహ్ దీని ద్వారా ధర్మాన్ని పరిపూర్ణ పరిచాడు మరియు దానిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అహర్నిశలు కష్టించి ప్రజలకు చేర్చారు,పిమ్మట మరణించారు,అప్పుడు ఆయన వయసు'అరవై మూడు 63 సంవత్సరాలు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క నగరం మదీనాలో సమాధి చేయబడ్డారు.

ముహమ్మద్ {స} దైవసందేశహరుల,దైవప్రవక్తల పరంపరలో అంతిమ ప్రవక్తగా ప్రభవింపబడ్డారు.{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.}{అల్ అహ్'జాబ్ :40 }హజ్రత్ అబూ హురైర (ర) ఉల్లేఖనం ప్రకారం. ప్రవక్త(స)ఇలా అన్నారు :-{నాది మరియు నాకు మునుపు గతించిన ప్రవక్తల ఉపమానం ఆ వ్యక్తి లాంటిది అతను ఒక ఇంటిని నిర్మించాడు,దాన్ని అత్యుత్తమంగా మలచి అతి సుందరంగా తీర్చిదిద్దాడు కానీ ఒక మూల'ఇటుక' పెట్టె ప్రదేశం మాత్రం వదిలేశాడు,ప్రజలు ఆ ఇంటిని చూడటానికి తరలి వస్తున్నారు ఆ ఇంటిని పరిశీలిస్తూ ఆశ్చర్యకితులవుతున్నారు,కానీ దానితో పాటు ఎందుకని ఇక్కడ ఒక ఇటుక' పూరించలేదు'అని అంటున్నారు,దైవప్రవక్త సెలవిచ్చారు:-నేనే ఆ ఇటుకను మరియు నేనే ప్రవక్తలలో అంతిమ దైవప్రవక్తను}సహీహ్ అల్ బుఖారిఇంజీలు గ్రంధంలో ఈసా మసీహ్ అలైహిస్సలాం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ గురించి శుభవార్త తెలుపుతూ భవిష్యవాణిని తెలియజేశారు:-{కట్టడనిర్మాణకులు వదిలిన ఆ రాయి మూల కేంద్రబిందువు!మీరు దాని గురించి పుస్తకాలలో ఎప్పుడు చదువలేదా:-యేసు వారితో,"ప్రభువు తరుపున ఇది జరిగింది,ఇది మా దృష్టిలో అద్భుతమైనది"అని అన్నారు. తౌరాతు పుస్తకంలో మూసా'తో అల్లాహ్ చెప్పిన ఈ విషయం నేటివరకు చెక్కుచెదరకుండా ఉంది{నేను వారి కొరకు నీలాంటి ఒక ప్రవక్తను వారి సోదరుల నుండి నిలబెడతాను,మరియు నా మాటలను అతని నోటిద్వారా ఉపదేశిస్తాను'అప్పుడు నేను ఉపదేశించే ప్రతీదీ అతను ప్రజలతో సంభాషిస్తాడు}.దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను అల్లాహ్ హిదాయతు మరియు సత్యధర్మం తో పాటు ప్రభవింపచేశాడు,ఆయన సత్యంపై ఉన్నారు,ఆయనను తన తరుపునుంచి తన అనుమతితో దాయీగా పంపారు అని సాక్ష్యామిచ్చారు.{కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దైవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు.}{నిసా:166 }మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.}{ఫతహ్:28 }అల్లాహ్ తఆలా ప్రవక్తను ఋజుమార్గంతో పంపించాడు తద్వారా ఆయన ప్రజలను విగ్రహారాధన,సత్యతిరస్కారం మరియు అజ్ఞానాంధకారాల నుండి బయటికి తీసి తౌహీదు ఏకత్వం మరియు ఈమాను జ్యోతి వైపుకు మార్గదర్శనం చేశాడు.అల్లాహ్ సెలవిస్తున్నాడు:-{దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.}[అల్ మాయిదా:16]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము.}[ఇబ్రాహీం:1]

{(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.}

{అల్ అహ్'జాబ్ :40 }

హజ్రత్ అబూ హురైర (ర) ఉల్లేఖనం ప్రకారం. ప్రవక్త(స)ఇలా అన్నారు :-

{నాది మరియు నాకు మునుపు గతించిన ప్రవక్తల ఉపమానం ఆ వ్యక్తి లాంటిది అతను ఒక ఇంటిని నిర్మించాడు,దాన్ని అత్యుత్తమంగా మలచి అతి సుందరంగా తీర్చిదిద్దాడు కానీ ఒక మూల'ఇటుక' పెట్టె ప్రదేశం మాత్రం వదిలేశాడు,ప్రజలు ఆ ఇంటిని చూడటానికి తరలి వస్తున్నారు ఆ ఇంటిని పరిశీలిస్తూ ఆశ్చర్యకితులవుతున్నారు,కానీ దానితో పాటు ఎందుకని ఇక్కడ ఒక ఇటుక' పూరించలేదు'అని అంటున్నారు,దైవప్రవక్త సెలవిచ్చారు:-నేనే ఆ ఇటుకను మరియు నేనే ప్రవక్తలలో అంతిమ దైవప్రవక్తను}

సహీహ్ అల్ బుఖారి

ఇంజీలు గ్రంధంలో ఈసా మసీహ్ అలైహిస్సలాం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ గురించి శుభవార్త తెలుపుతూ భవిష్యవాణిని తెలియజేశారు:-

{కట్టడనిర్మాణకులు వదిలిన ఆ రాయి మూల కేంద్రబిందువు!మీరు దాని గురించి పుస్తకాలలో ఎప్పుడు చదువలేదా:-యేసు వారితో,"ప్రభువు తరుపున ఇది జరిగింది,ఇది మా దృష్టిలో అద్భుతమైనది"అని అన్నారు. తౌరాతు పుస్తకంలో మూసా'తో అల్లాహ్ చెప్పిన ఈ విషయం నేటివరకు చెక్కుచెదరకుండా ఉంది{నేను వారి కొరకు నీలాంటి ఒక ప్రవక్తను వారి సోదరుల నుండి నిలబెడతాను,మరియు నా మాటలను అతని నోటిద్వారా ఉపదేశిస్తాను'అప్పుడు నేను ఉపదేశించే ప్రతీదీ అతను ప్రజలతో సంభాషిస్తాడు}.

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను అల్లాహ్ హిదాయతు మరియు సత్యధర్మం తో పాటు ప్రభవింపచేశాడు,ఆయన సత్యంపై ఉన్నారు,ఆయనను తన తరుపునుంచి తన అనుమతితో దాయీగా పంపారు అని సాక్ష్యామిచ్చారు.

{కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దైవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు.}

{నిసా:166 }

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.}

{ఫతహ్:28 }

అల్లాహ్ తఆలా ప్రవక్తను ఋజుమార్గంతో పంపించాడు తద్వారా ఆయన ప్రజలను విగ్రహారాధన,సత్యతిరస్కారం మరియు అజ్ఞానాంధకారాల నుండి బయటికి తీసి తౌహీదు ఏకత్వం మరియు ఈమాను జ్యోతి వైపుకు మార్గదర్శనం చేశాడు.అల్లాహ్ సెలవిస్తున్నాడు:-

{దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.}

[అల్ మాయిదా:16]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము.}

[ఇబ్రాహీం:1]

ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెచ్చిన ఇస్లాం షరీఅతు ఇది దైవసందేశాలు మరియు ప్రభుతశాసనాలలో చిట్టచివరిది,ఈ షరీఅతు పరిపూర్ణమైనది,ఇందులో ప్రజలధర్మసంస్కరణ,ప్రాపంచిక సంస్కరణలు ఉన్నాయి,ఇది అతిప్రధానంగా ప్రజల ధర్మాన్ని,ప్రాణాన్ని,సంపదను,బుద్దిని మరియు సంతానాన్ని సంరక్షిస్తుంది,అంతేకాదు మునుపటి శాసనాలు పరస్పరం ఒకదానిని ఒకటి రద్దుపరుచుకున్నట్లుగా ఈ షరీఅతు మునుపటి శాసనాలను రద్దు పరుస్తుంది.

ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెచ్చిన ఇస్లాం షరీఅతు ఇది దైవసందేశాలు మరియు ప్రభుతశాసనాలలో చిట్టచివరది,అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారిని ప్రభవింపచేసి ఈ ధార్మికషరీయతులను సంపూర్ణపరిచాడు మరియు తన అనుగ్రహాన్ని పూర్తిచేశాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను,మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను}{అల్ మాయిదా:3}ఇస్లామీయా షరీఅతు ఒక సంపూర్ణ శాసనం,ఇందులో ప్రజల ప్రాపంచిక,ధార్మిక సంస్కరణలు ఉన్నాయి,ఎందుకంటే గతించిన సమస్త శాసనాలను ఇది సమీకరించింది అంతేకాదు దానిని పరిపూర్ణంగావించింది మరియు పూర్తిచేసింది అల్లాహ్ సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;}[అల్ ఇస్రా:9]మునుపటి జాతులలో ప్రజలు అవలంబించే కొన్ని చట్టాలను ఇస్లామీయ షరీఅతు పెట్టింది.అల్లాహ్ సెలవిచ్చాడు:-"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."[అల్ ఆరాఫ్:157]ఇస్లామీయ షరీఅతు గడిచిన ప్రతీ షరీఅతును రద్దుపరుస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు :{మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.}[అల్ మాయిదా : 48 ]పవిత్ర అల్ ఖుర్ఆను-కరీం షరీఅతును ఇమిడి ఉన్నది,గడిచిన దైవగ్రంధముల షరీఅతును సత్యపరుస్తు,వాటిపట్ల తీర్పుచేస్తూ మరియు వాటిని రద్దుపరుస్తు వచ్చింది.

{ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను,మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను}

{అల్ మాయిదా:3}

ఇస్లామీయా షరీఅతు ఒక సంపూర్ణ శాసనం,ఇందులో ప్రజల ప్రాపంచిక,ధార్మిక సంస్కరణలు ఉన్నాయి,ఎందుకంటే గతించిన సమస్త శాసనాలను ఇది సమీకరించింది అంతేకాదు దానిని పరిపూర్ణంగావించింది మరియు పూర్తిచేసింది అల్లాహ్ సెలవిచ్చాడు:-

{నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;}

[అల్ ఇస్రా:9]

మునుపటి జాతులలో ప్రజలు అవలంబించే కొన్ని చట్టాలను ఇస్లామీయ షరీఅతు పెట్టింది.అల్లాహ్ సెలవిచ్చాడు:-

"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."

[అల్ ఆరాఫ్:157]

ఇస్లామీయ షరీఅతు గడిచిన ప్రతీ షరీఅతును రద్దుపరుస్తుంది,అల్లాహ్ సెలవిచ్చాడు :

{మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.}

[అల్ మాయిదా : 48 ]

పవిత్ర అల్ ఖుర్ఆను-కరీం షరీఅతును ఇమిడి ఉన్నది,గడిచిన దైవగ్రంధముల షరీఅతును సత్యపరుస్తు,వాటిపట్ల తీర్పుచేస్తూ మరియు వాటిని రద్దుపరుస్తు వచ్చింది.

అల్లాహ్ సుబ్'హానహూ వ తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తీసుకువచ్చిన ఇస్లాం తప్ప ఏ ఇతర ధర్మాన్ని ఆమోదించడు,మరియు ఎవరైతే ఇస్లామేతర ధర్మం పై జీవనాన్ని సాగిస్తాడో అల్లాహ్ ఎన్నటికీ వారిని ఆమోదించడు.

అల్లాహ్ సుబ్'హానహూ వ తాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తీసుకువచ్చిన ఇస్లాం తప్ప ఏ ఇతర ధర్మాన్ని ఆమోదించడు,మరియు ఎవరైతే ఇస్లాం తప్ప మరొక ధర్మాన్ని ఎంచుకుంటాడో అల్లాహ్ ఎన్నటికీ దానిని ఆమోదించడు.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.}[ఆల్ ఇమ్రాన్ :85]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).[ఆల్ ఇమ్రాన్ :19]ఈ ఇస్లాంయే'సిసలైన ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ మార్గం అలైహిస్సలాం':- మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.}[అల్ బఖర :130]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.}[నిసా :125]అల్లాహ్ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఆజ్ఞాపిస్తూ సెలవిచ్చాడు:{వారితో ఇలా అను:"నిశ్చయంగా,నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకేశ్వరోపాసక ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు!"}[అల్ అన్'ఆమ్:161]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.}

[ఆల్ ఇమ్రాన్ :85]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).

[ఆల్ ఇమ్రాన్ :19]

ఈ ఇస్లాంయే'సిసలైన ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ మార్గం అలైహిస్సలాం':- మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

{మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.}

[అల్ బఖర :130]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.}

[నిసా :125]

అల్లాహ్ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఆజ్ఞాపిస్తూ సెలవిచ్చాడు:

{వారితో ఇలా అను:"నిశ్చయంగా,నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకేశ్వరోపాసక ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు!"}

[అల్ అన్'ఆమ్:161]

అల్ ఖుర్ఆను అల్ కరీం' ఈ పవిత్ర గ్రంధం అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వైపుకు వాణి రూపంలో అవతరింపచేశాడు,ఇది సమస్తలోకాల ప్రభువు యొక్క వాక్యములు,అల్లాహ్ మానవులకు జిన్నాతులకు ఇలాంటి గ్రంధాన్ని లేదా దీనిని పోలిన ఒకసూరాను తయారు చేసి తెమ్మని సవాలు విసిరాడు,ఈ సవాలు నేటివరకు అలాగే స్థిరంగా ఉంది,పవిత్ర ఖుర్ఆన్ మిలియన్ల మంది ప్రజలను అబ్బురపరిచే అనేక ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది,ఈ మహోన్నత అల్ ఖుర్ఆన్ ఈ రోజు వరకు అది అవతరించబడిన అరబిక్ భాషలో భద్రంగాఉంది,ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,ఇది ముద్రించబడినది ప్రచురించబడినది,ఇది అద్భుతమైన ఒకగొప్పపుస్తకం,దీని పారాయణం,లేదా అనువాద అర్ధాల పఠనం పుణ్యప్రదమైనది,ఇదేవిధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ సున్నతు'సంప్రదాయాలు,బోధనలు మరియు జీవిత చరిత్ర కూడా భద్రపరచబడ్డాయి,అంతేకాదు విశ్వాసనీయ వరుస ఉల్లేఖకుల శ్రేణి ప్రకారం నిక్షిప్తం చేయబడ్డాయి,ఇది ప్రవక్త మాట్లాడిన అరబిక్ భాషలో ముద్రించబడింది మరియు అనేక ఇతర భాషలలోకి అనువదించబడింది.పవిత్ర అల్-ఖుర్ఆను కరీం మరియు దైవప్రవక్త సున్నతు సాంప్రదాయాలు ఇవి రెండు ఇస్లామీయ ఆదేశాలకు మరియు షరీఅతుకు ముఖ్య మౌలిక పునాదులు.అల్ ఇస్లాము తనవైపుకు ఆపాదించబడిన ప్రముఖుల వ్యవహారాలను గ్రహించదు,ఇది కేవలం దైవవాణి ఆధారంగానే తీసుకోబడుతుంది;అది అల్ ఖుర్ఆను అల్ కరీం మరియు దైవప్రవక్త సున్నతు సంప్రదాయాలు.

అల్ ఖుర్ఆను అల్ కరీం' ఈ పవిత్ర గ్రంధం అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ వైపుకు ఆకాశవాణి రూపంలో అవతరింపచేశాడు,ఇది సమస్తలోకాల ప్రభువు యొక్క వాక్యములు,అల్లాహ్'సెలవిచ్చాడు:-మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;స్పష్టమైన అరబ్బీ భాషలో!(195)[షుఆరా:192-195]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్ఆన్ ను మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన వాడి (అల్లాహ్) నుండి పొందుతున్నావు.[అన్ నమ్ల్ :6]ఈ పవిత్ర ఖుర్ఆను గ్రంధం అల్లాహ్ తరుపునుండి అవతరింపబడింది,మరియు మునుపటి దైవగ్రంధాలను దృవీకరిస్తుంది:అల్లాహ్ సెలవిచ్చాడు :మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరుపు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు![యూనుస్:37]ఈ మహోన్నతమైన దైవగ్రంధం అల్'ఖుర్ఆను' యూదులు మరియు క్రైస్తవులు తమ ధర్మంలో విభేధించిన అనేక సమస్యలను వివరంగా తీర్పుచేసింది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :-నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.[అన్ నమ్ల్:76]ఈ ఖుర్ఆను గ్రంధం అనేక స్పష్టమైన ఆధారాలను సాక్ష్యాలను కలిగి ఉంది,ఈ సాక్ష్యాధారాలు అల్లాహ్ కు చెందిన వాస్తవాలను,ఆయన ధర్మానికి మరియు ప్రతిఫలానికి చెందిన అనేక నిజవిషయాలను సమస్త ప్రజల పై తీర్పును స్థాపిస్తాయి.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు అన్నిరకాల ఉపమానములను పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని;[జుమర్:27]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.అన్ నహ్ల్ :89పవిత్ర ఖుర్ఆన్ మిలియన్ల మంది ప్రజలను అబ్బురపరిచే అనేక ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది,ఈ ఖుర్ఆను కరీం 'అల్లాహ్ భూమ్యాకాశాలను ఎలా సృష్టించాడన్నది' స్పష్టంగా తెలుపుతున్నదిఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా?[అల్ అంబియా:30]మరియు అల్లాహ్ తాలా మనిషిని ఎలా సృష్టించాడు అల్లాహ్ సెలవిచ్చాడు:-ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్నీ రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.{అల్ హజ్జ్ :5}:- అతని నివాస స్థలం ఎక్కడ ఉంది,సజ్జనులకు దుర్జనులకు ఈ జీవితం తరువాత లభించే ప్రతిఫలం ఏమిటి? అనే ఈ సమస్యకు సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికే పేరా నెంబర్ (20') లో ప్రస్తావించబడ్డాయి మరియు ఈ ఉనికి అనుకోకుండా జరిగిన యాదృచ్చిక పరిణామామా లేదా గౌరవప్రదమైన పరమార్ధంకోసం కనుగొనబడిందా?మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?[అల్ ఆరాఫ్:185]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"అల్ ముమినూన్:115అల్ ఖుర్ఆన్ పవిత్ర గ్రంధం ఏ భాషలో అవతరింపబడినదో అదే భాషలో నేటి వరకు సురక్షితంగా ఉంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని సంరక్షిస్తాము}[అల్ హిజ్ర్ :9]ఇందులోనుండి ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,అంతేకాదు ఇందులో విరుద్దాలు,హెచ్చుతగ్గులు మార్పులు చేయబడటం అసాధ్యం.అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరుపు నుండి గాక ఇతరుల తరుపు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!}[నిసా :82]మరియు ఇది ముద్రించబడినది ప్రచురించబడినది,ఇది అద్భుతమైన ఒక గొప్ప పుస్తకం,దీని పారాయణం,లేదా అర్ధఅనువాద పఠనం పుణ్యప్రదమైనది,ఇదేవిధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ సున్నతు'సంప్రదాయాలు,బోధనలు మరియు జీవిత చరిత్ర కూడా భద్రపరచబడ్డాయి,అంతేకాదు విశ్వసనీయ వరుస ఉల్లేఖకులశ్రేణితో నిక్షిప్తం చేయబడ్డాయి,ఇది ప్రవక్త మాట్లాడిన అరబిక్ భాషలో ముద్రించబడింది మరియు అనేక ఇతర భాషలలోకి అనువదించబడింది.పవిత్ర అల్-ఖుర్ఆను అల్కరీం మరియు దైవప్రవక్త సున్నతు సాంప్రదాయాలు ఇవి రెండు ఇస్లామీయ ఆదేశాలకు మరియు షరీఅతుకు ముఖ్య మౌలిక పునాదులు.ఇస్లాము తనవైపుకు ఆపాదించబడిన ప్రముఖుల వ్యవహారాలను గ్రహించదు,ఇది కేవలం పావనపరమైన దైవవాణి ఆధారంగానే తీసుకోబడుతుంది;అది అల్ ఖుర్ఆను అల్ కరీం మరియు దైవప్రవక్త సున్నతు సంప్రదాయాలు: అల్లాహ్ తాలా పవిత్ర ఖుర్ఆను గ్రంధం విశీష్టతను తెలుపుతూ ఇలా సెలవిచ్చాడు:-{తమ వద్దకు హితోపదేశం వచ్చేసినప్పటికీ దాన్ని త్రోసిపుచ్చిన వారు కూడా మా నుండి దాగిలేరు అదొక ప్రతిష్టాత్మకమైన గ్రంధం,అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా దాని ముందు నుండి గానీ దాని వెనుక నుండి గానీ రాజాలదు ఎందుకంటే అది 'మహా వివేకవంతుడు,ప్రశంసనీయడైన అల్లాహ్ తరపున అవతరింప జేయబడినది}[ఫుస్సీలత్:41-42]మరియు అల్లాహ్ తఆలా ప్రవక్త సున్నతు సాంప్రదాయ గొప్పతనం గురించి తెలుపుతూ అది అల్లాహ్ తరుపునుండి దిగిన దైవవాణి అని చెప్పాడు:-{మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.}[అల్ హష్ర్ :7]

మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).

దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;

నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;

స్పష్టమైన అరబ్బీ భాషలో!(195)

[షుఆరా:192-195]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు ఈ ఖుర్ఆన్ ను మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు అయిన వాడి (అల్లాహ్) నుండి పొందుతున్నావు.

[అన్ నమ్ల్ :6]

ఈ పవిత్ర ఖుర్ఆను గ్రంధం అల్లాహ్ తరుపునుండి అవతరింపబడింది,మరియు మునుపటి దైవగ్రంధాలను దృవీకరిస్తుంది:అల్లాహ్ సెలవిచ్చాడు :

మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరుపు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు!

[యూనుస్:37]

ఈ మహోన్నతమైన దైవగ్రంధం అల్'ఖుర్ఆను' యూదులు మరియు క్రైస్తవులు తమ ధర్మంలో విభేధించిన అనేక సమస్యలను వివరంగా తీర్పుచేసింది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :-

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.

[అన్ నమ్ల్:76]

ఈ ఖుర్ఆను గ్రంధం అనేక స్పష్టమైన ఆధారాలను సాక్ష్యాలను కలిగి ఉంది,ఈ సాక్ష్యాధారాలు అల్లాహ్ కు చెందిన వాస్తవాలను,ఆయన ధర్మానికి మరియు ప్రతిఫలానికి చెందిన అనేక నిజవిషయాలను సమస్త ప్రజల పై తీర్పును స్థాపిస్తాయి.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు అన్నిరకాల ఉపమానములను పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని;

[జుమర్:27]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.

అన్ నహ్ల్ :89

పవిత్ర ఖుర్ఆన్ మిలియన్ల మంది ప్రజలను అబ్బురపరిచే అనేక ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది,ఈ ఖుర్ఆను కరీం 'అల్లాహ్ భూమ్యాకాశాలను ఎలా సృష్టించాడన్నది' స్పష్టంగా తెలుపుతున్నది

ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా?

[అల్ అంబియా:30]

మరియు అల్లాహ్ తాలా మనిషిని ఎలా సృష్టించాడు అల్లాహ్ సెలవిచ్చాడు:-

ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్నీ రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.

{అల్ హజ్జ్ :5}:- అతని నివాస స్థలం ఎక్కడ ఉంది,సజ్జనులకు దుర్జనులకు ఈ జీవితం తరువాత లభించే ప్రతిఫలం ఏమిటి? అనే ఈ సమస్యకు సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికే పేరా నెంబర్ (20') లో ప్రస్తావించబడ్డాయి మరియు ఈ ఉనికి అనుకోకుండా జరిగిన యాదృచ్చిక పరిణామామా లేదా గౌరవప్రదమైన పరమార్ధంకోసం కనుగొనబడిందా?

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

[అల్ ఆరాఫ్:185]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"

అల్ ముమినూన్:115

అల్ ఖుర్ఆన్ పవిత్ర గ్రంధం ఏ భాషలో అవతరింపబడినదో అదే భాషలో నేటి వరకు సురక్షితంగా ఉంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

{మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని సంరక్షిస్తాము}

[అల్ హిజ్ర్ :9]

ఇందులోనుండి ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,అంతేకాదు ఇందులో విరుద్దాలు,హెచ్చుతగ్గులు మార్పులు చేయబడటం అసాధ్యం.అల్లాహ్ సెలవిచ్చాడు:-

{ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరుపు నుండి గాక ఇతరుల తరుపు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!}

[నిసా :82]

మరియు ఇది ముద్రించబడినది ప్రచురించబడినది,ఇది అద్భుతమైన ఒక గొప్ప పుస్తకం,దీని పారాయణం,లేదా అర్ధఅనువాద పఠనం పుణ్యప్రదమైనది,ఇదేవిధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ సున్నతు'సంప్రదాయాలు,బోధనలు మరియు జీవిత చరిత్ర కూడా భద్రపరచబడ్డాయి,అంతేకాదు విశ్వసనీయ వరుస ఉల్లేఖకులశ్రేణితో నిక్షిప్తం చేయబడ్డాయి,ఇది ప్రవక్త మాట్లాడిన అరబిక్ భాషలో ముద్రించబడింది మరియు అనేక ఇతర భాషలలోకి అనువదించబడింది.పవిత్ర అల్-ఖుర్ఆను అల్కరీం మరియు దైవప్రవక్త సున్నతు సాంప్రదాయాలు ఇవి రెండు ఇస్లామీయ ఆదేశాలకు మరియు షరీఅతుకు ముఖ్య మౌలిక పునాదులు.ఇస్లాము తనవైపుకు ఆపాదించబడిన ప్రముఖుల వ్యవహారాలను గ్రహించదు,ఇది కేవలం పావనపరమైన దైవవాణి ఆధారంగానే తీసుకోబడుతుంది;అది అల్ ఖుర్ఆను అల్ కరీం మరియు దైవప్రవక్త సున్నతు సంప్రదాయాలు: అల్లాహ్ తాలా పవిత్ర ఖుర్ఆను గ్రంధం విశీష్టతను తెలుపుతూ ఇలా సెలవిచ్చాడు:-

{తమ వద్దకు హితోపదేశం వచ్చేసినప్పటికీ దాన్ని త్రోసిపుచ్చిన వారు కూడా మా నుండి దాగిలేరు అదొక ప్రతిష్టాత్మకమైన గ్రంధం,అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా దాని ముందు నుండి గానీ దాని వెనుక నుండి గానీ రాజాలదు ఎందుకంటే అది 'మహా వివేకవంతుడు,ప్రశంసనీయడైన అల్లాహ్ తరపున అవతరింప జేయబడినది}

[ఫుస్సీలత్:41-42]

మరియు అల్లాహ్ తఆలా ప్రవక్త సున్నతు సాంప్రదాయ గొప్పతనం గురించి తెలుపుతూ అది అల్లాహ్ తరుపునుండి దిగిన దైవవాణి అని చెప్పాడు:-

{మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.}

[అల్ హష్ర్ :7]

తల్లిదండ్రుల పట్ల ఇహ్'సాన్ చేయమని సంతానానికి వసియ్యతు ద్వారా ఇస్లాం ఆదేశిస్తుంది ఒకవేళ వారు ఇస్లామేతరులైన సరే.

అల్ ఇస్లాం తల్లిదండ్రుల పట్ల అత్యుత్తమంగానడుచుకోవాలని ఆజ్ఞాపిస్తుంది: అల్లాహ్ తాలా సెలవిచ్చాడు :-{మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.}[అల్ ఇస్రా:23]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునికి తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది."}[లుఖ్మాన్ :14]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి. చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్భుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలు తున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."}[అల్ అహ్ ఖాఫ్:15]అబూహురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు:-ఒకవ్యక్తి దైవప్రవక్త వద్దకి వచ్చి ఇలా అడిగాడు-ఓ రసూలుల్లాహ్ ! ప్రజల్లో నా ఉత్తమప్రవర్తనకు ఎక్కువ అర్హత ఎవరికి ఉంది?ప్రవక్త చెప్పారు:(నీ తల్లి) అతను అడిగాడు 'తరువాత ఎవరు ?ప్రవక్త చెప్పారు :మళ్ళీ నీ తల్లి,అతను ఆ తరువాత ఎవరు?అని అడిగాడు,ప్రవక్త 'ఆ పై కూడా నీ తల్లి అని చెప్పారు,అతను మళ్ళీ ఎవరు? అని అడిగాడు అప్పుడు ప్రవక్త 'నీ తండ్రి'అని చెప్పారు.సహీహ్ ముస్లిం.తల్లిదండ్రులు ముస్లింలు అయిన లేదా ముస్లిమేతరులు అయినా సరే వసియ్యతులో చేయబడిన ఈ ఆదేశం వర్తిస్తుంది.అస్మా బింత్ అబూ బకర్ తెలిపారు:- {దైవప్రవక్త ఖురైష్'తో ఒప్పందం కుదుర్చుకున్నరోజుల్లో ఒకసారి నా వద్దకి బహుదైవారాధకులైన నా తల్లి తన తండ్రితో కలిసి వచ్చింది,అప్పుడు నేనుఈ విషయం గురించి దైవప్రవక్తను అడిగాను-'నా తల్లి నా వద్దకి ప్రేమతో వచ్చింది,నేను ఆమెతో ఉత్తమంగా బంధాన్ని కొనసాగించాలా?ప్రవక్త బదులిచ్చారు:- {అవును,నీ తల్లితో ఉత్తమంగా మెలుగు}సహీహ్ అల్-బుఖారిఅయితే ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను ఇస్లాం నుండి అవిశ్వాసానికి మార్చడానికి ప్రయత్నించినట్లైతే అలాంటి సందర్భంలో వారికి విధేయత చూపకూడదని'ఇస్లాం ఆదేశిస్తు'చెప్తుంది,అల్లాహ్'ను విశ్వసిస్తూ నిలకడగా ఉండాలి,మరియు వారిపట్ల అత్యుత్తమంగా వ్యవహరిస్తూ ఉండాలి అల్లాహ్ తాలా సెలవిచ్చాడు:-{"మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను."}[లుఖ్మాన్:15]మరియు ఇస్లాం ఎన్నడూ ఒక ముస్లిము'ను తన ముస్లిమేతర బంధువులతో లేదా ముస్లిమేతరులతో 'ఇహ్సాన్'{ఉత్తమ}వైఖరి నుంచి ఆపదు,అతనితో వారు యుద్దంచేయనంతవరకు.అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.}[అల్ ముమ్'తహీన :8]మరియు ఇస్లాంధర్మం సంతానం పట్ల వసియ్యతు చేస్తుంది,మరియు ఇస్లాం తల్లిదండ్రులకు చేసిన గొప్ప వసియ్యతుల్లో ఒకటి 'తల్లిదండ్రులు తన సంతానానికి వారిపై గల అల్లాహ్ హక్కుల గురించి నేర్పాలి ,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన బాబాయి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమ తో చెప్పినట్లుగా:-{ఓ కుమారా !(లేదా ఓ చిన్నకుమారా)-కొన్ని వాక్యాలు నేను నీకు నేర్పించాలా?అల్లాహ్ నీకు ప్రయోజనం చేకూరుస్తాడు?నేను చెప్పండి'అన్నాను,దైవప్రవక్త సెలవిచ్చారు:- అల్లాహ్'(ధర్మం)ను రక్షించు ఆయన నిన్ను రక్షిస్తాడు,అల్లాహ్' (ధర్మం)ను రక్షించు'ఆయనను నీ ఎదుట నువ్వు పొందుతావు'నీవు సంతోషంలో ఆయనను గుర్తుంచుకో నిన్ను ఆయన నీ కష్టాల్లోగుర్తుపెట్టుకుంటాడు'దుఆ'చేయదలిస్తే కేవలం ఆ అల్లాహ్'ను మాత్రమే అర్ధించు'సహాయం కోరదలిస్తే కేవలం ఆ అల్లాహ్'ను మాత్రమే సహాయం అర్ధించు'}అహ్మద్ ఉల్లేఖనం 4/287తల్లిదండ్రులకు అల్లాహ్ ఆదేశించాడు'ఏమనగా 'వారు తమ సంతానానికి ప్రాపంచిక,పరలోక ప్రయోజనాలను చేకూర్చే వాటిని నేర్పించాలి, అల్లాహ్ సెలవిచ్చాడు:-4410{ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దైవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.}[సూరా తహ్రీం:6]అలీ రదియల్లాహు అన్హు పవిత్ర ఖుర్ఆను ఆయతు గురించి ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు:-{మీరు'మిమ్మల్ని మరియు మీ కుటుంబీకులను నరకాగ్ని నుండి రక్షించండి}ఆయన చెప్పారు:-'వారికి మర్యాదలు నేర్పించండి మరియు విద్య నేర్పించండి}దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తండ్రితో-'సంతానానికి నమాజు నేర్పిస్తూ సద్బుద్దులు చెప్తూ పెంచమని చెప్పారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు:-{ఏడు సంవత్సరాల వయసు కలిగినప్పుడు మీ సంతానానికి మీరు నమాజును ఆదేశించండి}దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారుఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{మీలోని ప్రతీ ఒక్కరూ కాపరి,ప్రతీఒక్కరు తమ బాధ్యత గురించి ప్రశ్నించబడతారు,ఇమామ్ ఒక కాపరి తన పాలితుల పట్ల ప్రశ్నించబడతాడు,పురుషుడు తన కుటుంబానికి కాపరి,అతను తన బాధ్యత గురించి ప్రశ్నించబడతాడు,స్త్రీ తన భర్త ఇంటికి కాపరి తన బాధ్యతల గురించి ప్రశ్నించబడుతుంది,సేవకుడు ఒక కాపరి తన యజమాని డబ్బు గురించి అతన్ని ప్రశ్నించబడుతుంది,మీరందరూ కాపరీలు,తమ బాధ్యతల గురించి ప్రతీ ఒక్కరూ ప్రశ్నించబడతారు}సహీహ్ ఇబ్ను హిబ్బాన్కుటుంబీకులపై సంతానం పై డబ్బు ఖర్చు చేయమని ఇస్లాం తండ్రికి ఆదేశిస్తుంది,దీని గురించి ఇప్పటికే పేరా నెంబర్ (18) లో ప్రస్తావించబడింది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సంతానం పై ఖర్చుచేసే విశిష్టత గురించి ఇలా తెలిపారు:ఇలా చెప్పారు.విశిష్టమైన (దీనార్)రూపాయి ఒక పురుషుడు ఖర్చు చేసేది:-తన కుటుంబీకులపై ఖర్చు పెట్టే దీనార్(రూపాయి),దైవమార్గంలో వెళ్లడానికి వాహనం (జంతువు)పై ఖర్చుపెట్టే (రూపాయి),దైవమార్గంలో తన మిత్రుల కోసం ఖర్చుపెట్టే దీనార్(రూపాయి)}అబూ ఖలాబా చెప్పారు:- కుటుంబం పై ప్రథమంగా ఖర్చు చేయాలి,ఆపై మళ్ళీ చెప్పారు:-చిన్నపిల్లల కోసం ఖర్చు చేసే మనిషి కంటే ఇంకా ఏ మనిషికి అధికపుణ్యం లభిస్తుంది,అల్లాహ్ అతని ద్వారా వారిని సంరక్షిస్తాడు లేదా ప్రయోజనం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.సహీహ్ ముస్లిం (994)

{మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.}

[అల్ ఇస్రా:23]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునికి తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది."}

[లుఖ్మాన్ :14]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి, అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి. చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల వయస్సుకు చేరి ఇలా అంటాడు: "ఓ నా ప్రభూ! నీవు, నాకూ మరియు నా తల్లిదండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయటానికి నాకు సద్భుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి. నిశ్చయంగా, నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలు తున్నాను. మరియు నిశ్చయంగా, నేను నీకు విధేయులైన (ముస్లింలైన) వారిలో ఒకడిని."}

[అల్ అహ్ ఖాఫ్:15]

అబూహురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు:-ఒకవ్యక్తి దైవప్రవక్త వద్దకి వచ్చి ఇలా అడిగాడు-ఓ రసూలుల్లాహ్ ! ప్రజల్లో నా ఉత్తమప్రవర్తనకు ఎక్కువ అర్హత ఎవరికి ఉంది?ప్రవక్త చెప్పారు:(నీ తల్లి) అతను అడిగాడు 'తరువాత ఎవరు ?ప్రవక్త చెప్పారు :మళ్ళీ నీ తల్లి,అతను ఆ తరువాత ఎవరు?అని అడిగాడు,ప్రవక్త 'ఆ పై కూడా నీ తల్లి అని చెప్పారు,అతను మళ్ళీ ఎవరు? అని అడిగాడు అప్పుడు ప్రవక్త 'నీ తండ్రి'అని చెప్పారు.

సహీహ్ ముస్లిం.

తల్లిదండ్రులు ముస్లింలు అయిన లేదా ముస్లిమేతరులు అయినా సరే వసియ్యతులో చేయబడిన ఈ ఆదేశం వర్తిస్తుంది.

అస్మా బింత్ అబూ బకర్ తెలిపారు:- {దైవప్రవక్త ఖురైష్'తో ఒప్పందం కుదుర్చుకున్నరోజుల్లో ఒకసారి నా వద్దకి బహుదైవారాధకులైన నా తల్లి తన తండ్రితో కలిసి వచ్చింది,అప్పుడు నేనుఈ విషయం గురించి దైవప్రవక్తను అడిగాను-'నా తల్లి నా వద్దకి ప్రేమతో వచ్చింది,నేను ఆమెతో ఉత్తమంగా బంధాన్ని కొనసాగించాలా?ప్రవక్త బదులిచ్చారు:- {అవును,నీ తల్లితో ఉత్తమంగా మెలుగు}

సహీహ్ అల్-బుఖారి

అయితే ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను ఇస్లాం నుండి అవిశ్వాసానికి మార్చడానికి ప్రయత్నించినట్లైతే అలాంటి సందర్భంలో వారికి విధేయత చూపకూడదని'ఇస్లాం ఆదేశిస్తు'చెప్తుంది,అల్లాహ్'ను విశ్వసిస్తూ నిలకడగా ఉండాలి,మరియు వారిపట్ల అత్యుత్తమంగా వ్యవహరిస్తూ ఉండాలి అల్లాహ్ తాలా సెలవిచ్చాడు:-

{"మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను."}

[లుఖ్మాన్:15]

మరియు ఇస్లాం ఎన్నడూ ఒక ముస్లిము'ను తన ముస్లిమేతర బంధువులతో లేదా ముస్లిమేతరులతో 'ఇహ్సాన్'{ఉత్తమ}వైఖరి నుంచి ఆపదు,అతనితో వారు యుద్దంచేయనంతవరకు.అల్లాహ్ సెలవిచ్చాడు:-

{ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.}

[అల్ ముమ్'తహీన :8]

మరియు ఇస్లాంధర్మం సంతానం పట్ల వసియ్యతు చేస్తుంది,మరియు ఇస్లాం తల్లిదండ్రులకు చేసిన గొప్ప వసియ్యతుల్లో ఒకటి 'తల్లిదండ్రులు తన సంతానానికి వారిపై గల అల్లాహ్ హక్కుల గురించి నేర్పాలి ,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన బాబాయి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమ తో చెప్పినట్లుగా:-

{ఓ కుమారా !(లేదా ఓ చిన్నకుమారా)-కొన్ని వాక్యాలు నేను నీకు నేర్పించాలా?అల్లాహ్ నీకు ప్రయోజనం చేకూరుస్తాడు?నేను చెప్పండి'అన్నాను,దైవప్రవక్త సెలవిచ్చారు:- అల్లాహ్'(ధర్మం)ను రక్షించు ఆయన నిన్ను రక్షిస్తాడు,అల్లాహ్' (ధర్మం)ను రక్షించు'ఆయనను నీ ఎదుట నువ్వు పొందుతావు'నీవు సంతోషంలో ఆయనను గుర్తుంచుకో నిన్ను ఆయన నీ కష్టాల్లోగుర్తుపెట్టుకుంటాడు'దుఆ'చేయదలిస్తే కేవలం ఆ అల్లాహ్'ను మాత్రమే అర్ధించు'సహాయం కోరదలిస్తే కేవలం ఆ అల్లాహ్'ను మాత్రమే సహాయం అర్ధించు'}

అహ్మద్ ఉల్లేఖనం 4/287

తల్లిదండ్రులకు అల్లాహ్ ఆదేశించాడు'ఏమనగా 'వారు తమ సంతానానికి ప్రాపంచిక,పరలోక ప్రయోజనాలను చేకూర్చే వాటిని నేర్పించాలి, అల్లాహ్ సెలవిచ్చాడు:-4410

{ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దైవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.}

[సూరా తహ్రీం:6]

అలీ రదియల్లాహు అన్హు పవిత్ర ఖుర్ఆను ఆయతు గురించి ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు:-

{మీరు'మిమ్మల్ని మరియు మీ కుటుంబీకులను నరకాగ్ని నుండి రక్షించండి}

ఆయన చెప్పారు:-'వారికి మర్యాదలు నేర్పించండి మరియు విద్య నేర్పించండి}

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తండ్రితో-'సంతానానికి నమాజు నేర్పిస్తూ సద్బుద్దులు చెప్తూ పెంచమని చెప్పారు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు:-

{ఏడు సంవత్సరాల వయసు కలిగినప్పుడు మీ సంతానానికి మీరు నమాజును ఆదేశించండి}

దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{మీలోని ప్రతీ ఒక్కరూ కాపరి,ప్రతీఒక్కరు తమ బాధ్యత గురించి ప్రశ్నించబడతారు,ఇమామ్ ఒక కాపరి తన పాలితుల పట్ల ప్రశ్నించబడతాడు,పురుషుడు తన కుటుంబానికి కాపరి,అతను తన బాధ్యత గురించి ప్రశ్నించబడతాడు,స్త్రీ తన భర్త ఇంటికి కాపరి తన బాధ్యతల గురించి ప్రశ్నించబడుతుంది,సేవకుడు ఒక కాపరి తన యజమాని డబ్బు గురించి అతన్ని ప్రశ్నించబడుతుంది,మీరందరూ కాపరీలు,తమ బాధ్యతల గురించి ప్రతీ ఒక్కరూ ప్రశ్నించబడతారు}

సహీహ్ ఇబ్ను హిబ్బాన్

కుటుంబీకులపై సంతానం పై డబ్బు ఖర్చు చేయమని ఇస్లాం తండ్రికి ఆదేశిస్తుంది,దీని గురించి ఇప్పటికే పేరా నెంబర్ (18) లో ప్రస్తావించబడింది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సంతానం పై ఖర్చుచేసే విశిష్టత గురించి ఇలా తెలిపారు:ఇలా చెప్పారు.

విశిష్టమైన (దీనార్)రూపాయి ఒక పురుషుడు ఖర్చు చేసేది:-తన కుటుంబీకులపై ఖర్చు పెట్టే దీనార్(రూపాయి),దైవమార్గంలో వెళ్లడానికి వాహనం (జంతువు)పై ఖర్చుపెట్టే (రూపాయి),దైవమార్గంలో తన మిత్రుల కోసం ఖర్చుపెట్టే దీనార్(రూపాయి)}అబూ ఖలాబా చెప్పారు:- కుటుంబం పై ప్రథమంగా ఖర్చు చేయాలి,ఆపై మళ్ళీ చెప్పారు:-చిన్నపిల్లల కోసం ఖర్చు చేసే మనిషి కంటే ఇంకా ఏ మనిషికి అధికపుణ్యం లభిస్తుంది,అల్లాహ్ అతని ద్వారా వారిని సంరక్షిస్తాడు లేదా ప్రయోజనం చేకూరుస్తాడు మరియు వారిని సంపన్నులుగా చేస్తాడు.

సహీహ్ ముస్లిం (994)

మాటలో,ఆచరణలలో న్యాయశీలతను అనుసరించాలని,చివరికి శత్రువులతో కూడా'అనుసరించాలని ఇస్లాం ఆదేశిస్తుంది.

అల్లాహ్ తఆలా తన దాసులకు చెందిన కార్యక్రమాలలో,ప్రణాళిక వ్యవహారరూపకల్పనలో న్యాయం,ధర్మపు'సుగుణాలను జోడించుకున్నాడు,ఆయన ఆదేశించిన ఆజ్ఞలలో నిషేధించిన ఆదేశాలలో ఆయన సృజనలో,వ్యవహారనిర్వహణలో సరళ మార్గాన్ని కలిగి ఉన్నాడు.{నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.}[ఆల్ ఇమ్రాన్ :18]అల్లాహ్ తఆలా న్యాయశీలం గురించి ఆదేశించాడు ఇలా సెలవిచ్చాడు :-{(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు.}[అల్ ఆరాఫ్:29]సమస్త ప్రవక్తలు,సందేశహరులు(అలైహిముస్సలాం) న్యాయశీలతతొ పంపించబడ్డారు:-అల్లాహ్ సెలవిచ్చాడు:-వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరియు (ఇదంతా) అల్లాహ్ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలశాలి, సర్వశక్తిమంతుడు.[అల్ హదీద్ :25]న్యాయశీలత'యే మాటల్లో,ఆచరణాల్లో (మీజాన్) కొలమానం.మాటల్లో చేతల్లో న్యాయశీలతను కలిగి ఉండాలని అది శత్రువులతోనైనా సరే'-ఇస్లాం ఆదేశిస్తుంది: అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.}{నిసా:135}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.}[అల్ మాయిదా:2]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది.}[అల్ మాయిదా:8]ఈ రోజు మీరు ఏదైన జాతిలోకానీ లేదా ప్రజలు అవలంభిస్తున్న ఏదైనా మతంలో కానివ్వండి ఇలాంటి వ్యవాహారాన్ని పొందుతారా?న్యాయం కోసం,సత్యం కోసం తనకు వ్యతిరేఖంగా,తల్లిదండ్రులకు వ్యతిరేఖంగా,సమీప బంధువులకు వ్యతిరేఖంగా మరియు శత్రువులతో మిత్రువులతో న్యాయంగా వ్యవహరిస్తూ'సాక్ష్యామివ్వడం లాంటివి.మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సంతానం మధ్య న్యాయాన్ని అవలంబించమని ఆజ్ఞాపించారు'ఆమిర్ కథనం : నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమ మింబర్ పై ఇలా చెప్తున్నప్పుడు నేను విన్నాను:నా తండ్రి నాకు ఒక కానుక ఇచ్చారు,అప్పుడు (నా తల్లి) అమ్రా బింతు రవాహ (ఆయనతో)ఇలా చెప్పారు:-'నీవు దీనిపై దైవప్రవక్తను సాక్ష్యంగా పెట్టనంత వరకు నేను స్వీకరించలేను (ఒప్పుకొను),అప్పుడు ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకి వచ్చి చెప్పారు;నిశ్చయంగా నేను అమ్రా బింత్ రవాహ తో కలిగిన నా కొడుకుకి ఒక కానుక ఇచ్చాను దానికి ఆమె మిమ్మల్ని 'నేను సాక్ష్యంగా పెట్టాలని'ఆదేశించింది ఓ దైవప్రవక్త,!-అప్పుడు ప్రవక్త అతనితో ఇలా అడిగారు:{నీ మిగతా సంతానానికి కూడా ఇలాంటి కానుకను ఇచ్చావా?}అతను లేదు'అని చెప్పాడు,ఆపై ప్రవక్త ఉపదేశిస్తు {అల్లాహ్'కు భయపడు,నీ సంతానమందరి మధ్య న్యాయంగా వ్యవహరించు}అని చెప్పారు,అప్పుడు ఆయన తిరిగి వెళ్ళి తన కానుకను తిరిగి తీసుకున్నారు}అని తెలియజేశారు.}సహీహ్ బుఖారి 2587

{నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.}

[ఆల్ ఇమ్రాన్ :18]

అల్లాహ్ తఆలా న్యాయశీలం గురించి ఆదేశించాడు ఇలా సెలవిచ్చాడు :-

{(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు.}

[అల్ ఆరాఫ్:29]

సమస్త ప్రవక్తలు,సందేశహరులు(అలైహిముస్సలాం) న్యాయశీలతతొ పంపించబడ్డారు:-అల్లాహ్ సెలవిచ్చాడు:-

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరియు (ఇదంతా) అల్లాహ్ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలశాలి, సర్వశక్తిమంతుడు.

[అల్ హదీద్ :25]

న్యాయశీలత'యే మాటల్లో,ఆచరణాల్లో (మీజాన్) కొలమానం.

మాటల్లో చేతల్లో న్యాయశీలతను కలిగి ఉండాలని అది శత్రువులతోనైనా సరే'-ఇస్లాం ఆదేశిస్తుంది: అల్లాహ్ సెలవిచ్చాడు:-

{ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.}

{నిసా:135}

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.}

[అల్ మాయిదా:2]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది.}

[అల్ మాయిదా:8]

ఈ రోజు మీరు ఏదైన జాతిలోకానీ లేదా ప్రజలు అవలంభిస్తున్న ఏదైనా మతంలో కానివ్వండి ఇలాంటి వ్యవాహారాన్ని పొందుతారా?న్యాయం కోసం,సత్యం కోసం తనకు వ్యతిరేఖంగా,తల్లిదండ్రులకు వ్యతిరేఖంగా,సమీప బంధువులకు వ్యతిరేఖంగా మరియు శత్రువులతో మిత్రువులతో న్యాయంగా వ్యవహరిస్తూ'సాక్ష్యామివ్వడం లాంటివి.

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సంతానం మధ్య న్యాయాన్ని అవలంబించమని ఆజ్ఞాపించారు'

ఆమిర్ కథనం : నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమ మింబర్ పై ఇలా చెప్తున్నప్పుడు నేను విన్నాను:నా తండ్రి నాకు ఒక కానుక ఇచ్చారు,అప్పుడు (నా తల్లి) అమ్రా బింతు రవాహ (ఆయనతో)ఇలా చెప్పారు:-'నీవు దీనిపై దైవప్రవక్తను సాక్ష్యంగా పెట్టనంత వరకు నేను స్వీకరించలేను (ఒప్పుకొను),అప్పుడు ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకి వచ్చి చెప్పారు;నిశ్చయంగా నేను అమ్రా బింత్ రవాహ తో కలిగిన నా కొడుకుకి ఒక కానుక ఇచ్చాను దానికి ఆమె మిమ్మల్ని 'నేను సాక్ష్యంగా పెట్టాలని'ఆదేశించింది ఓ దైవప్రవక్త,!-అప్పుడు ప్రవక్త అతనితో ఇలా అడిగారు:{నీ మిగతా సంతానానికి కూడా ఇలాంటి కానుకను ఇచ్చావా?}అతను లేదు'అని చెప్పాడు,ఆపై ప్రవక్త ఉపదేశిస్తు {అల్లాహ్'కు భయపడు,నీ సంతానమందరి మధ్య న్యాయంగా వ్యవహరించు}అని చెప్పారు,అప్పుడు ఆయన తిరిగి వెళ్ళి తన కానుకను తిరిగి తీసుకున్నారు}అని తెలియజేశారు.}

సహీహ్ బుఖారి 2587

ఎందుకంటే ప్రజల మరియు రాజ్యాల వ్యవహారాలు కేవలం న్యాయం వల్ల మాత్రమే నెలకొల్పబడతాయి మరియు న్యాయం తో మాత్రమే ప్రజలు తమ మతాల, ప్రాణాలు,సంతానం,గౌరవం,ఆస్తి మరియు మాతృభూమి యొక్క శాంతిని పొందగలరు.అందువల్ల మనం చూస్తాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా యొక్క కాఫిర్ సత్యతిరస్కారులు ముస్లిములను ఇరకాటుకు,ఇబ్బందులకు గురిచేసినప్పుడు వారికి అబిసీనియా (అల్ హబ్షా)వైపుకు హిజ్రతు వలుసవెళ్లాలని ఆదేశించారు,దీనికి గల కారణం అక్కడ ఉన్న రాజు న్యాయశీలుడు,ఏ ఒక్కరిపై దౌర్జన్యం చేసేవాడు కాదు.

ఇస్లాం సమస్త సృష్టితాలతో ఉత్తమంగా మెలగాలని ఆదేశిస్తుంది మరియు అత్యుత్తమ నడవడిక,సత్కర్యాల వైపుకు ఆహ్వానిస్తుంది.

ఇస్లాం ధర్మం సమస్త సృష్టితాల పట్ల అత్యుత్తమంగానడుచుకోవాలని ఆజ్ఞాపిస్తుంది:అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు.}[నహ్ల్ :90]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.[ఆల్ ఇమ్రాన్ :134]ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{'నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ విషయం పై ఇహ్సాన్ ను(అత్యుత్తమత) విధి చేశాడు,కాబట్టి మీరు ఉత్తమంగా వదించండి,ఉత్తమంగా జుబాహ్ చేయండి,మీ కత్తులను పదునుపర్చుకొండి,జంతువులకు శాంతిని ప్రసాదించండి.}సహీహ్ ముస్లిం (1955)ఇస్లాం అత్యుత్తమ నడవడిక మరియు సర్వోత్తమకర్మల వైపుకు ఆహ్వానిస్తుంది,అల్లాహ్ తఆలా రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ లక్షణాల గురించి మునుపటి గ్రంధాలలో తెలియజేశాడు:-{"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."}[అల్ ఆరాఫ్:157]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:ఓ ఆయేషా! నిశ్చయంగా అల్లాహ్' మృధువైనవాడు, మృదువత్వాన్నిప్రేమిస్తాడు,మరియు మృధువత్వం పై నొసగుతాడు'కఠినత్వం పై ఇవ్వడు మరియు మరే ఇతర విషయానికి ఆయన అనుగ్రహించడు.సహీహ్ ముస్లిం (2593)రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{నిశ్చయంగా అల్లాహ్ మీపై ఈ విషయాలు నిషేధించాడు:- తల్లిదండ్రుల అవిధేయత,ఆడపిల్లలను జీవసమాధిచేయడం,విధి హక్కులను చెల్లించకపోవడం,ఇతరుల డబ్బును అన్యాయంగా హరించడం,మరియు పనికిమాలిన ముచ్చట్లను,హద్దుమీరి ప్రశ్నించుటను మరియు సంపదను,డబ్బును వృథా ఖర్చు చేయడం.}సహీహ్ బుఖారి 2408రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{'మీరు విశ్వసించనంత వరకు స్వర్గం లో ప్రవేశించలేరు,పరస్పరం ప్రేమిచనంతవరకు విశ్వసించలేరు,నేను మీకు ఒక విషయం చెప్పాను అది చేసినట్లైతే మీ మధ్య ప్రేమాభిమానాలు చిగురిస్తాయి?'మీరు సలాం ను మీ మధ్య వ్యాపింపచేయండి'}సహీహ్ ముస్లిం (54)

{నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు.}

[నహ్ల్ :90]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

(వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

[ఆల్ ఇమ్రాన్ :134]

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{'నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ విషయం పై ఇహ్సాన్ ను(అత్యుత్తమత) విధి చేశాడు,కాబట్టి మీరు ఉత్తమంగా వదించండి,ఉత్తమంగా జుబాహ్ చేయండి,మీ కత్తులను పదునుపర్చుకొండి,జంతువులకు శాంతిని ప్రసాదించండి.}

సహీహ్ ముస్లిం (1955)

ఇస్లాం అత్యుత్తమ నడవడిక మరియు సర్వోత్తమకర్మల వైపుకు ఆహ్వానిస్తుంది,అల్లాహ్ తఆలా రసూలుల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ లక్షణాల గురించి మునుపటి గ్రంధాలలో తెలియజేశాడు:-

{"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."}

[అల్ ఆరాఫ్:157]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఓ ఆయేషా! నిశ్చయంగా అల్లాహ్' మృధువైనవాడు, మృదువత్వాన్నిప్రేమిస్తాడు,మరియు మృధువత్వం పై నొసగుతాడు'కఠినత్వం పై ఇవ్వడు మరియు మరే ఇతర విషయానికి ఆయన అనుగ్రహించడు.

సహీహ్ ముస్లిం (2593)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నిశ్చయంగా అల్లాహ్ మీపై ఈ విషయాలు నిషేధించాడు:- తల్లిదండ్రుల అవిధేయత,ఆడపిల్లలను జీవసమాధిచేయడం,విధి హక్కులను చెల్లించకపోవడం,ఇతరుల డబ్బును అన్యాయంగా హరించడం,మరియు పనికిమాలిన ముచ్చట్లను,హద్దుమీరి ప్రశ్నించుటను మరియు సంపదను,డబ్బును వృథా ఖర్చు చేయడం.}

సహీహ్ బుఖారి 2408

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{'మీరు విశ్వసించనంత వరకు స్వర్గం లో ప్రవేశించలేరు,పరస్పరం ప్రేమిచనంతవరకు విశ్వసించలేరు,నేను మీకు ఒక విషయం చెప్పాను అది చేసినట్లైతే మీ మధ్య ప్రేమాభిమానాలు చిగురిస్తాయి?'మీరు సలాం ను మీ మధ్య వ్యాపింపచేయండి'}

సహీహ్ ముస్లిం (54)

ఇస్లాం ప్రశంసనీయ ప్రవర్తనలను అలవర్చుకోవాలని ఆదేశిస్తున్నాడు అవి : సత్యసంధత,అమానతులు చెల్లించడం,పవిత్రత,బిడియం,ధైర్యం,ఔదార్యం,దయాజాలి, అవసరార్ధులకు సహాయం,బలహీనులకు సహాయం,ఆకలిగొన్నవాళ్లకు అన్నంపెట్టడం,పొరుగువారితో సత్ప్రవర్తన,బంధుత్వాన్ని కలపడం,జంతువుల పట్ల దయచూపడం మొదలైనవి.

ఇస్లాం ప్రశంసనీయ నైతికతను సత్ప్రవర్తనలను అలవర్చుకోవాలని ఆదేశిస్తుంది, మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు,ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను}సహీహ్ అల్ అదబుల్ ముఫ్రద్ 207.రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{నిశ్చయంగా మీలో నాకు అతిప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చునేవారు,ఎవరంటే 'నైతికత రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే' మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చునేవారు'ఎవరంటే 'ఎక్కువగా నోటిదూల కలిగి అనాలోచనతో మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన'అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త 'గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు}సిల్'సిలతూసహీహ 791అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం;తెలిపారు'మహనీయ దైవప్రవక్త 'దూషించువారు కాని జగడాలు పడువారు కానీ కాదు ఆయన ఎల్లప్పుడూ ఇలా అనేవారు ' నిశ్చయంగా మీలోని మేలైనవారు'ఉత్తమ సద్గుణాలు కలిగిన వారే.సహీహ్ బుఖారి 3559ఇలాంటి ఎన్నో ఆయతులు,హదీసులు -ఇస్లాం 'అత్యుత్తమ నైతికత,సత్ప్రవర్తన,అత్యుత్తమ ఆచరణలు సర్వసాధారణంగా పాఠించాలని ప్రోత్సహిస్తుంది' అనే విషయాన్నిరూఢీ పరుస్తున్నాయి.ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _సత్యం పలకడం_ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{సత్యం పలకడం మీ పై విధి,ఎందుకంటే అది మంచి వైపుకు మార్గదర్శనం చేస్తుంది,ఆ మంచి స్వర్గానికి తీసుకెళ్తుంది,ఒకవ్యక్తి ఎల్లప్పుడు సత్యంచెప్తూఉంటూ,సత్యంకోసం పాటుపడతూ ఉండటంవల్ల చివరికి అతనిపేరు'సిద్దీఖ్' గా అల్లాహ్ వద్ద నమోదు చేయబడుతుంది.}సహీహ్ ముస్లిం (2607)ఇస్లాం ఆదేశిస్తున్న సత్ప్రవర్తనలో ఒకటి 'అమానతులను అప్పచెప్పడం'అల్లాహ్ తాలా సెలవిచ్చాడు :-{పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు.}[నిసా :58]ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _"పవిత్రత"_ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{ముగ్గురి సహాయం అల్లాహ్ నుండి పూర్తిచేయబడుతుంది:- అందులో ఒకటి ప్రస్తావించబడింది : పవిత్రంగా ఉండటానికి వివాహం చేసుకునువాడు}సునన్ తిర్మిజీ 1655దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి దుఆ లోనిది.ఆయన ఇలా దుఆ చేసేవారు:-{"అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా,వత్తుఖా,వల్ అఫాఫ,వల్ ఘినా"ఓ అల్లాహ్ నిశ్చయంగా నిన్ను నేను మార్గదర్శనాన్ని,దైవభీతిని,రక్షణని మరియు,కలిమిని (సంతృప్తిని)అర్ధిస్తున్నాను}సహీహ్ ముస్లిం 2721ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _బిడియం/సిగ్గు.'మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{సిగ్గు,బిడియం మేలును మాత్రమే ప్రసాదిస్తుంది}సహీహ్ బుఖారి 6117రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{ప్రతీ ధర్మానికి ఒక ప్రత్యేకమైన గొప్పసత్ప్రవర్తన ఉంటుంది,ఇస్లాం లో ఉన్నగొప్ప సత్ప్రవర్తన అల్ హయా -బిడియం సిగ్గు.అల్ బైహఖీ షోబల్ ఈమాన్'లో ఉల్లేఖించారు 6/2619ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి ' ధైర్యం'అనస్' రదియల్లాహుఅన్హు చెప్పారు:-{ప్రజల్లో అత్యంతసుందరుడు,అతి ధైర్యవంతుడు,దానవంతుడు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం!,ఒకసారి మదీనా వాసులు(నగరం అవతల భయంకర శబ్దాలకు)భయబ్రాంతులకు గురయ్యారు,అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గుర్రం తీసుకుని ఒంటరిగా అటువైపు మొదట బయల్దేరివెళ్లారు}సహీహ్ బుఖారి 2820మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్'పిరికితనం నుండి ఎక్కువగా అల్లాహ్ యొక్క శరణు వేడుకునేవారు:ఇలా దుఆ చేసేవారు :ఓ అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.(అల్లాహుమ్మఇన్నీఅవూజూబిక మినల్' జుబ్'ని).సహీహ్ బుఖారి 6374ఇస్లాం ఆదేశిస్తున్న సత్ప్రవర్తనలో ఒకటి 'ఔదార్యం,దయజాలిచూపడం'అల్లాహ్ తాలా సెలవిచ్చాడు :-{అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనం వలే ఉంటుంది, దేని నుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.}[అల్ బఖర:261]మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క ఒక సుగుణం దయాజాలి గుణం'-ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం తెలియజేశారు:-{మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజల్లో అత్యుత్తమ దాతృత్వంగలవారు,రమదాను మాసంలో జీబ్రీల్'ను కలిసిన తరువాత ఆయన దాతృత్వమనేది రెట్టింపు అవుతుంది,జీబ్రీల్ అలైహిస్సలమ్ రమదానులో ప్రతీ రాత్రి ప్రవక్తను కలిసేవారు అలా ఆ మాసం గడిచిపోయేది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీబ్రీల్'కు ఖుర్ఆను పూర్తిగా వినిపించేవారు,జీబ్రీల్ అలైహిస్సలాం ఆయనను(స)కలిసిన తరువాత మంచిలో ఔదార్యంలో వీచే గాలికంటే అధికంగా దాతృవృద్ది జరిగేది}సహీహ్ బుఖారి 1902ఇస్లాం ఆదేశించే మరికొన్ని సద్గుణాలలోఒకటి 'నిరుపేదలకు సహాయం చేయడం,బలహీనులకు ఉపశమనం కలిగించడం,ఆకలిగొన్నవాళ్లకు అన్నంపెట్టడం,పొరుగువారితో ఉత్తమంగా మెలగడం,బంధుత్వాన్ని కలపడం,జంతువుల పట్ల దయచూపడం మొదలైనవి.అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం;నిశ్చయంగా ఒక వ్యక్తి మహనీయ దైవప్రవక్తను ప్రశ్నిస్తూ 'మేలైన ఇస్లాం ఏమిటి? అని అడిగాడు ఆయన సమాధానమిస్తూ'అన్నదానం చేయడం, సుపరిచితులకి,అపరిచితులకి సలాం చేయడం అని'చెప్పారు.సహీహ్ బుఖారి 12రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{{ఒకమారు ఒకబాటసారి మార్గం గుండా వెళ్లసాగాడు,అతనికి తీవ్రంగా దప్పికవేసింది,దగ్గర్లో ఒక బావి కనపడింది,అందులో దిగి నీటితో దప్పిక తీర్చుకుని బయటికి వచ్చాడు,పిదప అక్కడ ఒక కుక్క దప్పిక వల్ల నేలను నాకటాన్ని గమనించాడు,అప్పుడతను 'ఈ కుక్క'కు కూడా నాలాగే తీవ్రదప్పిక కలిగినట్లు ఉంది' అనుకున్నాడు'ఆపై మళ్ళీ బావిలోకి దిగి తన మేజోళ్లలో నీటిని నింపి దాని నోటివద్ద పెట్టాడు,ఆ కుక్క నీటిని త్రాగింది,ఆపై అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపుకున్నాడు,ఈ కారణంగా అతను ప్రక్షాళితుడయ్యాడు}సహచరులు అడిగారు:-'ఓ దైవప్రవక్త! మా ఈ పశువుల ద్వారా మాకు పుణ్యం లభిస్తుందా?ప్రవక్త చెప్పారు:- {అవును,తేమను కలిగిన ప్రతీ కాలేయంలో పుణ్యం ఉంది}}సహీహ్ ఇబ్ను హిబ్బాన్ 544.రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{వితంతువుల మరియు అనాధాల బాగోగుల నిమిత్తం పరితపిస్తూ కృషిచేసేవాడు ధర్మపోరాటంలో పాల్గున్న ఒక ముజాహిదు'లాంటివాడు,రాత్రిభవళ్లు తహజ్జుద్'నమాజులను,ఉపవాసాలను స్థాపించేవ్యక్తి కి సమానం.}సహీహ్ బుఖారి 5353మరియు ఇస్లాం రక్తసంబంధీకుల హక్కులను దృఢపరుస్తుంది అంతేకాదు వారి పట్ల బంధుత్వాన్నికొనసాగించడం తప్పనిసరిచేస్తుంది. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:-{దైవప్రవక్త విశ్వాసులకు (ముస్లింలకు),తమ ప్రాణాలకంటే కూడా ముఖ్యుడు.మరియు ఆయన భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు -ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.}[అల్ అహ్'జాబ్ :6 ]భూమిపై అవినీతితో బంధుత్వ సంబంధాలను తెంచుకోవద్దని హెచ్చరించింది, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అన్నాడు:-{(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"}ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు.ముహమ్మద్:22-23దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ బోధించారు :- {రక్తసంభంధాలను తెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించడు}సహీహ్ ముస్లిం (2556)బంధుత్వాన్ని విధిగా పాఠించవలసిన రక్తసంబంధీకులు వీరు :- తల్లిదండ్రులు,అన్నాతమ్ముళ్ళు,అక్కాచెల్లెళ్ళు,మేనమామలు,మేనత్తలు,పెద్దమ్మ,చిన్నమ్మలు,పెద్దనాన్న బాబాయి తదితరులు.ఇస్లాం అవిశ్వాసి అయినా పొరుగువారి హక్కులను ధృవీకరిస్తుంది,సర్వశక్తిమంతుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు.}{నిసా :36}రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:జీబ్రీల్ అలైహిస్సలాం నాకు పొరుగువాని గురించి పలుమార్లు ఉపదేశించారు నేను చివరికి 'ఆస్తిలో వారికి కూడా వారసత్వం'కల్గుతుందేమోనని సందేహపడ్డాను.సహీ అబూదావూద్ 5152

{నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు,ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను}

సహీహ్ అల్ అదబుల్ ముఫ్రద్ 207.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నిశ్చయంగా మీలో నాకు అతిప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చునేవారు,ఎవరంటే 'నైతికత రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే' మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చునేవారు'ఎవరంటే 'ఎక్కువగా నోటిదూల కలిగి అనాలోచనతో మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన'అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త 'గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు}

సిల్'సిలతూసహీహ 791

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం;తెలిపారు'మహనీయ దైవప్రవక్త 'దూషించువారు కాని జగడాలు పడువారు కానీ కాదు ఆయన ఎల్లప్పుడూ ఇలా అనేవారు ' నిశ్చయంగా మీలోని మేలైనవారు'ఉత్తమ సద్గుణాలు కలిగిన వారే.

సహీహ్ బుఖారి 3559

ఇలాంటి ఎన్నో ఆయతులు,హదీసులు -ఇస్లాం 'అత్యుత్తమ నైతికత,సత్ప్రవర్తన,అత్యుత్తమ ఆచరణలు సర్వసాధారణంగా పాఠించాలని ప్రోత్సహిస్తుంది' అనే విషయాన్నిరూఢీ పరుస్తున్నాయి.

ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _సత్యం పలకడం_ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

{సత్యం పలకడం మీ పై విధి,ఎందుకంటే అది మంచి వైపుకు మార్గదర్శనం చేస్తుంది,ఆ మంచి స్వర్గానికి తీసుకెళ్తుంది,ఒకవ్యక్తి ఎల్లప్పుడు సత్యంచెప్తూఉంటూ,సత్యంకోసం పాటుపడతూ ఉండటంవల్ల చివరికి అతనిపేరు'సిద్దీఖ్' గా అల్లాహ్ వద్ద నమోదు చేయబడుతుంది.}

సహీహ్ ముస్లిం (2607)

ఇస్లాం ఆదేశిస్తున్న సత్ప్రవర్తనలో ఒకటి 'అమానతులను అప్పచెప్పడం'అల్లాహ్ తాలా సెలవిచ్చాడు :-

{పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు.}

[నిసా :58]

ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _"పవిత్రత"_ మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

{ముగ్గురి సహాయం అల్లాహ్ నుండి పూర్తిచేయబడుతుంది:- అందులో ఒకటి ప్రస్తావించబడింది : పవిత్రంగా ఉండటానికి వివాహం చేసుకునువాడు}

సునన్ తిర్మిజీ 1655

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి దుఆ లోనిది.ఆయన ఇలా దుఆ చేసేవారు:-

{"అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా,వత్తుఖా,వల్ అఫాఫ,వల్ ఘినా"ఓ అల్లాహ్ నిశ్చయంగా నిన్ను నేను మార్గదర్శనాన్ని,దైవభీతిని,రక్షణని మరియు,కలిమిని (సంతృప్తిని)అర్ధిస్తున్నాను}

సహీహ్ ముస్లిం 2721

ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి _బిడియం/సిగ్గు.'మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

{సిగ్గు,బిడియం మేలును మాత్రమే ప్రసాదిస్తుంది}

సహీహ్ బుఖారి 6117

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-

{ప్రతీ ధర్మానికి ఒక ప్రత్యేకమైన గొప్పసత్ప్రవర్తన ఉంటుంది,ఇస్లాం లో ఉన్నగొప్ప సత్ప్రవర్తన అల్ హయా -బిడియం సిగ్గు.

అల్ బైహఖీ షోబల్ ఈమాన్'లో ఉల్లేఖించారు 6/2619

ఇస్లాం ఆదేశించే ప్రశంసనీయ సత్ప్రవర్తనలలో ఒకటి ' ధైర్యం'అనస్' రదియల్లాహుఅన్హు చెప్పారు:-

{ప్రజల్లో అత్యంతసుందరుడు,అతి ధైర్యవంతుడు,దానవంతుడు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం!,ఒకసారి మదీనా వాసులు(నగరం అవతల భయంకర శబ్దాలకు)భయబ్రాంతులకు గురయ్యారు,అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గుర్రం తీసుకుని ఒంటరిగా అటువైపు మొదట బయల్దేరివెళ్లారు}

సహీహ్ బుఖారి 2820

మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్'పిరికితనం నుండి ఎక్కువగా అల్లాహ్ యొక్క శరణు వేడుకునేవారు:ఇలా దుఆ చేసేవారు :

ఓ అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.(అల్లాహుమ్మఇన్నీఅవూజూబిక మినల్' జుబ్'ని).

సహీహ్ బుఖారి 6374

ఇస్లాం ఆదేశిస్తున్న సత్ప్రవర్తనలో ఒకటి 'ఔదార్యం,దయజాలిచూపడం'అల్లాహ్ తాలా సెలవిచ్చాడు :-

{అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనం వలే ఉంటుంది, దేని నుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.}

[అల్ బఖర:261]

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క ఒక సుగుణం దయాజాలి గుణం'-ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం తెలియజేశారు:-

{మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజల్లో అత్యుత్తమ దాతృత్వంగలవారు,రమదాను మాసంలో జీబ్రీల్'ను కలిసిన తరువాత ఆయన దాతృత్వమనేది రెట్టింపు అవుతుంది,జీబ్రీల్ అలైహిస్సలమ్ రమదానులో ప్రతీ రాత్రి ప్రవక్తను కలిసేవారు అలా ఆ మాసం గడిచిపోయేది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీబ్రీల్'కు ఖుర్ఆను పూర్తిగా వినిపించేవారు,జీబ్రీల్ అలైహిస్సలాం ఆయనను(స)కలిసిన తరువాత మంచిలో ఔదార్యంలో వీచే గాలికంటే అధికంగా దాతృవృద్ది జరిగేది}

సహీహ్ బుఖారి 1902

ఇస్లాం ఆదేశించే మరికొన్ని సద్గుణాలలోఒకటి 'నిరుపేదలకు సహాయం చేయడం,బలహీనులకు ఉపశమనం కలిగించడం,ఆకలిగొన్నవాళ్లకు అన్నంపెట్టడం,పొరుగువారితో ఉత్తమంగా మెలగడం,బంధుత్వాన్ని కలపడం,జంతువుల పట్ల దయచూపడం మొదలైనవి.

అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం;నిశ్చయంగా ఒక వ్యక్తి మహనీయ దైవప్రవక్తను ప్రశ్నిస్తూ 'మేలైన ఇస్లాం ఏమిటి? అని అడిగాడు ఆయన సమాధానమిస్తూ'అన్నదానం చేయడం, సుపరిచితులకి,అపరిచితులకి సలాం చేయడం అని'చెప్పారు.

సహీహ్ బుఖారి 12

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{{ఒకమారు ఒకబాటసారి మార్గం గుండా వెళ్లసాగాడు,అతనికి తీవ్రంగా దప్పికవేసింది,దగ్గర్లో ఒక బావి కనపడింది,అందులో దిగి నీటితో దప్పిక తీర్చుకుని బయటికి వచ్చాడు,పిదప అక్కడ ఒక కుక్క దప్పిక వల్ల నేలను నాకటాన్ని గమనించాడు,అప్పుడతను 'ఈ కుక్క'కు కూడా నాలాగే తీవ్రదప్పిక కలిగినట్లు ఉంది' అనుకున్నాడు'ఆపై మళ్ళీ బావిలోకి దిగి తన మేజోళ్లలో నీటిని నింపి దాని నోటివద్ద పెట్టాడు,ఆ కుక్క నీటిని త్రాగింది,ఆపై అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపుకున్నాడు,ఈ కారణంగా అతను ప్రక్షాళితుడయ్యాడు}సహచరులు అడిగారు:-'ఓ దైవప్రవక్త! మా ఈ పశువుల ద్వారా మాకు పుణ్యం లభిస్తుందా?ప్రవక్త చెప్పారు:- {అవును,తేమను కలిగిన ప్రతీ కాలేయంలో పుణ్యం ఉంది}}

సహీహ్ ఇబ్ను హిబ్బాన్ 544.

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{వితంతువుల మరియు అనాధాల బాగోగుల నిమిత్తం పరితపిస్తూ కృషిచేసేవాడు ధర్మపోరాటంలో పాల్గున్న ఒక ముజాహిదు'లాంటివాడు,రాత్రిభవళ్లు తహజ్జుద్'నమాజులను,ఉపవాసాలను స్థాపించేవ్యక్తి కి సమానం.}

సహీహ్ బుఖారి 5353

మరియు ఇస్లాం రక్తసంబంధీకుల హక్కులను దృఢపరుస్తుంది అంతేకాదు వారి పట్ల బంధుత్వాన్నికొనసాగించడం తప్పనిసరిచేస్తుంది. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:-

{దైవప్రవక్త విశ్వాసులకు (ముస్లింలకు),తమ ప్రాణాలకంటే కూడా ముఖ్యుడు.మరియు ఆయన భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు -ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.}

[అల్ అహ్'జాబ్ :6 ]

భూమిపై అవినీతితో బంధుత్వ సంబంధాలను తెంచుకోవద్దని హెచ్చరించింది, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అన్నాడు:-

{(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"}

ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు.

ముహమ్మద్:22-23

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ బోధించారు :- {రక్తసంభంధాలను తెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించడు}

సహీహ్ ముస్లిం (2556)

బంధుత్వాన్ని విధిగా పాఠించవలసిన రక్తసంబంధీకులు వీరు :- తల్లిదండ్రులు,అన్నాతమ్ముళ్ళు,అక్కాచెల్లెళ్ళు,మేనమామలు,మేనత్తలు,పెద్దమ్మ,చిన్నమ్మలు,పెద్దనాన్న బాబాయి తదితరులు.

ఇస్లాం అవిశ్వాసి అయినా పొరుగువారి హక్కులను ధృవీకరిస్తుంది,సర్వశక్తిమంతుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

{మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు.}

{నిసా :36}

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

జీబ్రీల్ అలైహిస్సలాం నాకు పొరుగువాని గురించి పలుమార్లు ఉపదేశించారు నేను చివరికి 'ఆస్తిలో వారికి కూడా వారసత్వం'కల్గుతుందేమోనని సందేహపడ్డాను.

సహీ అబూదావూద్ 5152

ఇస్లాం స్వచ్చమైన,శుద్దమైన తిను త్రాగు పదార్ధాలను హలాలు చేసింది,మరియు హృదయాలను,శరీరాన్ని,ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోమని ఆదేశించింది,అలాగే నికాహ్ ను కూడా,దైవప్రవక్తలు ఆదేశించినట్లు హలాలు చేసింది,వారు ప్రతీ స్వచ్చమైనదాన్ని ఆజ్ఞాపించారు.

ఇస్లాం ప్రతీ స్వచ్చమైన తిను,త్రాగు పదార్ధాలను హలాలుచేసింది-దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివ సల్లమ్ సెలవిచ్చారు:-{ఓ ప్రజలారా !నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్దుడు కేవలం పరిశుద్దవస్తువులను మాత్రమే ఆమోదిస్తాడు,అల్లాహ్ ముస్లిములను ప్రవక్తలను ఆదేశించిన మాదిరిగా ఆదేశించాడు,అల్లాహ్ సెలవిచ్చాడు {“నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్దుడు శుద్దమైనవి మాత్రమే ఆమోదిస్తాడు,నిస్సంకోచంగా అల్లాహ్ ముమినీన్ విశ్వాసులకు తన ప్రవక్తలకు మాదిరిగా{“ఓ సందేశహరులారా! శుద్ద మైన పదార్ధాలు మాత్రమే బుజించండి,సత్కార్యాలు చేయండి నిశ్చయంగా మీరు చేస్తున్న కార్యాల గురించి నాకు తెలుసు(ముమినూన్:51) {ఓ విశ్వసించిన ప్రజలారా! నేను మీకు ప్రసాదించిన శుద్దమైన పదార్ధాలను తినండి,(బఖర -172)"}అని ఆదేశించాడు ఒకవ్యక్తి గురించి ప్రస్తావిస్తూ అతను సుదీర్గప్రయాణం చేస్తాడు దుమ్ము ధూళితోనిండిఉంటాడు ,అతను తన చేతులు లేపి దుఆ చేస్తూ ఓ నా ప్రభువా ఓ నా ప్రభువా అంటాడు చూస్తే అతని బోజనము హరాము అతని పానీయం హరాము,అతని దుస్తులు హరాము అతని ఉపాది హరాము,ఎలా అతని దుఆ స్వీకరించబడుతుంది?"}.సహీహ్ ముస్లిం 1015మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{ఇలా చెప్పు:"అల్లాహ్ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?" (ఇంకా) ఇలా అను: "ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము."}[అల్ ఆరాఫ్:32]ఇస్లాం హృదయాలను,శరీరాన్ని,ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోమని ఆదేశించింది,అలాగే నికాహ్ ను కూడా,దైవప్రవక్తలు ఆదేశించినట్లు హలాలు చేసింది,వారు ప్రతీ స్వచ్చమైనదాన్ని ఆజ్ఞాపించారు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?}[అన్ నహ్ల్ :72]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు నీ దుస్తులను నువ్వు శుభ్రపర్చుకో}మరియు అశుద్దతను నీవు తొలగించుకో }[అల్ ముద్దస్సిర్ :4,5]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{ఎవరి మనసులో అనువంత గర్వం ఉన్నాఅతను స్వర్గంలో ప్రవేశించలేడు,అప్పుడు ఒకవ్యక్తి ఇలా అడిగాడు:{ప్రతీ వ్యక్తి తన దుస్తులు,పాదరక్షకాలను అందంగా ధరించడాన్ని ఇష్టపడతాడు కదా! ప్రవక్త జవాబిచ్చారు-{నిశ్చయంగా అల్లాహ్ అత్యంత సుందరుడు,అందాన్ని ప్రేమిస్తాడు,-కిబ్రూ' అనగా- సత్యాన్ని త్యజించడం ప్రజలను హీనులుగా భావించడం.}సహీహ్ ముస్లిం (91)

{ఓ ప్రజలారా !నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్దుడు కేవలం పరిశుద్దవస్తువులను మాత్రమే ఆమోదిస్తాడు,అల్లాహ్ ముస్లిములను ప్రవక్తలను ఆదేశించిన మాదిరిగా ఆదేశించాడు,అల్లాహ్ సెలవిచ్చాడు {“నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్దుడు శుద్దమైనవి మాత్రమే ఆమోదిస్తాడు,నిస్సంకోచంగా అల్లాహ్ ముమినీన్ విశ్వాసులకు తన ప్రవక్తలకు మాదిరిగా{“ఓ సందేశహరులారా! శుద్ద మైన పదార్ధాలు మాత్రమే బుజించండి,సత్కార్యాలు చేయండి నిశ్చయంగా మీరు చేస్తున్న కార్యాల గురించి నాకు తెలుసు(ముమినూన్:51) {ఓ విశ్వసించిన ప్రజలారా! నేను మీకు ప్రసాదించిన శుద్దమైన పదార్ధాలను తినండి,(బఖర -172)"}అని ఆదేశించాడు ఒకవ్యక్తి గురించి ప్రస్తావిస్తూ అతను సుదీర్గప్రయాణం చేస్తాడు దుమ్ము ధూళితోనిండిఉంటాడు ,అతను తన చేతులు లేపి దుఆ చేస్తూ ఓ నా ప్రభువా ఓ నా ప్రభువా అంటాడు చూస్తే అతని బోజనము హరాము అతని పానీయం హరాము,అతని దుస్తులు హరాము అతని ఉపాది హరాము,ఎలా అతని దుఆ స్వీకరించబడుతుంది?"}.

సహీహ్ ముస్లిం 1015

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{ఇలా చెప్పు:"అల్లాహ్ తన దాసుల కొరకు సృష్టించిన వస్త్రాలంకరణను మరియు మంచి జీవనోపాధిని నిషేధించేవాడెవడు?" (ఇంకా) ఇలా అను: "ఇవి ఇహలోక జీవితంలో విశ్వాసుల కొరకే; పునరుత్థాన దినమున ప్రత్యేకంగా వారి కొరకు మాత్రమే గలవు. ఈ విధంగా మేము మా సూచనలను జ్ఞానం గల వారికి స్పష్టంగా వివరిస్తున్నాము."}

[అల్ ఆరాఫ్:32]

ఇస్లాం హృదయాలను,శరీరాన్ని,ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోమని ఆదేశించింది,అలాగే నికాహ్ ను కూడా,దైవప్రవక్తలు ఆదేశించినట్లు హలాలు చేసింది,వారు ప్రతీ స్వచ్చమైనదాన్ని ఆజ్ఞాపించారు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

{మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?}

[అన్ నహ్ల్ :72]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు నీ దుస్తులను నువ్వు శుభ్రపర్చుకో}

మరియు అశుద్దతను నీవు తొలగించుకో }

[అల్ ముద్దస్సిర్ :4,5]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ఎవరి మనసులో అనువంత గర్వం ఉన్నాఅతను స్వర్గంలో ప్రవేశించలేడు,అప్పుడు ఒకవ్యక్తి ఇలా అడిగాడు:{ప్రతీ వ్యక్తి తన దుస్తులు,పాదరక్షకాలను అందంగా ధరించడాన్ని ఇష్టపడతాడు కదా! ప్రవక్త జవాబిచ్చారు-{నిశ్చయంగా అల్లాహ్ అత్యంత సుందరుడు,అందాన్ని ప్రేమిస్తాడు,-కిబ్రూ' అనగా- సత్యాన్ని త్యజించడం ప్రజలను హీనులుగా భావించడం.}

సహీహ్ ముస్లిం (91)

మరియు ఇస్లాం నిషిద్ద మూలాలను నిషేధించింది,ఉదాహరణకు :-షిర్కు బిల్లాహ్,కుఫ్రు బిల్లాహ్,విగ్రహారాధన,దైవం గురించి అజ్ఞానప్రేలాపనలు,సంతానాన్ని హతమార్చడం,పవిత్ర ప్రాణాన్ని చంపడం,భూమిలో అల్లకల్లోలం రేకెత్తించడం,చేతబడి,గోప్యమైన,స్పష్టమైన హేయకృత్యములు,వ్యబిచారం,స్వలింగ సంపర్కం,మరియు వడ్డీని నిషేధించింది,మృత పదార్థాలను తినడం నిషేధించింది,విగ్రహాలకు,ప్రతిమల కోసం జిబాహ్ చేసినది నిషేధించబడింది,మరియు పంది మాంసం,సర్వమాలిన్యాలు,రాక్షసపనులను నిషేధించింది,అనాధాల సొమ్మును అన్యాయంగా తినడం,తూనికల్లోదండి కొట్టడం,మరియు రక్తసంభంధాన్ని తెంచుకోవడం నిషేధించింది,ఈ నిషిద్దాలపై సమస్త దైవప్రవక్తలు ఏకీభవించారు.

ఇస్లాం నిషిద్దాల మూలాలను సమూలంగా నిషేధించింది ఉదాహరణకు 'అల్లాహ్'తో షిర్కు చేయడం,కుఫ్రు చేయడం,విగ్రహారాధన చేయడం,అల్లాహ్ గురించి అజ్ఞానంతో మాట్లాడటం,సంతానాన్ని చంపడం.{ఇలా అను:రండి మీ ప్రభువు మీపై నిషేదించిన వాటిని మీకు చదివి వినిపిస్తాను : మీరు ఆయనతోపాటు దేనిని సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా ఆహారాన్ని ప్రసాదిస్తాము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని,సత్యబద్ధంగా తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.}{మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే. అల్లాహ్ తో చేసిన ఒప్పందమును పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు.}అల్ అన్'ఆమ్:151-152మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఇలా అను:-"నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు."}[అల్ ఆరాఫ్:33]మరియు ఇస్లాం గౌరవనీయమైన ప్రాణాన్నిచంపడాన్నినిషేధిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నాడు:-{న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.}[అల్ ఇస్రా:33]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.}{అల్ ఫుర్ఖాన్:68}భూమిలో అల్లకల్లోలం సృష్టించడాన్ని ఇస్లాం నిషేదించింది.-అల్లాహ్ సెలవిచ్చాడు:-{సంస్కరించబడిన తరువాత భూమిలో మీరు ఉపద్రవాన్ని రేకెత్తించకండి}[అల్ ఆరాఫ్:56]షు'అయిబ్ అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు :అతను తన జాతీప్రజలతో ఇలా చెప్పాడు:-{మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది.}[అల్-ఆరాఫ్ :85]ఇస్లాం మంత్రజాలాన్ని/చేతబడిని నిషేధించింది.{నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మంత్రజాలకుని తంత్రమే! మరియు మంత్రజాలకుడు ఎన్నడూ సఫలుడు కాలేడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!.}{తాహా:69}రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{'వినాశకరమైన ఏడు పాపాలనుండి మిమ్మల్ని రక్షించుకోండి,సహాబాలు ఓ దైవప్రవక్త అవి ఏమిటి?అని అడిగారు,ప్రవక్త బదులిస్తూ"షిర్కుబిల్లాహ్(అల్లాహ్'కుఇతరులను భాగస్వామ్య పర్చటం)2.చేతబడి 3.అకారణంగా అల్లాహ్ నిషేదించిన ప్రాణి ని హతమార్చటం4.వడ్డీ తినడం 5.అనాదల సొమ్మును అన్యాయంగా తినటం6.యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవటం 7,అభాగ్యురాలైన,అమాయకులైన మహిళలపై అపనిందలు మోపటం" అని తెలియజేశారు}సహీహ్ బుఖారి 6857మరియు ఇస్లాం అంతర్గత,బాహ్యపరమైన అనైతికతను,వ్యభిచారం,స్వలింగ సంపర్కం నిషేధించింది, మరియు ఈ పేరా ప్రారంభంలో దానిని సూచించే ఆయతులను పేర్కొన్నారు మరియు ఇస్లాం వడ్డీని నిషేధించింది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.{కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరుపు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీ వదులుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.(279)}[అల్ బఖర :278-279 ]అల్లాహ్'వడ్డీ పాపిని హెచ్చరించినట్లుగా యుద్దపాపిని కూడా అలా హెచ్చరించలేదు,ఎందుకంటే వడ్డీలో ధర్మాలు,దేశాలు,డబ్బు మరియు ప్రాణాలు వినాశనం జరుగుతుంది.మరియు ఇస్లాం మృతువులను తినడాన్ని,విగ్రహాలకు,ప్రతిమల కొరకు జిబాహ్ చేయబడినది,మరియు పంది మాంసాన్ని నిషేధించింది. అల్లాహ్ సెలవిచ్చాడు:-మీ కొరకు ఇవి నిషేధించబడినవి:మృత పశువు,రక్తం,పంది మాంసం,అల్లాహ్ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది,గొంతు పిసకబడటంవల్ల చచ్చిన పశువు,దెబ్బ తగిలి చనిపోయిన పశువు,ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ముతగలటం వల్ల చచ్చిపోయినది,క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చని పోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్ గావించబడ్డాయి).కాని మీరు ఒకవేళ'జిబహ్' చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు.అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్నిపరీక్షించు కోవటం కూడా నిషిద్ధమే.ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు}{అల్ మాయిదా:3}ఇస్లాం మద్యపానాన్ని,మలినాలను మరియు సమస్త చెడులను నిషేధించింది.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరు ఇప్పుడైనా మానుకోరా?}(91)[అల్ మాయిదా:90-91]ఇది ఇంతకుముందు 31 వ పేరా లో ప్రస్తావించబడింది,అందులో అల్లాహ్ తఆలా 'దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి సుగుణాలు తౌరాతు గ్రంధంలో ఉన్నాయని,అది అతను వారిపై హేయవిషయాలను హరాము చేస్తాడు'అని తెలిపాడు.{"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."}[అల్ ఆరాఫ్:157]మరియు ఇస్లాం అనాధల డబ్బును అన్యాయంగా తినడాన్నినిషేధిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నాడు:-{మరియు అనాధుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తిని వేయకండి. నిశ్చయంగా, ఇది గొప్పనేరం (పాపం)}.{నిసా :2}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{నిశ్చయంగా, అన్యాయంగా అనాధుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.}నిసా :10మరియు ఇస్లాం కొలతలలో తూనికల్లో (దండికొట్టడాన్ని)మోసంచేయడాన్ని నిషేధించింది.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశముంది}(1)వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.(2)మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.(3)ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?(4){అల్ ముతఫ్ఫిఫీన్ 1-4}

{ఇలా అను:రండి మీ ప్రభువు మీపై నిషేదించిన వాటిని మీకు చదివి వినిపిస్తాను : మీరు ఆయనతోపాటు దేనిని సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా ఆహారాన్ని ప్రసాదిస్తాము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని,సత్యబద్ధంగా తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.}

{మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే. అల్లాహ్ తో చేసిన ఒప్పందమును పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు.}

అల్ అన్'ఆమ్:151-152

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఇలా అను:-"నా ప్రభువు బహిరంగంగా గానీ, లేదా రహస్యంగా గానీ, అశ్లీల (అసహ్యకరమైన) కార్యాలను, పాపకార్యాలను చేయటాన్ని మరియు దౌర్జన్యం చేయటాన్ని మరియు ఆయన (అల్లాహ్) అవతరింపజేసిన ప్రమాణం ఏదీ లేనిదే ఇతరులను అల్లాహ్ కు సాటి (భాగస్వాములుగా) కల్పించటాన్ని మరియు మీకు జ్ఞానం లేనిదే ఏ విషయాన్ని అయినా అల్లాహ్ పై మోపటాన్ని నిషేధించి వున్నాడు."}

[అల్ ఆరాఫ్:33]

మరియు ఇస్లాం గౌరవనీయమైన ప్రాణాన్నిచంపడాన్నినిషేధిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నాడు:-

{న్యాయానికి తప్ప, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో, మేము అతని వారసునికి (ప్రతీకార) హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య (ప్రతీకార) విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా, అతనికి (ధర్మప్రకారం) సహాయ మొసంగబడుతుంది.}

[అల్ ఇస్రా:33]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.}

{అల్ ఫుర్ఖాన్:68}

భూమిలో అల్లకల్లోలం సృష్టించడాన్ని ఇస్లాం నిషేదించింది.-అల్లాహ్ సెలవిచ్చాడు:-

{సంస్కరించబడిన తరువాత భూమిలో మీరు ఉపద్రవాన్ని రేకెత్తించకండి}

[అల్ ఆరాఫ్:56]

షు'అయిబ్ అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు :అతను తన జాతీప్రజలతో ఇలా చెప్పాడు:-

{మరియు మేము మద్ యన్ జాతి వారి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము). అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చి వున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై సంస్కరణ జరిగిన తరువాత కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది.}

[అల్-ఆరాఫ్ :85]

ఇస్లాం మంత్రజాలాన్ని/చేతబడిని నిషేధించింది.

{నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మంత్రజాలకుని తంత్రమే! మరియు మంత్రజాలకుడు ఎన్నడూ సఫలుడు కాలేడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!.}

{తాహా:69}

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{'వినాశకరమైన ఏడు పాపాలనుండి మిమ్మల్ని రక్షించుకోండి,సహాబాలు ఓ దైవప్రవక్త అవి ఏమిటి?అని అడిగారు,ప్రవక్త బదులిస్తూ"షిర్కుబిల్లాహ్(అల్లాహ్'కుఇతరులను భాగస్వామ్య పర్చటం)2.చేతబడి 3.అకారణంగా అల్లాహ్ నిషేదించిన ప్రాణి ని హతమార్చటం4.వడ్డీ తినడం 5.అనాదల సొమ్మును అన్యాయంగా తినటం6.యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవటం 7,అభాగ్యురాలైన,అమాయకులైన మహిళలపై అపనిందలు మోపటం" అని తెలియజేశారు}

సహీహ్ బుఖారి 6857

మరియు ఇస్లాం అంతర్గత,బాహ్యపరమైన అనైతికతను,వ్యభిచారం,స్వలింగ సంపర్కం నిషేధించింది, మరియు ఈ పేరా ప్రారంభంలో దానిని సూచించే ఆయతులను పేర్కొన్నారు మరియు ఇస్లాం వడ్డీని నిషేధించింది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.

{కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరుపు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీ వదులుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.(279)}

[అల్ బఖర :278-279 ]

అల్లాహ్'వడ్డీ పాపిని హెచ్చరించినట్లుగా యుద్దపాపిని కూడా అలా హెచ్చరించలేదు,ఎందుకంటే వడ్డీలో ధర్మాలు,దేశాలు,డబ్బు మరియు ప్రాణాలు వినాశనం జరుగుతుంది.

మరియు ఇస్లాం మృతువులను తినడాన్ని,విగ్రహాలకు,ప్రతిమల కొరకు జిబాహ్ చేయబడినది,మరియు పంది మాంసాన్ని నిషేధించింది. అల్లాహ్ సెలవిచ్చాడు:-

మీ కొరకు ఇవి నిషేధించబడినవి:మృత పశువు,రక్తం,పంది మాంసం,అల్లాహ్ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది,గొంతు పిసకబడటంవల్ల చచ్చిన పశువు,దెబ్బ తగిలి చనిపోయిన పశువు,ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ముతగలటం వల్ల చచ్చిపోయినది,క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చని పోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్ గావించబడ్డాయి).కాని మీరు ఒకవేళ'జిబహ్' చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు.అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్నిపరీక్షించు కోవటం కూడా నిషిద్ధమే.ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు}

{అల్ మాయిదా:3}

ఇస్లాం మద్యపానాన్ని,మలినాలను మరియు సమస్త చెడులను నిషేధించింది.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.

నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరు ఇప్పుడైనా మానుకోరా?}(91)

[అల్ మాయిదా:90-91]

ఇది ఇంతకుముందు 31 వ పేరా లో ప్రస్తావించబడింది,అందులో అల్లాహ్ తఆలా 'దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారి సుగుణాలు తౌరాతు గ్రంధంలో ఉన్నాయని,అది అతను వారిపై హేయవిషయాలను హరాము చేస్తాడు'అని తెలిపాడు.

{"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు."}

[అల్ ఆరాఫ్:157]

మరియు ఇస్లాం అనాధల డబ్బును అన్యాయంగా తినడాన్నినిషేధిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నాడు:-

{మరియు అనాధుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తిని వేయకండి. నిశ్చయంగా, ఇది గొప్పనేరం (పాపం)}.

{నిసా :2}

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{నిశ్చయంగా, అన్యాయంగా అనాధుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.}

నిసా :10

మరియు ఇస్లాం కొలతలలో తూనికల్లో (దండికొట్టడాన్ని)మోసంచేయడాన్ని నిషేధించింది.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

{కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశముంది}(1)

వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.(2)

మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.(3)

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?(4)

{అల్ ముతఫ్ఫిఫీన్ 1-4}

ఇస్లాం రక్తసంభంధం తెంచుకోవడాన్ని నిషేధించింది,ఈ విషయం రుజువు పరిచే ఆయతులు,ఆహాదీసులు ఇంతకుముందు 31'వ పేరాలో గడిచాయి అవి దైవప్రవక్తలు ఈ నిషేధాలను హరాముగా ఏకీభవించారు'అని సూచిస్తున్నాయి.

ఇస్లాం:చెడు అనైతికతను వారిస్తుంది,అవి:అసత్యం,మోసం,ద్రోహం,అమానతులో ద్రోహం,అసూయ,చెడు పన్నాగం,దొంగతనం,దౌర్జన్యం,పీడ మరియు ప్రతీ అసహ్య పని నుండి ఆపుతుంది.

అల్ ఇస్లాం చెడు అనైతికతను సాధారణంగా ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{"మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు".}[లుఖ్మాన్:18]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హుమా మర్ఫూ ఉల్లేఖనం ;నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే 'ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే' మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే 'ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన'అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త 'గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారుసిల్'సిలతు సహీహా 791అల్-ఇస్లాం;- అసత్యం నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!"}[అల్ గాఫిర్:28]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{మీరు అసత్యానికి దూరంగా ఉండండి,ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది,ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి గురిచేస్తుంది,ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు,ఆ అబద్దాన్ని విధిచేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది'అని లిఖించబడుతుంది}సహీహ్ ముస్లిం (2607)రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-{మునాఫిఖుడికి మూడు సంకేతాలున్నాయి:-మాట్లాడినప్పుడు అసత్య మాడుతాడు,ప్రమాణంచేసితప్పుతాడు,అమానతుపెడితేద్రోహం చేస్తాడు.}సహీహ్ బుఖారి 6095ఇస్లాం 'మోసాన్ని"నిషేధిస్తుంది.ఒక హదీసులో ఇలా వచ్చింది :-మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఒకసారి దాన్యపు నిల్వల గుండా వెళ్లారు అప్పుడు తన చేతిని అందులో జొప్పించారు అప్పుడు ఆయన వేళ్ళకు తడితేమ తగిలింది,వెంటనే ఇలా {ఇది ఏమిటి?ఓ ధాన్యాల వ్యాపారి?}అని అడిగారు,అతను 'వర్షంలో తడిసింది ఓ ప్రవక్త! అని చెప్పాడు,ప్రవక్త 'మరి అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని మీద ఎందుకు పెట్టలేదు,ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా'?మోసం చేసేవాడు మనలోని వాడు కాదు'అని చెప్పారు.సహీహ్ ముస్లిం (102)ఇస్లాం ద్రోహం,నమ్మకద్రోహం మరియు మోసాన్ని నిషేధిస్తుంది.అల్లాహ్ సెలవిచ్చాడు :-{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి.}[అల్-అన్'ఫాల్:27 ]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{వారు'అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారు మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరు![రాద్ :20]మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ'సైన్యాన్ని పంపేముందు ఇలా ఉపదేశించేవారు{దైవపోరాటంచేయండి,మితిమీరకండి,ద్రోహంచేయకండి,మృతులఅవయవాలు కోయకండి,పిల్లలను చంపకండి'}సహీహ్ ముస్లిం 1731మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు:{నాలుగు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో అతను నికార్సయిన కపటమునాఫిక్ అవుతాడు,ఆ గుణాలలోఏ ఒక్కటి ఉన్న దాన్ని త్యజించేవరకు అతనిలో నిఫాక్ గుణం ఉన్నట్లే అవి:-అమానతులు పెడితే మోసంచేస్తాడు,మాట్లాడితే అబద్దంచెప్తాడు,ప్రమాణం చేస్తే తప్పుతాడు,గొడవపడినప్పుడు (బూతులు)దూషణకుదిగుతాడు'}సహీహ్ బుఖారి 34అల్-ఇస్లాం;- అసూయ నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.}{నిసా :54}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు}[అల్ బఖర :109]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{మీలో గతజాతులకు చెందిన ఒక రోగం చొరబడింది: అసూయ మరియు ద్వేషాలు,ఇది గొరుగుతుంది,నేను తలవెంట్రుకలు గొరగడం గురించి మాట్లాడటంలేదు'కానీ ధర్మాన్ని గొరగడం గూర్చి మాట్లాడుతున్నాను,ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! మీరు విశ్వసించనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు,పరస్పరం ప్రేమించుకోనంత వరకు విశ్వసించలేరు,నేను మీ పరస్పరం ప్రేమ జనించే ఒక విషయం గురించి తెలియజేయాలా?సలామును పరస్పరం వ్యాపింప జేయండి!}సునన్ తిర్మిజీ 2510అల్-ఇస్లాం;ఇస్లాం ద్రోహాన్నినిరోదిస్తుంది! అల్లాహ్ సెలవిచ్చాడు!{మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు.}[అల్ అన్'ఆమ్:123]అల్లాహ్ తెలియజేశాడు 'నిశ్చయంగా యూదులు ఈసా మసీహ్ అలైహిస్సలాం ను హత్యచేయడానికి ప్రయత్నించారు,మరియు ఒక చెడు ప్రణాళికను రచించారు,కానీ అల్లాహ్ వారి కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు,అల్లాహ్ సెలవిచ్చాడు 'చెడు ప్రణాళికలు రచించేవారే దానికి గురయ్యారు . అల్లాహ్ సెలవిచ్చాడు.{ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.}"ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!"(53)మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!(54)(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.[ఆలే ఇమ్రాన్:52-55]అల్లాహ్ తాలా తెలియపర్చాడు-సాలెహ్ అలైహిస్సలాం జాతీప్రజలు ఆయనను చంపడానికి సంకల్పించారు అందరూ ఒక ప్రణాళిక ఏర్పాటుచేశారు అల్లాహ్ వారికోసం ప్రణాళిక సిద్దం చేశాడు'మరియు ఆ జాతీప్రజలందరిని వేర్లతో పెకిలించి సర్వనాశనం చేశాడు'-అల్లాహ్ సెలవిచ్చాడు:-{వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము.తరువాత అతని వారసులతో:'మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.' "అని అందాము.}49మరియు ఈ విధంగా, వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము. కాని వారికది తెలియదు.(50)ఇక చూడండి! వారి పన్నాగపు పర్యవసానం ఏమయిందో! వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము.(51)[అన్ నమ్ల్: 49-51 ]ఇస్లాం దొంగతనాన్ని నిషేదిస్తుంది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు.తౌబా స్వీకరించబడుతుంది ఆ తరువాత.}సహీహ్ బుఖారి 6810అల్-ఇస్లాం;- దురాక్రమణ నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.}[నహ్ల్ :90]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ వాణీ పంపాడు : మీరు వినమ్రతను కలిగి ఉండండి ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దుమీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వించవద్దు}సహీ అబూదావూద్ 4895అల్-ఇస్లాం;- దౌర్జన్యం,పీడ' నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.[ఆలే ఇమ్రాన్:57]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.[అల్ అన్'ఆమ్:21 ]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు[అల్ ఇన్సాన్ :31]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{ముగ్గురి దుఆ'లు తిరస్కరించబడవు :- న్యాయశీలుడైన నాయకుడు,ఉపవాసకుడు ఇఫ్తార్ చేసెంతవరకు,పీడితుడి దుఆను'ఆకాశంలోకి ఎత్తుకుంటాడు,ఆకాశద్వారాలు తెరుచుకుంటాయి మరియు సర్వశక్తిమంతుడైన ప్రభువు చెప్తాడు:- 'నా గౌరవం సాక్షిగా నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను,అది కొంచెం ఆలస్యం అయినా సరే!}దీనిని ముస్లిం (2749')కొద్దిగా తేడాతో,స్వల్ప వ్యత్యాసాలతో అల్-తిర్మిధి (2526'). ఉల్లేఖించారు మరియు అహ్మద్ (8043')వల్లఫ్'జూ లహూ'.మరియు దైవప్రవక్త ము'ఆజ్'ని[రదియల్లాహు అన్హు] ఇస్లాం వ్యాప్తి కై దాయీగా యమన్'కు పంపినప్పుడు అతనికి ఇలా ఉపదేశించారు:-{పీడితుడి దుఆ'కు భయపడండి,ఎందుకంటే అతనికి మరియు అల్లాహ్'కు మధ్య ఎటువంటి తెరలేదు.}సహీహ్ అల్ బుఖారి 1496రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{తస్మాత్! జాగ్రత్త ఎవరైతే ఒప్పందంలో ఉన్న వ్యక్తిని దౌర్జన్యంతో పీడించిన,అతని హక్కు అన్యాయంగా కొల్లగొట్టిన,లేదా అతని పై శక్తికి మించి భారం మోపినా'లేదా అతని ఇష్టంలేకుండా అతని వస్తువులను లాక్కున్నా రేపు ప్రళయదినం రోజున నేను ఆతనివైపు న్యాయవాదిగా ఉంటాను}సునన్ అబీ దావూద్ 3052ఇస్లాం మీరు చూసినట్లుగా ప్రతీ హేయమైన అనైతికతను లేదా దౌర్జన్య వ్యవహారం లేదా దుర్మార్గాన్ని నిషేదిస్తుంది.

{"మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు".}

[లుఖ్మాన్:18]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-

జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హుమా మర్ఫూ ఉల్లేఖనం ;నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే 'ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే' మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే 'ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన'అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త 'గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు

సిల్'సిలతు సహీహా 791

అల్-ఇస్లాం;- అసత్యం నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-

{నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!"}

[అల్ గాఫిర్:28]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-

{మీరు అసత్యానికి దూరంగా ఉండండి,ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది,ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి గురిచేస్తుంది,ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు,ఆ అబద్దాన్ని విధిచేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది'అని లిఖించబడుతుంది}

సహీహ్ ముస్లిం (2607)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:-

{మునాఫిఖుడికి మూడు సంకేతాలున్నాయి:-మాట్లాడినప్పుడు అసత్య మాడుతాడు,ప్రమాణంచేసితప్పుతాడు,అమానతుపెడితేద్రోహం చేస్తాడు.}

సహీహ్ బుఖారి 6095

ఇస్లాం 'మోసాన్ని"నిషేధిస్తుంది.

ఒక హదీసులో ఇలా వచ్చింది :-మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఒకసారి దాన్యపు నిల్వల గుండా వెళ్లారు అప్పుడు తన చేతిని అందులో జొప్పించారు అప్పుడు ఆయన వేళ్ళకు తడితేమ తగిలింది,వెంటనే ఇలా {ఇది ఏమిటి?ఓ ధాన్యాల వ్యాపారి?}అని అడిగారు,అతను 'వర్షంలో తడిసింది ఓ ప్రవక్త! అని చెప్పాడు,ప్రవక్త 'మరి అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని మీద ఎందుకు పెట్టలేదు,ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా'?మోసం చేసేవాడు మనలోని వాడు కాదు'అని చెప్పారు.

సహీహ్ ముస్లిం (102)

ఇస్లాం ద్రోహం,నమ్మకద్రోహం మరియు మోసాన్ని నిషేధిస్తుంది.అల్లాహ్ సెలవిచ్చాడు :-

{ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి.}

[అల్-అన్'ఫాల్:27 ]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{వారు'అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారు మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరు!

[రాద్ :20]

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ'సైన్యాన్ని పంపేముందు ఇలా ఉపదేశించేవారు

{దైవపోరాటంచేయండి,మితిమీరకండి,ద్రోహంచేయకండి,మృతులఅవయవాలు కోయకండి,పిల్లలను చంపకండి'}

సహీహ్ ముస్లిం 1731

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు:

{నాలుగు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో అతను నికార్సయిన కపటమునాఫిక్ అవుతాడు,ఆ గుణాలలోఏ ఒక్కటి ఉన్న దాన్ని త్యజించేవరకు అతనిలో నిఫాక్ గుణం ఉన్నట్లే అవి:-అమానతులు పెడితే మోసంచేస్తాడు,మాట్లాడితే అబద్దంచెప్తాడు,ప్రమాణం చేస్తే తప్పుతాడు,గొడవపడినప్పుడు (బూతులు)దూషణకుదిగుతాడు'}

సహీహ్ బుఖారి 34

అల్-ఇస్లాం;- అసూయ నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-

{లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.}

{నిసా :54}

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు}

[అల్ బఖర :109]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{మీలో గతజాతులకు చెందిన ఒక రోగం చొరబడింది: అసూయ మరియు ద్వేషాలు,ఇది గొరుగుతుంది,నేను తలవెంట్రుకలు గొరగడం గురించి మాట్లాడటంలేదు'కానీ ధర్మాన్ని గొరగడం గూర్చి మాట్లాడుతున్నాను,ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! మీరు విశ్వసించనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు,పరస్పరం ప్రేమించుకోనంత వరకు విశ్వసించలేరు,నేను మీ పరస్పరం ప్రేమ జనించే ఒక విషయం గురించి తెలియజేయాలా?సలామును పరస్పరం వ్యాపింప జేయండి!}

సునన్ తిర్మిజీ 2510

అల్-ఇస్లాం;ఇస్లాం ద్రోహాన్నినిరోదిస్తుంది! అల్లాహ్ సెలవిచ్చాడు!

{మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు.}

[అల్ అన్'ఆమ్:123]

అల్లాహ్ తెలియజేశాడు 'నిశ్చయంగా యూదులు ఈసా మసీహ్ అలైహిస్సలాం ను హత్యచేయడానికి ప్రయత్నించారు,మరియు ఒక చెడు ప్రణాళికను రచించారు,కానీ అల్లాహ్ వారి కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు,అల్లాహ్ సెలవిచ్చాడు 'చెడు ప్రణాళికలు రచించేవారే దానికి గురయ్యారు . అల్లాహ్ సెలవిచ్చాడు.

{ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.}

"ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!"(53)

మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!(54)

(జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.

[ఆలే ఇమ్రాన్:52-55]

అల్లాహ్ తాలా తెలియపర్చాడు-సాలెహ్ అలైహిస్సలాం జాతీప్రజలు ఆయనను చంపడానికి సంకల్పించారు అందరూ ఒక ప్రణాళిక ఏర్పాటుచేశారు అల్లాహ్ వారికోసం ప్రణాళిక సిద్దం చేశాడు'మరియు ఆ జాతీప్రజలందరిని వేర్లతో పెకిలించి సర్వనాశనం చేశాడు'-అల్లాహ్ సెలవిచ్చాడు:-

{వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము.తరువాత అతని వారసులతో:'మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.' "అని అందాము.}49

మరియు ఈ విధంగా, వారు పన్నాగం పన్నారు మరియు మేము కూడా ఒక పన్నాగం పన్నాము. కాని వారికది తెలియదు.(50)

ఇక చూడండి! వారి పన్నాగపు పర్యవసానం ఏమయిందో! వాస్తవానికి మేము వారిని మరియు వారి వంశం వారినందరినీ సర్వనాశనం చేశాము.(51)

[అన్ నమ్ల్: 49-51 ]

ఇస్లాం దొంగతనాన్ని నిషేదిస్తుంది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

{ఒక వ్యభిచారి వ్యభిచరించేటప్పుడు విశ్వాసి కాజాలడు,దొంగ దొంగిలించేటప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు,మద్యపానసేవకుడు మద్యం త్రాగేటప్పుడు విశ్వాసిగా ఉండడు.తౌబా స్వీకరించబడుతుంది ఆ తరువాత.}

సహీహ్ బుఖారి 6810

అల్-ఇస్లాం;- దురాక్రమణ నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-

{నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.}

[నహ్ల్ :90]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ వాణీ పంపాడు : మీరు వినమ్రతను కలిగి ఉండండి ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దుమీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వించవద్దు}

సహీ అబూదావూద్ 4895

అల్-ఇస్లాం;- దౌర్జన్యం,పీడ' నుండి ఆపుతుంది,అల్లాహ్ సెలవిచ్చాడు:-

అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.

[ఆలే ఇమ్రాన్:57]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.

[అల్ అన్'ఆమ్:21 ]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు

[అల్ ఇన్సాన్ :31]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ముగ్గురి దుఆ'లు తిరస్కరించబడవు :- న్యాయశీలుడైన నాయకుడు,ఉపవాసకుడు ఇఫ్తార్ చేసెంతవరకు,పీడితుడి దుఆను'ఆకాశంలోకి ఎత్తుకుంటాడు,ఆకాశద్వారాలు తెరుచుకుంటాయి మరియు సర్వశక్తిమంతుడైన ప్రభువు చెప్తాడు:- 'నా గౌరవం సాక్షిగా నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను,అది కొంచెం ఆలస్యం అయినా సరే!}

దీనిని ముస్లిం (2749')కొద్దిగా తేడాతో,స్వల్ప వ్యత్యాసాలతో అల్-తిర్మిధి (2526'). ఉల్లేఖించారు మరియు అహ్మద్ (8043')వల్లఫ్'జూ లహూ'.

మరియు దైవప్రవక్త ము'ఆజ్'ని[రదియల్లాహు అన్హు] ఇస్లాం వ్యాప్తి కై దాయీగా యమన్'కు పంపినప్పుడు అతనికి ఇలా ఉపదేశించారు:-

{పీడితుడి దుఆ'కు భయపడండి,ఎందుకంటే అతనికి మరియు అల్లాహ్'కు మధ్య ఎటువంటి తెరలేదు.}

సహీహ్ అల్ బుఖారి 1496

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{తస్మాత్! జాగ్రత్త ఎవరైతే ఒప్పందంలో ఉన్న వ్యక్తిని దౌర్జన్యంతో పీడించిన,అతని హక్కు అన్యాయంగా కొల్లగొట్టిన,లేదా అతని పై శక్తికి మించి భారం మోపినా'లేదా అతని ఇష్టంలేకుండా అతని వస్తువులను లాక్కున్నా రేపు ప్రళయదినం రోజున నేను ఆతనివైపు న్యాయవాదిగా ఉంటాను}

సునన్ అబీ దావూద్ 3052

ఇస్లాం మీరు చూసినట్లుగా ప్రతీ హేయమైన అనైతికతను లేదా దౌర్జన్య వ్యవహారం లేదా దుర్మార్గాన్ని నిషేదిస్తుంది.

ఇస్లాం ఈ క్రింది విషయాలతో కూడిన కొన్ని ఆర్ధిక వ్యవహారాలను నిషేధిస్తుంది:- వడ్డీ,హానీ,వంచన,మోసం,అన్యాయం,ద్రోహం,లేదా రాజ్యాలకు, తెగలకు,వ్యక్తులకు సర్వసాధారణంగా హాని కల్గించేవి ఇత్యాదివి.

ఇస్లాం ఈ క్రింది విషయాలతో కూడిన కొన్ని ఆర్ధిక వ్యవహారాలను నిషేధిస్తుంది:- వడ్డీ,హానీ,వంచన,మోసం,అన్యాయం,ద్రోహం,లేదా రాజ్యాలకు, తెగలకు,వ్యక్తులకు సర్వసాధారణంగా హాని కల్గించేవి ఇత్యాదివి.ఈ పేరా ప్రారంభంలో వడ్డీ,అన్యాయం, మోసం,భూమిలో ఉపద్రవాలు సృష్టించడం లాంటి విషయాలను నిషేధించే ఆయతులు మరియు హదీసులను మేము ప్రస్తావించాము. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-{మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!}[అల్ అహ్'జాబ్:58]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.}[ఫుస్సీలత్:46]మరియు సున్నతులో ఈ విషయం ప్రస్తావన వచ్చింది :- {నిశ్చయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా తీర్పు చేశారు 'హాని కలిగించకూడదు,పరస్పరం హాని కలిగించుకొకూడదు."}సునన్ అబీ దావూద్రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అథితి ని గౌరవించాలి.ఎవరైతే అల్లాహ్'ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన మాటలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి.సహీహ్ ముస్లిం (47)రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{ఒక స్త్రీ' పిల్లి వల్ల శిక్షకు గురయ్యింది,ఆమె దాన్ని ఖైదుచేసింది చివరికి చనిపోయింది,ఆ కారణంగా ఆమె నరకానికి ప్రవేశించింది. ఆమె దాన్ని ఖైదు చేసినప్పుడు దానికి నీరుకాని తిండికాని పెట్టేదికాదు,విడుదల కూడా చేసేది కాదు అలాగైనా నేలపై క్రిమికీటకాలను తినిబ్రతికేది.}సహీహ్ బుఖారి 3482ఇది ఒక పిల్లిని కష్టపెట్టినందుకు జరిగింది మరి ప్రజలను కష్టపెట్టేవాడికి ఎటువంటి గతిపడుతుంది ?ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు కథనం:ఇలా తెలిపారు'దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం మింబర్ పై ఎక్కి హెచ్చుస్వరంతో పిలిచారు;ఇలా భోదించారు :-{ఇస్లాం'ను నోటితో అంగీకరించిన ఓ సముదాయమా! ఈమాను ఇంకా హృదయానికి చేరలేదు! ముస్లింలకు హాని చేయవద్దు, వారిని తిట్టవద్దు, వారి రహస్యాలు బయటపెట్టడానికి వారిపై నిఘా పెట్టకండి.వాస్తవానికి ఎవరైతే తన ముస్లిం సోదరుడి రహస్యాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినా,అల్లాహ్ తన ఇంటి లోతులో ఉన్నప్పటికీ, తన రహస్యాలను విస్తృతంగా బహిర్గతం చేస్తాడు. అతను ఇలా అన్నాడు: ఒక రోజు ఇబ్ను'ఉమర్ అల్ బైత్ - లేదా – కాబా వైపు చూస్తూ ఇలా అన్నాడు:- 'నీకు ఎంతో గౌరవం కలదు,నీ పవిత్రత ఎంతో గౌరవదాయకమైనది!కానీ ఒక ముమిన్' గౌరవం అల్లాహ్ దృష్టిలో నీ కంటే చాలా పవిత్రమైనది'}.తిర్మిజీ ఉల్లేఖనం :(2032) మరియు ఇబ్ను హిబ్బాన్:5763రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అథితి ని గౌరవించాలి.ఎవరైతే అల్లాహ్'ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన విషయాలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి}సహీహ్ బుఖారి 6018అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం“మీకు ముఫ్లిస్(పేదవాడు)అంటే తెలుసా? అని ప్రశ్నించారు,దానికి సహచరులు ముఫ్లిస్ అంటే మాలో(ఎవరివద్ద అయితే)డబ్బులు దిర్హంలు,సంపద లేవో వారిని అంటాము,దానికి ప్రవక్త బదులిస్తూ:నా జాతి యొక్క ముఫ్లిస్ ఎవరు అంటే రేపు ప్రళయదినం రోజున నమాజ్,ఉపవాసాలు,జకాతులు తీసుకుని వస్తాడు కానీ ఒకరిని తిట్టి ఉంటాడు,ఒకరి పై అపనింద వేసి ఉంటాడు,ఒకరి సొమ్ము దోచుకుని ఉంటాడు ఒకరిని హత్య చేసి ఉంటాడు,ఒకరిని అన్యాయంగా కొట్టి ఉంటాడు అయితే అతని పుణ్యాలు బాధింప బడ్డ ప్రజల్లో పంచబడుతాయి అవి అయిపోవడం వలన అతని పుణ్యాలు తక్కువ పడటం వలన బాధింపబడ్డ పాపాలు కూడా ఇతని తలపై వేయబడుతాయి పిదప నరకం లో విసిరివేయబడుతాడు}.ముస్లిం ఉల్లేఖనం :(2581)తిర్మిజీ ఉల్లేఖనం (2418) తన పదాలతో అహ్మద్ ఉల్లేఖనం (8029)రసూలుల్లాహ్ ఇలా ప్రవచించారు:{ఒకమార్గంలో చెట్టుకొమ్మ పడిఉంది అది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది,అప్పుడు ఒక వ్యక్తి దాన్ని మార్గం నుండి తొలగించాడు,దాంతో అతనికి స్వర్గప్రవేశం కలిగింది'}.అల్-బుఖారీ (652') ఈ అర్ధంతో ఉల్లేఖించారు,ముస్లిం (1914')దీనిని పోలినది, ఇబ్ను'మాజా (3682) మరియు అహ్మద్ (10432') మరియు వారి మాటలు,- మార్గం నుండి హానీ కల్గించే వస్తువును తొలగించడం వల్ల అతనికి స్వర్గప్రవేశం కలిగింది,మరి ప్రజలకు హనీ కలిగించేవారికి'వారిని పట్టిపీడిస్తున్నవారికి ఎటువంటి గతిపడుతుందో;

ఈ పేరా ప్రారంభంలో వడ్డీ,అన్యాయం, మోసం,భూమిలో ఉపద్రవాలు సృష్టించడం లాంటి విషయాలను నిషేధించే ఆయతులు మరియు హదీసులను మేము ప్రస్తావించాము. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

{మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!}

[అల్ అహ్'జాబ్:58]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.}

[ఫుస్సీలత్:46]

మరియు సున్నతులో ఈ విషయం ప్రస్తావన వచ్చింది :- {నిశ్చయంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా తీర్పు చేశారు 'హాని కలిగించకూడదు,పరస్పరం హాని కలిగించుకొకూడదు."}

సునన్ అబీ దావూద్

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అథితి ని గౌరవించాలి.ఎవరైతే అల్లాహ్'ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన మాటలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి.

సహీహ్ ముస్లిం (47)

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ఒక స్త్రీ' పిల్లి వల్ల శిక్షకు గురయ్యింది,ఆమె దాన్ని ఖైదుచేసింది చివరికి చనిపోయింది,ఆ కారణంగా ఆమె నరకానికి ప్రవేశించింది. ఆమె దాన్ని ఖైదు చేసినప్పుడు దానికి నీరుకాని తిండికాని పెట్టేదికాదు,విడుదల కూడా చేసేది కాదు అలాగైనా నేలపై క్రిమికీటకాలను తినిబ్రతికేది.}

సహీహ్ బుఖారి 3482

ఇది ఒక పిల్లిని కష్టపెట్టినందుకు జరిగింది మరి ప్రజలను కష్టపెట్టేవాడికి ఎటువంటి గతిపడుతుంది ?ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు కథనం:ఇలా తెలిపారు'దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం మింబర్ పై ఎక్కి హెచ్చుస్వరంతో పిలిచారు;ఇలా భోదించారు :-

{ఇస్లాం'ను నోటితో అంగీకరించిన ఓ సముదాయమా! ఈమాను ఇంకా హృదయానికి చేరలేదు! ముస్లింలకు హాని చేయవద్దు, వారిని తిట్టవద్దు, వారి రహస్యాలు బయటపెట్టడానికి వారిపై నిఘా పెట్టకండి.వాస్తవానికి ఎవరైతే తన ముస్లిం సోదరుడి రహస్యాలను బహిర్గతం చేయడానికి ప్రయత్నించినా,అల్లాహ్ తన ఇంటి లోతులో ఉన్నప్పటికీ, తన రహస్యాలను విస్తృతంగా బహిర్గతం చేస్తాడు. అతను ఇలా అన్నాడు: ఒక రోజు ఇబ్ను'ఉమర్ అల్ బైత్ - లేదా – కాబా వైపు చూస్తూ ఇలా అన్నాడు:- 'నీకు ఎంతో గౌరవం కలదు,నీ పవిత్రత ఎంతో గౌరవదాయకమైనది!కానీ ఒక ముమిన్' గౌరవం అల్లాహ్ దృష్టిలో నీ కంటే చాలా పవిత్రమైనది'}.

తిర్మిజీ ఉల్లేఖనం :(2032) మరియు ఇబ్ను హిబ్బాన్:5763

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అథితి ని గౌరవించాలి.ఎవరైతే అల్లాహ్'ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన విషయాలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి}

సహీహ్ బుఖారి 6018

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం“మీకు ముఫ్లిస్(పేదవాడు)అంటే తెలుసా? అని ప్రశ్నించారు,దానికి సహచరులు ముఫ్లిస్ అంటే మాలో(ఎవరివద్ద అయితే)డబ్బులు దిర్హంలు,సంపద లేవో వారిని అంటాము,దానికి ప్రవక్త బదులిస్తూ:నా జాతి యొక్క ముఫ్లిస్ ఎవరు అంటే రేపు ప్రళయదినం రోజున నమాజ్,ఉపవాసాలు,జకాతులు తీసుకుని వస్తాడు కానీ ఒకరిని తిట్టి ఉంటాడు,ఒకరి పై అపనింద వేసి ఉంటాడు,ఒకరి సొమ్ము దోచుకుని ఉంటాడు ఒకరిని హత్య చేసి ఉంటాడు,ఒకరిని అన్యాయంగా కొట్టి ఉంటాడు అయితే అతని పుణ్యాలు బాధింప బడ్డ ప్రజల్లో పంచబడుతాయి అవి అయిపోవడం వలన అతని పుణ్యాలు తక్కువ పడటం వలన బాధింపబడ్డ పాపాలు కూడా ఇతని తలపై వేయబడుతాయి పిదప నరకం లో విసిరివేయబడుతాడు}.

ముస్లిం ఉల్లేఖనం :(2581)తిర్మిజీ ఉల్లేఖనం (2418) తన పదాలతో అహ్మద్ ఉల్లేఖనం (8029)

రసూలుల్లాహ్ ఇలా ప్రవచించారు:

{ఒకమార్గంలో చెట్టుకొమ్మ పడిఉంది అది ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది,అప్పుడు ఒక వ్యక్తి దాన్ని మార్గం నుండి తొలగించాడు,దాంతో అతనికి స్వర్గప్రవేశం కలిగింది'}.

అల్-బుఖారీ (652') ఈ అర్ధంతో ఉల్లేఖించారు,ముస్లిం (1914')దీనిని పోలినది, ఇబ్ను'మాజా (3682) మరియు అహ్మద్ (10432') మరియు వారి మాటలు,- మార్గం నుండి హానీ కల్గించే వస్తువును తొలగించడం వల్ల అతనికి స్వర్గప్రవేశం కలిగింది,మరి ప్రజలకు హనీ కలిగించేవారికి'వారిని పట్టిపీడిస్తున్నవారికి ఎటువంటి గతిపడుతుందో;

ఇస్లాం మనిషి బుద్దిని మరియు దాన్ని నష్టపరిచే ప్రతీ వస్తువు నుండి రక్షిస్తుంది ఉదాహరణకు: మద్యపానసేవనం,మరియు దాని గొప్పతనాన్ని పెంచుతుంది,అలాగే దానిని జవాబుదారితనం కొరకు కేంద్రబిందువుగా చేసింది,దానిని విగ్రహారాధన,అన్యచెడుల సంకెళ్ళ నుండి విముక్తి పరిచింది.ఇస్లాంలో ఒక తరగతివారికి మరొక తరగతిపై ప్రత్యేకంగా రహస్యాలు లేదా తీర్పులు లేవు.సమస్త ఆదేశాలు మరియు చట్టాలుశాసనాలు సరైనబుద్దికి అనుగుణంగా ఉన్నాయి.న్యాయం మరియు వివేక తీర్పునకు ఇది అనుగుణంగా ఉంటుంది.

మనిషి బుద్దిని కాపాడటానికి మరియు దానిస్థాయిని పెంచడానికి ఇస్లాం వచ్చింది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.}[అల్ ఇస్రా :36]కాబట్టి ఒకవ్యక్తిపై తన బుద్దిని రక్షించుకోవడం అనివార్యమైన విధి. అంచేత ఇస్లాం మద్యాన్ని,మరియు ఇతర హేయమైనపానియాలను హరామ్ చేసింది,-మద్యపానాన్నినిషేధం గురించి పేరా నంబరు (34)లో ఇంతకు ముందు అనేక ఆయతులు మరియు ఆహాదీసుల వెలుగులో ప్రస్తావించబడింది,అల్లాహ్ యోక్క ఈ మాట ద్వారా ముగిసిందిబహుశా మీరు అర్థం చేసుకుంటారని.[అల్ బఖర:242]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?[అల్ అన్ ఆమ్:32]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.[యూసుఫ్:2]అల్లాహ్ తఆలా వివరిస్తున్నాడు నిశ్చయంగా 'మార్గదర్శకం,వివేకం ద్వారా కేవలం బుద్దిమంతులు మాత్రమే ప్రయోజనం పొందుతారు,వారే అసలైన వివేచనాపరులు. అల్లాహ్ సెలవిచ్చాడు:-ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు.[అల్ బఖర :269]జవాబుదారీతనానికి ఇస్లాం బుద్దిని,వివేకాన్నికేంద్రబిందువుగా చేసింది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-{ముగ్గురి పై నుంచి కలం ఎత్తుకోబడింది:- నిద్రిస్తున్నవ్యక్తి మేల్కునెంతవరకు –పిల్లవాడు ప్రాజ్ఞవయస్సుకు చేరేవరకు–మతించినవాడు'బుద్దివచ్చేవరకు.}ఇమామ్ బుఖారీ దీనిని ము'అల్లఖ్'గా సీగా జజ్మ్ తో హదీసుకు(5269')ముందుగా ఉల్లేఖించారు,మరియు అబూదావూద్ మౌసూల్'ప్రకారంగా దీనిని ఉల్లేఖించారు(4402),తిర్మిజీ (1423),నసాయీ ఫీ (సుననిల్ కుబ్రా)(7346),అహ్మద్ (956)స్వల్పతేడాతో,ఇబ్ను మాజా (2042)సంక్షిప్తంగా'ఉల్లేఖించారు.మరియు ఇస్లాం విగ్రహాలనుండి,ఇతర అన్యచెడుల సంకెళ్ళ నుండి బుద్దిని విముక్తి పరిచింది,అల్లాహ్ తఆలా ఆ విగ్రహారాధనలలో పాతకుపోయి,హేయమైన కార్యక్రమాల్లో మునిగిపోయిన సముదాయాల స్థితిగతుల గురించి తెలుపుతూ ఇలా చెప్పాడు, అల్లాహ్ వైపునుండి వచ్చిన సత్యం ఇలా ఉంది:-{మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."}[జుక్'రుఫ్:23]"ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు అతను తన జాతీప్రజలతో ఇలా చెప్పాడు:-అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?"(52)వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము."(53){అల్ అంబియా :52-53}ఇస్లాం వచ్చిన పిదప ప్రజలతో విగ్రహారాధన త్యజించమని,తాతముత్తాతల ద్వార సంక్రమించిన అన్యచెడు సాంప్రదాయాలనుండి తెగత్రెంపులు చేసుకోవాలని,మరియు దైవప్రవక్తల(అలైహిముస్సలాం) మార్గాన్ని అనుసరించాలని ఆదేశించింది.ఒక తరగతివారికి మరొక తరగతిపై ప్రత్యేక పరిచే రహస్యాలు లేదా తీర్పులు ఇస్లాంలో లేవు.ఒకసారి అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు ను అడగటం జరిగింది ఆయన దైవప్రవక్త యొక్క బాబాయి కుమారుడు,మరియు ప్రవక్త కుమార్తె కు భర్త : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మీకు ఏదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారా?ఆయన చెప్పారు:{దైవప్రవక్త ఇతరులకు తెలియని ఏ విషయాన్ని నాకు ప్రత్యేకంగా చెప్పలేదు'కానీ చెప్పిన కొన్ని విషయాలు నా ఈ ఖడ్గం ఒరలో ఉన్నాయి, ఒక లిఖిత పత్రాన్ని అందులో నుంచి తీశారు:- 'అల్లాహ్'యేతరుల కొరకు జిబాహ్ చేసినవాడిని అల్లాహ్ శపించాడు,భూమి గుర్తులను దొంగిలించినవాడిని అల్లాహ్ శపించాడు, తన తండ్రిని శపించిన వాడిని అల్లాహ్ శపించాడు,మరియు ఒక బిద్అతీ'కు బస కల్పించినవాడిని అల్లాహ్ శపించాడు}.సహీహ్ ముస్లిం (1978)సమస్త ఆదేశాలు మరియు చట్టాలుశాసనాలు సరైనబుద్దికి అనుగుణంగా ఉన్నాయి.న్యాయానికి మరియు వివేక తీర్పునకు ఇది అనుగుణంగా ఉంటుంది.

{మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.}

[అల్ ఇస్రా :36]

కాబట్టి ఒకవ్యక్తిపై తన బుద్దిని రక్షించుకోవడం అనివార్యమైన విధి. అంచేత ఇస్లాం మద్యాన్ని,మరియు ఇతర హేయమైనపానియాలను హరామ్ చేసింది,-మద్యపానాన్నినిషేధం గురించి పేరా నంబరు (34)లో ఇంతకు ముందు అనేక ఆయతులు మరియు ఆహాదీసుల వెలుగులో ప్రస్తావించబడింది,అల్లాహ్ యోక్క ఈ మాట ద్వారా ముగిసింది

బహుశా మీరు అర్థం చేసుకుంటారని.

[అల్ బఖర:242]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?

[అల్ అన్ ఆమ్:32]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.

[యూసుఫ్:2]

అల్లాహ్ తఆలా వివరిస్తున్నాడు నిశ్చయంగా 'మార్గదర్శకం,వివేకం ద్వారా కేవలం బుద్దిమంతులు మాత్రమే ప్రయోజనం పొందుతారు,వారే అసలైన వివేచనాపరులు. అల్లాహ్ సెలవిచ్చాడు:-

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు.

[అల్ బఖర :269]

జవాబుదారీతనానికి ఇస్లాం బుద్దిని,వివేకాన్నికేంద్రబిందువుగా చేసింది,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :-

{ముగ్గురి పై నుంచి కలం ఎత్తుకోబడింది:- నిద్రిస్తున్నవ్యక్తి మేల్కునెంతవరకు –పిల్లవాడు ప్రాజ్ఞవయస్సుకు చేరేవరకు–మతించినవాడు'బుద్దివచ్చేవరకు.}

ఇమామ్ బుఖారీ దీనిని ము'అల్లఖ్'గా సీగా జజ్మ్ తో హదీసుకు(5269')ముందుగా ఉల్లేఖించారు,మరియు అబూదావూద్ మౌసూల్'ప్రకారంగా దీనిని ఉల్లేఖించారు(4402),తిర్మిజీ (1423),నసాయీ ఫీ (సుననిల్ కుబ్రా)(7346),అహ్మద్ (956)స్వల్పతేడాతో,ఇబ్ను మాజా (2042)సంక్షిప్తంగా'ఉల్లేఖించారు.

మరియు ఇస్లాం విగ్రహాలనుండి,ఇతర అన్యచెడుల సంకెళ్ళ నుండి బుద్దిని విముక్తి పరిచింది,అల్లాహ్ తఆలా ఆ విగ్రహారాధనలలో పాతకుపోయి,హేయమైన కార్యక్రమాల్లో మునిగిపోయిన సముదాయాల స్థితిగతుల గురించి తెలుపుతూ ఇలా చెప్పాడు, అల్లాహ్ వైపునుండి వచ్చిన సత్యం ఇలా ఉంది:-

{మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."}

[జుక్'రుఫ్:23]

"ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు అతను తన జాతీప్రజలతో ఇలా చెప్పాడు:-

అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?"(52)

వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము."(53)

{అల్ అంబియా :52-53}

ఇస్లాం వచ్చిన పిదప ప్రజలతో విగ్రహారాధన త్యజించమని,తాతముత్తాతల ద్వార సంక్రమించిన అన్యచెడు సాంప్రదాయాలనుండి తెగత్రెంపులు చేసుకోవాలని,మరియు దైవప్రవక్తల(అలైహిముస్సలాం) మార్గాన్ని అనుసరించాలని ఆదేశించింది.

ఒక తరగతివారికి మరొక తరగతిపై ప్రత్యేక పరిచే రహస్యాలు లేదా తీర్పులు ఇస్లాంలో లేవు.

ఒకసారి అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు ను అడగటం జరిగింది ఆయన దైవప్రవక్త యొక్క బాబాయి కుమారుడు,మరియు ప్రవక్త కుమార్తె కు భర్త : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మీకు ఏదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారా?ఆయన చెప్పారు:{దైవప్రవక్త ఇతరులకు తెలియని ఏ విషయాన్ని నాకు ప్రత్యేకంగా చెప్పలేదు'కానీ చెప్పిన కొన్ని విషయాలు నా ఈ ఖడ్గం ఒరలో ఉన్నాయి, ఒక లిఖిత పత్రాన్ని అందులో నుంచి తీశారు:- 'అల్లాహ్'యేతరుల కొరకు జిబాహ్ చేసినవాడిని అల్లాహ్ శపించాడు,భూమి గుర్తులను దొంగిలించినవాడిని అల్లాహ్ శపించాడు, తన తండ్రిని శపించిన వాడిని అల్లాహ్ శపించాడు,మరియు ఒక బిద్అతీ'కు బస కల్పించినవాడిని అల్లాహ్ శపించాడు}.

సహీహ్ ముస్లిం (1978)

సమస్త ఆదేశాలు మరియు చట్టాలుశాసనాలు సరైనబుద్దికి అనుగుణంగా ఉన్నాయి.న్యాయానికి మరియు వివేక తీర్పునకు ఇది అనుగుణంగా ఉంటుంది.

మరియు తప్పుడు మతాలు,దానిఉపాసకులు అందులో ఉన్న వైరుధ్యాలను మరియు బుద్దిని వ్యతిరేఖించే విషయాలను అర్థం చేసుకోకపోయినప్పుడు,మతాధికారులు బుద్దికి అందని స్థాయిలో మతం ఉందని,మతాన్ని అర్థం చేసుకోవడంలో దాన్ని గ్రహించడంలో మెదడుకు,బుద్దికు ఎటువంటి శక్తి లేదని ఉపాసకులకు చెప్పి భ్రమకలిగిస్తారు.కానీ ఇస్లాం 'ధర్మం'ను బుద్దిని ప్రకాశింపచేసే కాంతిగా భావించింది;తప్పుడు మతాలవారు మనిషి తమ మెదడును వివేకాన్ని వదలి కేవలం వారిని అవలంబించాలని కోరుకుంటారు కానీ ఇస్లాం ధర్మం మాత్రం మనిషి తన బుద్దిని మేల్కొలిపి అతను అనుసరిస్తున్న విషయాల వాస్తవాలను,సత్యాఅసత్యాలను తెలుసుకోవాలని కోరుకుంటుంది.

మరియు తప్పుడు మతాలు,దానిఉపాసకులు అందులో ఉన్న వైరుధ్యాలను మరియు బుద్దిని వ్యతిరేఖించే విషయాలను అర్థం చేసుకోకపోయినప్పుడు,మతాధికారులు బుద్దికి అందని స్థాయిలో మతం ఉందని,మతాన్ని అర్థం చేసుకోవడంలో దాన్ని గ్రహించడంలో మెదడుకు,బుద్దికు ఎటువంటి శక్తి లేదని చెప్పి భ్రమకలిగిస్తారు.కానీ ఇస్లాం 'ధర్మం ను'బుద్దిని ప్రకాశింపచేసే కాంతిగా భావించింది;తప్పుడు మతాలవారు మనిషి తమ మెదడును వివేకాన్ని వదలి కేవలం వారిని అవలంబించాలని కోరుకుంటారు కానీ ఇస్లాం ధర్మం మాత్రం మనిషి తన బుద్దిని మేల్కొలిపి అతను అనుసరిస్తున్నవిషయాల వాస్తవాలను,సత్యా అసత్యాలను తెలుసుకోవాలని,ఆలోచన చేసి ఆద్యాయనం చేయాలని కోరుకుంటుంది.అల్లాహ్ సెలవిచ్చాడు:-{మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.}[షూరా :52]దైవవాణి' గట్టి ఆధారాలను,తిరుగులేని రుజువులను కలిగి ఉంటుంది,అవి స్వచ్చమైన బుద్దిమంతులకు సత్యమైన వాస్తవాల వైపుకు మార్గనిర్దేశం చేస్తాయి.అవి వాటిసత్యాన్ని గ్రహించడానికి మరియు వాటిని విశ్వసించడానికి సహకరిస్తాయి,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.}[నిసా :174]ఒక వ్యక్తి మార్గదర్శకత్వం,జ్ఞానం మరియు సత్యం వెలుగులో జీవించాలని సర్వశక్తిమంతుడు పవిత్రుడైన అల్లాహ్ కోరుకుంటాడు,అదే వ్యక్తి అవిశ్వాసం,అజ్ఞానం,అపమార్గపు అంధకారల్లో జీవితం గడపాలని షైతానులు మరియు మతాధికారులు కోరుకుంటారు.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.{అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించినవారి రక్షకులు కల్పితదైవాలు (తాగూత్); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొని పోతాయి}[అల్ బఖర :257]

{మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.}

[షూరా :52]

దైవవాణి' గట్టి ఆధారాలను,తిరుగులేని రుజువులను కలిగి ఉంటుంది,అవి స్వచ్చమైన బుద్దిమంతులకు సత్యమైన వాస్తవాల వైపుకు మార్గనిర్దేశం చేస్తాయి.అవి వాటిసత్యాన్ని గ్రహించడానికి మరియు వాటిని విశ్వసించడానికి సహకరిస్తాయి,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.}

[నిసా :174]

ఒక వ్యక్తి మార్గదర్శకత్వం,జ్ఞానం మరియు సత్యం వెలుగులో జీవించాలని సర్వశక్తిమంతుడు పవిత్రుడైన అల్లాహ్ కోరుకుంటాడు,అదే వ్యక్తి అవిశ్వాసం,అజ్ఞానం,అపమార్గపు అంధకారల్లో జీవితం గడపాలని షైతానులు మరియు మతాధికారులు కోరుకుంటారు.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

{అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించినవారి రక్షకులు కల్పితదైవాలు (తాగూత్); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొని పోతాయి}

[అల్ బఖర :257]

ఇస్లాం నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని గౌరవిస్తుంది,మనోవంఛలకు తావు లేని విజ్ఞాన పరిశోధనలను కోరుతుంది,మన ఉనికిని,మనచుట్టూ ఉన్నవిశ్వాన్ని పరీక్షించమని,ఆలోచించమని ఆహ్వానిస్తుంది మరియు జ్ఞానానికి చెందిన నిజమైన విజ్ఞానశాస్త్రీయ ఫలితాలు ఇస్లాంకు విరుద్ధంగా విభేదించలేవు.

అల్-ఇస్లాం;-జ్ఞానానికి ఒక గొప్పస్థానం కల్పించింది,అల్లాహ్ సెలవిచ్చాడు:-{మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.}[అల్ ముజాదల :11]ఒక గొప్ప సాక్ష్యం కోసం' ధార్మిక ఉలమాల సాక్ష్యాన్ని అల్లాహ్ తన సాక్ష్యంతో మరియు దైవదూతల సాక్ష్యంతో జోడించాడు:అల్లాహ్ సెలవిచ్చాడు:-{నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు;ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.}[ఆలే ఇమ్రాన్ :18]ఇది ఇస్లాంలో ఉలమాల యొక్క స్థానాన్ని స్పష్టంగా సూచిస్తుంది,మరియు దైవప్రవక్త(ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్)కు అల్లాహ్ తఆలా కేవలం జ్ఞానవృద్ది కోసం దూఆ చేయమని ఆదేశించాడు:అల్లాహ్ తాలా సెలవిచ్చాడు:-{మరియు నువ్వు చెప్పు'ఓ నా ప్రభువా ! నా జ్ఞానంలో వృద్దిని అనుగ్రహించు}తాహా:114రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{ఎవరైతే అల్లాహ్ ప్రీతి ప్రసన్నతని పొందే సంకల్పంతో దైవమార్గంలో బయల్దేరుతాడో అతనికోసం అల్లాహ్ స్వర్గమార్గాలను సులభం చేస్తాడు,నిశ్చయంగా దైవదూతలు ఆ విద్యార్థి అబ్యాసానికి సంతోషిస్తూ అతనికోసం తమ రెక్కలు పరుస్తాయి,సర్వలోకాలు ,భూమ్యాకాశాలలో ఉన్నసమస్తము చివరికి నీటిలోని చేపలు కూడా అతని మన్నింపులకోసం దుఆ చేస్తూ ఉంటాయి,ధార్మిక పండితునికి ఒక ఆరాధకుడిపై గల ప్రాధాన్యత సమస్త నక్షత్రాలపై చంద్రుడికి గల ప్రాదాన్యత వంటిది'నిశ్చయంగా పండితులు (ఉలమాలు) ప్రవక్తలకు వారసులు,ఆ ప్రవక్తలు దీనార్లకు దిర్హంలను వారసత్వం లో వదలరు నిశ్చయంగా వారు విద్యాజ్ఞానాన్ని వారసత్వంలో వదిలేస్తారు'మరెవరైతే దాన్ని అర్జించాడో పరిపూర్ణంగా పొందాడు.}అబుదావూద్ (3641),తిర్మిజీ (2682)ఇబ్ను'మాజా (223)వల్లఫ్జు లహు,అహ్మద్ (21715).39'-ఇస్లాం మనోవంఛలకు తావు లేని నిజమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది,మన ఉనికిని,మన చుట్టూ ఉన్న విశ్వాన్ని పరీక్షించమని,ఆలోచించమని ఆహ్వానిస్తుంది.అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-{ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను (ఆయాత్ లను), వారి చుట్టూ ఉన్న ఖగోళంలో మరియు వారియెందును చూపుతాము; చివరకు ఇదే (ఈ ఖుర్ఆనే) సత్యమని వారికి స్పష్టమవుతుంది. ఏమీ? నీ ప్రభువు! నిశ్చయంగా, ఆయనే ప్రతిదానికి సాక్షి,అనే విషయం చాలదా?}{ఫుస్సీలత్:53}మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?}[అల్ ఆరాఫ్:185].మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.}[రూమ్:9]విజ్ఞాన శాస్త్రం యొక్క సరైన శాస్త్రీయ ఫలితాలు ఇస్లాంను విభేదించవు,పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖుర్ఆన్ ఖచ్చితమైన వివరాలను ప్రస్తావించిన ఒక ఉదాహరణను మేము ఇప్పుడు ప్రస్తావిస్తాము,ఆ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం తరువాతకాలంలో ఆవిష్కరించింది.ఆ విజ్ఞాన శాస్త్రీయ ఫలితాలు పవిత్ర ఖుర్ఆన్'కు అనుగుణంగా వెళ్లడయ్యాయి.అది తల్లి గర్భంలో పిండం యొక్క సృష్టి గురించి.అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు-:మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.}12తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.(13){ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.(14 )}[అల్ ముమినూన్:12-14]

{మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.}

[అల్ ముజాదల :11]

ఒక గొప్ప సాక్ష్యం కోసం' ధార్మిక ఉలమాల సాక్ష్యాన్ని అల్లాహ్ తన సాక్ష్యంతో మరియు దైవదూతల సాక్ష్యంతో జోడించాడు:అల్లాహ్ సెలవిచ్చాడు:-

{నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దైవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు;ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.}

[ఆలే ఇమ్రాన్ :18]

ఇది ఇస్లాంలో ఉలమాల యొక్క స్థానాన్ని స్పష్టంగా సూచిస్తుంది,మరియు దైవప్రవక్త(ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్)కు అల్లాహ్ తఆలా కేవలం జ్ఞానవృద్ది కోసం దూఆ చేయమని ఆదేశించాడు:అల్లాహ్ తాలా సెలవిచ్చాడు:-

{మరియు నువ్వు చెప్పు'ఓ నా ప్రభువా ! నా జ్ఞానంలో వృద్దిని అనుగ్రహించు}

తాహా:114

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{ఎవరైతే అల్లాహ్ ప్రీతి ప్రసన్నతని పొందే సంకల్పంతో దైవమార్గంలో బయల్దేరుతాడో అతనికోసం అల్లాహ్ స్వర్గమార్గాలను సులభం చేస్తాడు,నిశ్చయంగా దైవదూతలు ఆ విద్యార్థి అబ్యాసానికి సంతోషిస్తూ అతనికోసం తమ రెక్కలు పరుస్తాయి,సర్వలోకాలు ,భూమ్యాకాశాలలో ఉన్నసమస్తము చివరికి నీటిలోని చేపలు కూడా అతని మన్నింపులకోసం దుఆ చేస్తూ ఉంటాయి,ధార్మిక పండితునికి ఒక ఆరాధకుడిపై గల ప్రాధాన్యత సమస్త నక్షత్రాలపై చంద్రుడికి గల ప్రాదాన్యత వంటిది'నిశ్చయంగా పండితులు (ఉలమాలు) ప్రవక్తలకు వారసులు,ఆ ప్రవక్తలు దీనార్లకు దిర్హంలను వారసత్వం లో వదలరు నిశ్చయంగా వారు విద్యాజ్ఞానాన్ని వారసత్వంలో వదిలేస్తారు'మరెవరైతే దాన్ని అర్జించాడో పరిపూర్ణంగా పొందాడు.}

అబుదావూద్ (3641),తిర్మిజీ (2682)ఇబ్ను'మాజా (223)వల్లఫ్జు లహు,అహ్మద్ (21715).

39'-ఇస్లాం మనోవంఛలకు తావు లేని నిజమైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది,మన ఉనికిని,మన చుట్టూ ఉన్న విశ్వాన్ని పరీక్షించమని,ఆలోచించమని ఆహ్వానిస్తుంది.అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-

{ఇక త్వరలోనే మేము వారికి మా సంకేతాలను (ఆయాత్ లను), వారి చుట్టూ ఉన్న ఖగోళంలో మరియు వారియెందును చూపుతాము; చివరకు ఇదే (ఈ ఖుర్ఆనే) సత్యమని వారికి స్పష్టమవుతుంది. ఏమీ? నీ ప్రభువు! నిశ్చయంగా, ఆయనే ప్రతిదానికి సాక్షి,అనే విషయం చాలదా?}

{ఫుస్సీలత్:53}

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?}

[అల్ ఆరాఫ్:185].

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.}

[రూమ్:9]

విజ్ఞాన శాస్త్రం యొక్క సరైన శాస్త్రీయ ఫలితాలు ఇస్లాంను విభేదించవు,పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖుర్ఆన్ ఖచ్చితమైన వివరాలను ప్రస్తావించిన ఒక ఉదాహరణను మేము ఇప్పుడు ప్రస్తావిస్తాము,ఆ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం తరువాతకాలంలో ఆవిష్కరించింది.ఆ విజ్ఞాన శాస్త్రీయ ఫలితాలు పవిత్ర ఖుర్ఆన్'కు అనుగుణంగా వెళ్లడయ్యాయి.అది తల్లి గర్భంలో పిండం యొక్క సృష్టి గురించి.అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు-:

మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.}12

తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.(13)

{ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.(14 )}

[అల్ ముమినూన్:12-14]

అల్లాహ్'ను విశ్వసించి,ఆయనకు విధేయత చూపిస్తూ,దైవప్రవక్తలను సత్యమని దృవీకరించి విశ్వసించేవారిని మినహాయించి,పరలోకంలో ఏ ఇతరుల ఆచరణలు అల్లాహ్ అంగీకరించడు,ప్రతిఫలమివ్వడు.మరియు అల్లాహ్ షరీఅతు శాసనాల ప్రకారంగా జరిగే ఆరాధనలు మాత్రమే ఆయన ఆమోదిస్తాడు,అలాంటప్పుడు మనిషి అల్లాహ్'ను ఎలా తిరస్కరించగలుగుతున్నాడు మరియు కర్మలకు మంచి ప్రతిఫలాన్నిఆశిస్తున్నాడు? ఎవరైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో పాటు'మిగతా ప్రవక్తలందరినీ కూడా విశ్వసిస్తారో వారి మినహా అల్లాహ్ ఏ ఒక్కరి విశ్వాసాన్ని ఆమోదించడు.

అల్లాహ్'ను విశ్వసించి,ఆయనకు విధేయత చూపిస్తూ, దైవప్రవక్తలను సత్యమని దృవీకరించి విశ్వసించేవారిని మినహాయించి,పరలోకంలో ఏ ఇతరుల ఆచరణలు అల్లాహ్ అంగీకరించడు,పుణ్యఫలమివ్వడు.{ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.}(18 )మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది.(19)[అల్ ఇస్రా :18-19]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.}అల్ అంబియా :94అల్లాహ్ నిర్దారించిన శాసనాల ప్రకారం తప్ప వేరే ఆరాధనలను ఆమోదించడు,-'అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{కాబట్టి ఎవడైతే అల్లాహ్'యొక్క కలయిక'ను ఆశిస్తాడో అతను సత్కార్యాలను ఆచరించాలిమరియు తన ప్రభువు ఆరాధనతో ఎవ్వరికీ సాటికల్పించకూడదు.}{అల్ కహఫ్:110}కేవలం సత్కార్యం వల్ల అది పుణ్యకార్యం కాలేదు,అల్లాహ్'షరీఅతు నియమాల ప్రకారం ఉండాలి,అలాగే ఆవ్యక్తి తన'కార్యంలో'చిత్తశుద్దిని కలిగి ఉండాలి' అల్లాహ్'ను విశ్వసిస్తూ సమస్త ప్రవక్తలను సత్యమని విశ్వసించాలి'అని స్పష్టపరచడం జరిగింది ఇక ఎవరి కార్యాలు దీనికి విరుద్దంగా ఉంటాయో వారి గురించి అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు:-{మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.}[అల్ ఫుర్ ఖాన్ :23]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.}(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి(3){వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.(4)}{అల్ గాషియా :2-4}కాబట్టి ఈ ముఖాలు కర్మలతో అలసిసోలసి,అవమానానికి గురయ్యాయి, అల్లాహ్ మార్గదర్శనానికి వ్యతిరేఖంగా ఆచరించినందువల్ల వారిని అల్లాహ్ నరకాగ్నిలో నింపుతాడు,ఎందుకంటే షరీయతుకు విరుద్దంగా మాత్రమే వారు జీవనాన్ని సాగించారు,అన్యాయమైన అసత్యమైన ఆరాధనలు వారు సలిపారు,అసత్య మార్గాలను,మతాలను ఆవిష్కరించిన మార్గబ్రష్టులను వారు అనుసరించారు,కానీ ఆమోదయోగ్య వాస్తవమైన సత్కర్మలు అల్లాహ్ వద్ద ఉన్నాయి,అవి దైవప్రవక్తలు తెచ్చిన విషయాలకు అనుగుణంగా ఉన్నాయి,అలాంటప్పుడు మనిషి ఎందుకని అల్లాహ్'ను తిరస్కరించాడు ఆపై ఎందుకని ఆయనతో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు??దైవప్రవక్తలందరినీ విశ్వసించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్'సందేశాన్ని విశ్వసిస్తే తప్ప అల్లాహ్ ప్రజలందరి నమ్మకాన్ని అంగీకరించడు -దీనికి మేము ఇప్పటికే కొన్ని ఆధారాలను పేరా నెంబర్ (20'లో పేర్కొన్నాము మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:-{ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}[అల్ బఖర :285]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!}[నిసా :136]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.}[అలే ఇమ్రాన్:81]

{ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.}(18 )

మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది.(19)

[అల్ ఇస్రా :18-19]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.}

అల్ అంబియా :94

అల్లాహ్ నిర్దారించిన శాసనాల ప్రకారం తప్ప వేరే ఆరాధనలను ఆమోదించడు,-'అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{కాబట్టి ఎవడైతే అల్లాహ్'యొక్క కలయిక'ను ఆశిస్తాడో అతను సత్కార్యాలను ఆచరించాలిమరియు తన ప్రభువు ఆరాధనతో ఎవ్వరికీ సాటికల్పించకూడదు.}

{అల్ కహఫ్:110}

కేవలం సత్కార్యం వల్ల అది పుణ్యకార్యం కాలేదు,అల్లాహ్'షరీఅతు నియమాల ప్రకారం ఉండాలి,అలాగే ఆవ్యక్తి తన'కార్యంలో'చిత్తశుద్దిని కలిగి ఉండాలి' అల్లాహ్'ను విశ్వసిస్తూ సమస్త ప్రవక్తలను సత్యమని విశ్వసించాలి'అని స్పష్టపరచడం జరిగింది ఇక ఎవరి కార్యాలు దీనికి విరుద్దంగా ఉంటాయో వారి గురించి అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు:-

{మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.}

[అల్ ఫుర్ ఖాన్ :23]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.}

(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి(3)

{వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.(4)}

{అల్ గాషియా :2-4}

కాబట్టి ఈ ముఖాలు కర్మలతో అలసిసోలసి,అవమానానికి గురయ్యాయి, అల్లాహ్ మార్గదర్శనానికి వ్యతిరేఖంగా ఆచరించినందువల్ల వారిని అల్లాహ్ నరకాగ్నిలో నింపుతాడు,ఎందుకంటే షరీయతుకు విరుద్దంగా మాత్రమే వారు జీవనాన్ని సాగించారు,అన్యాయమైన అసత్యమైన ఆరాధనలు వారు సలిపారు,అసత్య మార్గాలను,మతాలను ఆవిష్కరించిన మార్గబ్రష్టులను వారు అనుసరించారు,కానీ ఆమోదయోగ్య వాస్తవమైన సత్కర్మలు అల్లాహ్ వద్ద ఉన్నాయి,అవి దైవప్రవక్తలు తెచ్చిన విషయాలకు అనుగుణంగా ఉన్నాయి,అలాంటప్పుడు మనిషి ఎందుకని అల్లాహ్'ను తిరస్కరించాడు ఆపై ఎందుకని ఆయనతో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు??

దైవప్రవక్తలందరినీ విశ్వసించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్'సందేశాన్ని విశ్వసిస్తే తప్ప అల్లాహ్ ప్రజలందరి నమ్మకాన్ని అంగీకరించడు -దీనికి మేము ఇప్పటికే కొన్ని ఆధారాలను పేరా నెంబర్ (20'లో పేర్కొన్నాము మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:-

{ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}

[అల్ బఖర :285]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!}

[నిసా :136]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.}

[అలే ఇమ్రాన్:81]

నిశ్చయంగా సమస్త దైవసందేశహరుల లక్ష్యం మనిషికి న్యాయమైన ధర్మం అందించడం,అప్పుడు అతను సమస్తలోకాల ప్రభువు అల్లాహ్ పట్ల చిత్తశుద్దిగల దాసుడుగా మారుతాడు మరియు మనిషి ఆరాధన నుండి,తాత్కాలిక సుఖభోగాలనుండి హేయకార్యముల నుండి విముక్తిపొందుతాడు,మీరు చూస్తున్నట్లుగా ఇస్లాం ఏ మనిషిని మహిమాన్వితుడిగా'చేయదు,స్థాయికి మించివారిని పైకి లేపదు,వారిని ప్రభువులుగా దైవాలుగా మార్చదు.

నిశ్చయంగా సమస్త దైవసందేశహరుల లక్ష్యం మనిషికి న్యాయమైన ధర్మం అందించడం,అప్పుడు అతను సమస్తలోకాల ప్రభువు అల్లాహ్ పట్ల చిత్తశుద్దిగల దాసుడుగా మారుతాడు మరియు మనిషి ఆరాధన నుండి,తాత్కాలిక సుఖభోగాల నుండి హేయకార్యముల నుండి విముక్తి పొందుతాడు,మీరు చూస్తున్నట్లుగా ఇస్లాం ఏ మనిషిని మహిమాన్వితుడిగా'చేయదు,స్థాయికి మించివారిని పైకి లేపదు,వారిని ప్రభువులుగా దైవాలుగా మార్చదు.దైవప్రవక్త'సల్లల్లాహు అలైహివసల్లం తెలిపారు:-{దీనారు ఆరాధకుడు,దిర్హం ఆరాధకుడు,చారలపట్టువస్త్రాల ఆరాధకుడు నాశనమయ్యారు,ఒకవేళ వారికి ఏదైనా ఇస్తే సంతోషిస్తారు,ఒకవేళ ఇవ్వకపోతే ఆగ్రహానికి గురవుతారు}{సహీహ్ బుఖారి 6435}ఒక సాధారణవ్యక్తి అల్లాహ్'కు'మాత్రమే లోబడి అనుకువతో ఉంటాడు,డబ్బు,ప్రతిష్ట,పదవి,తెగ ఏది అతన్ని లొంగదీసుకోలేవు,మరియు ఈ కథలో దైవదౌత్యానికి ముందు ప్రజలు ఎలా ఉండేవారు ఆ తరువాత ఎలా మారారు?అనే విషయం పాఠకుడికి తెలుస్తుంది.ప్రథమముస్లిములు హబ్షా అబిసీనియా వైపుకు హిజ్రత్ చేసి వెళ్లినప్పుడు ,వారిని హబ్షా రాజు అందాక్ -అన్నజాషి-ప్రశ్నించాడు ,ఇలా వారితో చెప్పాడు :-అసలు ఈ ధర్మం ఏమిటి ?దీని వల్ల మీ జాతి నుండి మీరు విడిపోయారు,నా మతంలోకి చేరలేదు,నేటి జాతులకు చెందిన మతంలోకి ప్రవేశించలేదు?జాఫర్ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు తెలిపారు:-ఓ మహారాజా!మేము అంధకారంలో అజ్ఞానులుగా జీవిస్తూ ఉండేవారము,'విగ్రహాలను'ఆరాధించేవారము,మృతజీవులను'తినేవారము,అశ్లీలానికి,అనైతికతకు'పాల్పడేవారము,బంధుత్వాలను త్రెంచేవారము,మాలోని బలవంతుడు బలహీనుడిని దోచుకునేవాడు,ఈ విధంగా జీవిస్తున్నతరుణంలో మా వైపుకు అల్లాహ్ ఒక ప్రవక్తను పంపాడు'అతని వంశం, సత్యసంధత,అమానతు,పవిత్రత గురించి మాకు చాలా బాగా తెలుసు.ఆయన ఒక అల్లాహ్ వైపుకు ఆహ్వానించాడు,మేము అల్లాహ్ ఏకత్వాన్ని విశ్వసిస్తూ ఆయనను ఆరాధించాలి,మేము ఆరాధించేవి వదిలిపెట్టాలి,అప్పుడు మేము మాపూర్వీకులు అల్లాహ్'ను కాకుండా రాళ్ళను,విగ్రహాలను ఆరాధించేవారము,ఆయన మాకు ఈ విషయాలు భోదించారు :- మేము సత్యం మాట్లాడాలి,అమానతులు తిరిగి అప్పచెప్పాలి,బంధుత్వాలను కలుపుకోవాలి,పొరుగువారితో ఉత్తమంగా మెలగాలి, దురాక్రమణ,రక్తపాతం నుండి ఆగిపోవాలి,అలాగే ఈ విషయాల నుండి మమ్మల్ని వారించారు అవి :- అశ్లీలానికి దూరంగా ఉండాలి,అబద్దసాక్ష్యం చెప్పకూడదు,అనాధ సొమ్మును అన్యాయంగా తినకూడదు,శీలగుణవంతులపై అబాండాలు మోపకూడదు,అదేవిధంగా మాకు ఈ విషయాన్నికూడా ఆజ్ఞాపించారు;-మేము కేవలం అల్లాహ్'ను మాత్రమే ఆరాధించాలి,ఆయనతో పాటు మరొకరిని సాటి కల్పించకూడదు,నమాజు స్థాపించాలి,జకాతు చెల్లించాలి,ఉపవాసాలు పాటించాలి."అతను ఇలా అన్నారు: ఆయన ఇస్లాం యొక్క తదితర విషయాలను వివరించాడు మేము వాటిని సత్యమని అంగీకరించాము అతనిని విశ్వసించాము,ఆయన తెచ్చిన దానిప్రకారం అనుసరించాము'పిమ్మట మేము అల్లాహ్'ఏకైకుడను మాత్రమే ఆరాధించాము,ఆయనకు ఇతరులను సాటి కల్పించలేదు,ఆయన మాకు హరాము చేసినవాటిని మేము నిషేదించుకున్నాము,ఆయన మాకు హలాలు చేసినవాటిని మేము హలాలుగా భావించాము"ఇమామ్ అహ్మద్ (ర) దీనిని స్వల్ప తేడాతో ఉల్లేఖించారు:(1740 );అబూనయీమ్ హిల్యతుల్ఔలియా' సంక్షిప్తంగా (1/115)మీరు చూసినట్లుగా' ఇస్లాం,వ్యక్తులకు పవిత్రత ఇవ్వదు,వారి స్థాయి కంటే పైకి వారిని లేపదు,వారిని ప్రభువులుగా,దైవాలుగా మార్చదు.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు."వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు}.[ఆల్ ఇమ్రాన్ :64]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{మరియు మీరు దైవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?}[ఆల్ ఇమ్రాన్ :80]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{నసార}క్రైస్తవులు మర్యం పుత్రుడైన ఈసా విషయము లో అతిక్రమించినట్లు నా విషయం లోమీరు నా హోదా కు,(స్థాయి కి) మించి అతిశయిళ్లకండి (మితిమీరకండి),నిశ్చయంగా నేను ఒక దాసుడను మాత్రమే కాబట్టి"అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త" అని మాత్రమే పలకండి}సహీహ్ బుఖారి 3445

{దీనారు ఆరాధకుడు,దిర్హం ఆరాధకుడు,చారలపట్టువస్త్రాల ఆరాధకుడు నాశనమయ్యారు,ఒకవేళ వారికి ఏదైనా ఇస్తే సంతోషిస్తారు,ఒకవేళ ఇవ్వకపోతే ఆగ్రహానికి గురవుతారు}

{సహీహ్ బుఖారి 6435}

ఒక సాధారణవ్యక్తి అల్లాహ్'కు'మాత్రమే లోబడి అనుకువతో ఉంటాడు,డబ్బు,ప్రతిష్ట,పదవి,తెగ ఏది అతన్ని లొంగదీసుకోలేవు,మరియు ఈ కథలో దైవదౌత్యానికి ముందు ప్రజలు ఎలా ఉండేవారు ఆ తరువాత ఎలా మారారు?అనే విషయం పాఠకుడికి తెలుస్తుంది.

ప్రథమముస్లిములు హబ్షా అబిసీనియా వైపుకు హిజ్రత్ చేసి వెళ్లినప్పుడు ,వారిని హబ్షా రాజు అందాక్ -అన్నజాషి-ప్రశ్నించాడు ,ఇలా వారితో చెప్పాడు :-

అసలు ఈ ధర్మం ఏమిటి ?దీని వల్ల మీ జాతి నుండి మీరు విడిపోయారు,నా మతంలోకి చేరలేదు,నేటి జాతులకు చెందిన మతంలోకి ప్రవేశించలేదు?

జాఫర్ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు తెలిపారు:-

ఓ మహారాజా!మేము అంధకారంలో అజ్ఞానులుగా జీవిస్తూ ఉండేవారము,'విగ్రహాలను'ఆరాధించేవారము,మృతజీవులను'తినేవారము,అశ్లీలానికి,అనైతికతకు'పాల్పడేవారము,బంధుత్వాలను త్రెంచేవారము,మాలోని బలవంతుడు బలహీనుడిని దోచుకునేవాడు,ఈ విధంగా జీవిస్తున్నతరుణంలో మా వైపుకు అల్లాహ్ ఒక ప్రవక్తను పంపాడు'అతని వంశం, సత్యసంధత,అమానతు,పవిత్రత గురించి మాకు చాలా బాగా తెలుసు.ఆయన ఒక అల్లాహ్ వైపుకు ఆహ్వానించాడు,మేము అల్లాహ్ ఏకత్వాన్ని విశ్వసిస్తూ ఆయనను ఆరాధించాలి,మేము ఆరాధించేవి వదిలిపెట్టాలి,అప్పుడు మేము మాపూర్వీకులు అల్లాహ్'ను కాకుండా రాళ్ళను,విగ్రహాలను ఆరాధించేవారము,ఆయన మాకు ఈ విషయాలు భోదించారు :- మేము సత్యం మాట్లాడాలి,అమానతులు తిరిగి అప్పచెప్పాలి,బంధుత్వాలను కలుపుకోవాలి,పొరుగువారితో ఉత్తమంగా మెలగాలి, దురాక్రమణ,రక్తపాతం నుండి ఆగిపోవాలి,అలాగే ఈ విషయాల నుండి మమ్మల్ని వారించారు అవి :- అశ్లీలానికి దూరంగా ఉండాలి,అబద్దసాక్ష్యం చెప్పకూడదు,అనాధ సొమ్మును అన్యాయంగా తినకూడదు,శీలగుణవంతులపై అబాండాలు మోపకూడదు,అదేవిధంగా మాకు ఈ విషయాన్నికూడా ఆజ్ఞాపించారు;-మేము కేవలం అల్లాహ్'ను మాత్రమే ఆరాధించాలి,ఆయనతో పాటు మరొకరిని సాటి కల్పించకూడదు,నమాజు స్థాపించాలి,జకాతు చెల్లించాలి,ఉపవాసాలు పాటించాలి."అతను ఇలా అన్నారు: ఆయన ఇస్లాం యొక్క తదితర విషయాలను వివరించాడు మేము వాటిని సత్యమని అంగీకరించాము అతనిని విశ్వసించాము,ఆయన తెచ్చిన దానిప్రకారం అనుసరించాము'పిమ్మట మేము అల్లాహ్'ఏకైకుడను మాత్రమే ఆరాధించాము,ఆయనకు ఇతరులను సాటి కల్పించలేదు,ఆయన మాకు హరాము చేసినవాటిని మేము నిషేదించుకున్నాము,ఆయన మాకు హలాలు చేసినవాటిని మేము హలాలుగా భావించాము"

ఇమామ్ అహ్మద్ (ర) దీనిని స్వల్ప తేడాతో ఉల్లేఖించారు:(1740 );అబూనయీమ్ హిల్యతుల్ఔలియా' సంక్షిప్తంగా (1/115)

మీరు చూసినట్లుగా' ఇస్లాం,వ్యక్తులకు పవిత్రత ఇవ్వదు,వారి స్థాయి కంటే పైకి వారిని లేపదు,వారిని ప్రభువులుగా,దైవాలుగా మార్చదు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు."వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు}.

[ఆల్ ఇమ్రాన్ :64]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మరియు మీరు దైవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?}

[ఆల్ ఇమ్రాన్ :80]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నసార}క్రైస్తవులు మర్యం పుత్రుడైన ఈసా విషయము లో అతిక్రమించినట్లు నా విషయం లోమీరు నా హోదా కు,(స్థాయి కి) మించి అతిశయిళ్లకండి (మితిమీరకండి),నిశ్చయంగా నేను ఒక దాసుడను మాత్రమే కాబట్టి"అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త" అని మాత్రమే పలకండి}

సహీహ్ బుఖారి 3445

ఇస్లాంలో తౌబా'ను అల్లాహ్ షరీఅతుబద్దమైనదిగా చేశాడు'అర్ధం :- మనిషి తన ప్రభువు వైపుకు మరలడం పాపాన్ని విడిచిపెట్టడం,మరియు ఇస్లాం మనిషి యొక్క వెనుకటి పాపాలను ప్రక్షాలిస్తుంది',తౌబా'చేసుకోవడం వల్ల వెనుకటి పాపాలు మన్నించబడతాయి మనుషుల ఎదుట మనిషి చేసిన తప్పిదాలను ఒప్పుకోవాలిసిన అవసరంలేదు.

ఇస్లాంలో తౌబా'ను అల్లాహ్ షరీఅతుబద్దమైనదిగా చేశాడు'అది :- మనిషి తన ప్రభువు వైపుకు మరలడం పాపాన్ని విడిచిపెట్టడం. అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:-మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలిసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకోండి,బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు![నూర్ :31]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.}[తౌబా :104]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:{ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు.}[షూరా:25]రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:{నిశ్చయంగా అల్లాహ్ తన ముమిన్ దాసుడి తౌబాతో విపరీతంగా సంతోషిస్తాడు' ప్రాణాలుతీసే ఎడారిలో ఒక ముమిన్ వ్యక్తి తన ఒంటెను వెంటబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు అతనికి కావలిసిన తిను,త్రాగు పదార్ధాలు దానిపై ఉన్నాయి,పిదప పడుకుంటాడు కాసేపటికి మేల్కుంటాడు'చూస్తే ఆ ఒంటె పారిపోయింది'దాన్ని తీవ్రంగా వెతుకుతాడు,చివరికి అతనికి దప్పికవేస్తుంది'అప్పుడు ఇలా అంటాడు :నేను నివసించే చోటుకి తిరిగి వెళ్లిపోతాను,మరణం వచ్చేవరకు పడుకుంటాను,అని తన తల ను భుజంపై చావడానికి పెడతాడు,తరువాత లేచి చూస్తే అతనివద్ద తన ఒంటె అతనివద్ద ఉంది,దాని పై తన'ఆహారం,తిను,త్రాగుపదార్ధాలు ఉన్నాయి,అల్లాహ్ తఆలా ముమిన్ దాసుడి తౌబాపట్ల ఈ దాసుడి ఒంటె,అన్నపానియాల వల్ల కలిగిన సంతోషం కంటే అధికంగా సంతోషిస్తాడు.సహీహ్ ముస్లిం (2744)ఇస్లాం మనిషి గత పాపాలను ప్రక్షాలిస్తుంది'మరియు తౌబా'చేసుకోవడం వల్ల వెనుకటి పాపాలు మన్నించబడతాయి మనుషుల ఎదుట మనిషి తప్పిదలను ఒప్పుకోవాలిసిన అవసరంలేదు.{సత్యతిరస్కారులతో ఇలా అను : ఒకవేళ వారు మానుకుంటే గతించిన పాపములు వారి కొరకు మన్నించబడుతాయి. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల (విషయంలో) సాంప్రదాయం జరిగి ఉన్నది.[అల్- అన్ఫాల్ :38]అల్లాహ్ క్రైస్తవులను'తౌబా చేసుకోమని ఆహ్వానిస్తున్నాడు'అల్లాహ్ తాలాసెలవిచ్చాడు :-{వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.}[అల్ మాయిదా :74]అల్లాహ్ పాపులందరికి,దుర్జనులందరికి తౌబా చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు;అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు-{ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."}[జుమర్:53]అమ్ర్ బిన్ అల్ ఆస్ ఇస్లాం స్వీకరించదలచినప్పుడు 'గత జీవితంలో ఇస్లాం కు ముందు తాను చేసిన పాపాలు మన్నించబడవేమో అని ఆందోళనచెందారు,అమ్ర్ రది'ఈ విషయాన్ని ఉల్లేఖన రూపంలో తెలిపారు:-{అల్లాహ్ తాలా నా మనసులో ఇస్లాం వేసినప్పుడు ఆయన ఇలా చెప్పారు: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకి వచ్చాను,ఆయన నాకు బైత్ చేయించ దలిచారు అప్పుడు తన చేతిని ఆయన నా వైపుకు చాపారు,నేను ఇలా చెప్పాను:- ఓ దైవప్రవక్త నేను మీ చేతులపై బైత్ ప్రమాణం చేయలేను నా గత పాపాలు మీరు క్షమాపన చేయించనంత వరకు'అప్పుడు దైవప్రవక్త నాకు ఇలా చెప్పారు:- ఓ అమ్ర్ నీకు ఈ విషయం తెలియదా?హిజ్రతు మనిషి చేసిన గతపాపాలన్నీ ప్రక్షాలిస్తుంది,ఓ అమ్ర్ నీకు ఈ విషయం తెలియదా?నిశ్చయంగా ఇస్లాం'మనిషిచేసిన గత పాపాలన్నింటిని ప్రక్షాలిస్తుంది.}.దీనిని ముస్లిం (121') మతూలన్'ఉల్లేకించారు,మరియు అహ్మద్ (17827') తన పదాలతో

మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలిసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకోండి,బహుశా మీరు సాఫల్యం పొందవచ్చు!

[నూర్ :31]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.}

[తౌబా :104]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు.}

[షూరా:25]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

{నిశ్చయంగా అల్లాహ్ తన ముమిన్ దాసుడి తౌబాతో విపరీతంగా సంతోషిస్తాడు' ప్రాణాలుతీసే ఎడారిలో ఒక ముమిన్ వ్యక్తి తన ఒంటెను వెంటబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు అతనికి కావలిసిన తిను,త్రాగు పదార్ధాలు దానిపై ఉన్నాయి,పిదప పడుకుంటాడు కాసేపటికి మేల్కుంటాడు'చూస్తే ఆ ఒంటె పారిపోయింది'దాన్ని తీవ్రంగా వెతుకుతాడు,చివరికి అతనికి దప్పికవేస్తుంది'అప్పుడు ఇలా అంటాడు :నేను నివసించే చోటుకి తిరిగి వెళ్లిపోతాను,మరణం వచ్చేవరకు పడుకుంటాను,అని తన తల ను భుజంపై చావడానికి పెడతాడు,తరువాత లేచి చూస్తే అతనివద్ద తన ఒంటె అతనివద్ద ఉంది,దాని పై తన'ఆహారం,తిను,త్రాగుపదార్ధాలు ఉన్నాయి,అల్లాహ్ తఆలా ముమిన్ దాసుడి తౌబాపట్ల ఈ దాసుడి ఒంటె,అన్నపానియాల వల్ల కలిగిన సంతోషం కంటే అధికంగా సంతోషిస్తాడు.

సహీహ్ ముస్లిం (2744)

ఇస్లాం మనిషి గత పాపాలను ప్రక్షాలిస్తుంది'మరియు తౌబా'చేసుకోవడం వల్ల వెనుకటి పాపాలు మన్నించబడతాయి మనుషుల ఎదుట మనిషి తప్పిదలను ఒప్పుకోవాలిసిన అవసరంలేదు.

{సత్యతిరస్కారులతో ఇలా అను : ఒకవేళ వారు మానుకుంటే గతించిన పాపములు వారి కొరకు మన్నించబడుతాయి. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల (విషయంలో) సాంప్రదాయం జరిగి ఉన్నది.

[అల్- అన్ఫాల్ :38]

అల్లాహ్ క్రైస్తవులను'తౌబా చేసుకోమని ఆహ్వానిస్తున్నాడు'అల్లాహ్ తాలాసెలవిచ్చాడు :-

{వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.}

[అల్ మాయిదా :74]

అల్లాహ్ పాపులందరికి,దుర్జనులందరికి తౌబా చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు;అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు-

{ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."}

[జుమర్:53]

అమ్ర్ బిన్ అల్ ఆస్ ఇస్లాం స్వీకరించదలచినప్పుడు 'గత జీవితంలో ఇస్లాం కు ముందు తాను చేసిన పాపాలు మన్నించబడవేమో అని ఆందోళనచెందారు,అమ్ర్ రది'ఈ విషయాన్ని ఉల్లేఖన రూపంలో తెలిపారు:-

{అల్లాహ్ తాలా నా మనసులో ఇస్లాం వేసినప్పుడు ఆయన ఇలా చెప్పారు: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకి వచ్చాను,ఆయన నాకు బైత్ చేయించ దలిచారు అప్పుడు తన చేతిని ఆయన నా వైపుకు చాపారు,నేను ఇలా చెప్పాను:- ఓ దైవప్రవక్త నేను మీ చేతులపై బైత్ ప్రమాణం చేయలేను నా గత పాపాలు మీరు క్షమాపన చేయించనంత వరకు'అప్పుడు దైవప్రవక్త నాకు ఇలా చెప్పారు:- ఓ అమ్ర్ నీకు ఈ విషయం తెలియదా?హిజ్రతు మనిషి చేసిన గతపాపాలన్నీ ప్రక్షాలిస్తుంది,ఓ అమ్ర్ నీకు ఈ విషయం తెలియదా?నిశ్చయంగా ఇస్లాం'మనిషిచేసిన గత పాపాలన్నింటిని ప్రక్షాలిస్తుంది.}.

దీనిని ముస్లిం (121') మతూలన్'ఉల్లేకించారు,మరియు అహ్మద్ (17827') తన పదాలతో

ఇస్లాంలో,మనిషికి మరియు అల్లాహ్'కి మధ్య సంబంధం ప్రత్యక్షంగా ఉంది,కాబట్టి మీకు మరియు దేవునికి మధ్య ఎవరు మధ్యవర్తిగా ఉండనవసరం లేదు.ఇస్లాం తన ప్రభువు యొక్క దైవత్వంలో'పోషకత్వంలో మనిషిని దైవంగా చేయడాన్ని లేదా ఇతరులను ఆయనకు సాటి కల్పించడాన్నిఇస్లాం నిషేధిస్తుంది.

ఇస్లాంలో మనిషి పాపాలను మనిషి ముందు ఒప్పుకోవాలిసిన అవసరం లేదు ' ఇస్లాంలో మనిషికి మరియు అల్లాహ్'కు మధ్య ప్రత్యేక్ష సంభంధం ఉంది వారిమధ్య ఏ మధ్యవర్తి సిఫారసు అవసరంలేదు' పేరా నెంబర్ (36') లో పేర్కొన్నట్లు'అల్లాహ్' తాలా సర్వజనులను తనవైపుకు మరలాలని,తౌబా క్షమాపనకై అర్ధించాలని పిలుపునిస్తున్నాడు'అలాగే తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తలను,దైవదూతలను మధ్యవర్తులుగా సిఫారసకులుగా చేసుకోకూడదని అల్లాహ్ వారించాడు.{మరియు మీరు దైవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?}[ఆల్ ఇమ్రాన్ :80]–మీరు చూస్తున్నట్లుగా-అల్లాహ్ పోషకత్వంలో,ఆయన దైవత్వంలో'మానవులను దైవంగా చేయడం లేదా ఇతరులను ఆయనకు సాటికల్పించడం వంటివి చేయకూడదని ఇస్లాం మనల్ని ఆపుతుంది.మహోన్నతుడైన అల్లాహ్ క్రైస్తవుల గురించి తెలిపాడు :-{వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదిలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (ఏసుక్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు.}తౌబా:31అల్లాహ్ అవిశ్వాసులను ఖండించాడు 'వారు తమకు మరియు అల్లాహ్'కు నడుమ మధ్యవర్తులను నియమించుకున్నారు;అల్లాహ్ సెలవిచ్చాడు:-{వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.}[జుమర్:3]మరియు అల్లాహ్ తెలియజేశాడు నిశ్చయంగా బహుదైవారాధకులు -అజ్ఞానపరులు- తమకు మరియు అల్లాహ్'కు నడుమ మధ్యవర్తులను చేసుకున్నారు మరియు వారు ఇలా అంటారు:-'నిశ్చయంగా వారు తమను అల్లాహ్'కు సమీప పరుస్తారు.అల్లాహ్ ప్రజలతో తనకు మరియు తనదాసులమధ్య 'ప్రవక్తలను లేదా దైవదూతల'వంటివారినే మధ్యవర్తులుగా చేసుకోవడాన్ని నిషేధించినప్పుడు,ఇతరులను మధ్యవర్తులుగా ఎలా చేసుకుంటారు?దైవప్రవక్తలు సందేశహరులు'అలైహిముస్సలాం'అల్లాహ్'సామీప్యాన్నిపొందటానికి త్వరపడేవారు దైవప్రవక్తల,సందేశహరుల స్థితి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు.ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు,ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు,మా ముందు ఆశక్తతను అనుకువను కనబర్చేవారు }[అల్ అంబియా:90]మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-{వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!}{అల్ ఇస్రా : 57}అనగా నిశ్చయంగా అల్లాహ్'ను వదిలి మీరు పిలుస్తున్నవారు -ప్రవక్తలు మరియు సత్పురుషులలో -వారు అల్లాహ్' సామిప్యాన్నిపొందేవారు మరియు ఆయన జాలికరుణను ఆశించేవారు,ఆయన శిక్షలకు భయపడేవారు.మరి అలాంటప్పుడు అల్లాహ్'ను కాదని వారు ఎలా పిలువబడతారు?.

{మరియు మీరు దైవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?}

[ఆల్ ఇమ్రాన్ :80]

–మీరు చూస్తున్నట్లుగా-అల్లాహ్ పోషకత్వంలో,ఆయన దైవత్వంలో'మానవులను దైవంగా చేయడం లేదా ఇతరులను ఆయనకు సాటికల్పించడం వంటివి చేయకూడదని ఇస్లాం మనల్ని ఆపుతుంది.మహోన్నతుడైన అల్లాహ్ క్రైస్తవుల గురించి తెలిపాడు :-

{వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదిలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (ఏసుక్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు.}

తౌబా:31

అల్లాహ్ అవిశ్వాసులను ఖండించాడు 'వారు తమకు మరియు అల్లాహ్'కు నడుమ మధ్యవర్తులను నియమించుకున్నారు;అల్లాహ్ సెలవిచ్చాడు:-

{వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.}

[జుమర్:3]

మరియు అల్లాహ్ తెలియజేశాడు నిశ్చయంగా బహుదైవారాధకులు -అజ్ఞానపరులు- తమకు మరియు అల్లాహ్'కు నడుమ మధ్యవర్తులను చేసుకున్నారు మరియు వారు ఇలా అంటారు:-'నిశ్చయంగా వారు తమను అల్లాహ్'కు సమీప పరుస్తారు.

అల్లాహ్ ప్రజలతో తనకు మరియు తనదాసులమధ్య 'ప్రవక్తలను లేదా దైవదూతల'వంటివారినే మధ్యవర్తులుగా చేసుకోవడాన్ని నిషేధించినప్పుడు,ఇతరులను మధ్యవర్తులుగా ఎలా చేసుకుంటారు?దైవప్రవక్తలు సందేశహరులు'అలైహిముస్సలాం'అల్లాహ్'సామీప్యాన్నిపొందటానికి త్వరపడేవారు దైవప్రవక్తల,సందేశహరుల స్థితి తెలుపుతూ అల్లాహ్ సెలవిచ్చాడు.

ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు,ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు,మా ముందు ఆశక్తతను అనుకువను కనబర్చేవారు }

[అల్ అంబియా:90]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-

{వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!}

{అల్ ఇస్రా : 57}

అనగా నిశ్చయంగా అల్లాహ్'ను వదిలి మీరు పిలుస్తున్నవారు -ప్రవక్తలు మరియు సత్పురుషులలో -వారు అల్లాహ్' సామిప్యాన్నిపొందేవారు మరియు ఆయన జాలికరుణను ఆశించేవారు,ఆయన శిక్షలకు భయపడేవారు.మరి అలాంటప్పుడు అల్లాహ్'ను కాదని వారు ఎలా పిలువబడతారు?.

ఈ సందేశపు చివరలో మేము గుర్తుచేస్తున్నవిషయం అది ప్రజలు విభిన్నకాలాలు,విభిన్నజాతీయతలు మరియు విభిన్నదేశాలుగా చీలి ఉన్నారు,జీవనవిధానంలో,కార్యకలాపాలలో,వాతావరణంలో పూర్తి మానవ సమాజం ఆలోచనల రీత్యా భిన్నంగా ఉంది,వారి లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి,కాబట్టి వారికి మార్గనిర్దేశం చేయడానికి ఒక గైడ్'మార్గదర్శనం,వారిని ఒకచోట చేర్చే వ్యవస్థ,రక్షించడానికి ఒక పాలకుడు అవసరం ఉంది,అంచేత మహనీయ దైవప్రవక్తలు దైవవాణి నీడలోవారసులుగా ఉదయించారు,వారు ప్రజలను మంచిమార్గదర్శకమైన రుజుమార్గంలోకి నడిపిస్తారు,దేవుని ధర్మశాస్త్రం ప్రకారం వారిని సంస్కరిస్తారు,వారి మధ్య సత్యబద్దమైన,న్యాయమైన తీర్పు ఇస్తారు,ఈ ప్రవక్తలను మరియు దైవప్రవక్తల సమీపకాలానికి చెందిన సజ్జనులను అంగీకరించడం వల్ల ప్రజల వ్యవహారాలు సరళమార్గంలోకి వస్తాయి అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క దైవదౌత్యంతో ముగిస్తూ సమస్త దైవదౌత్యలకు సీలు వేశాడు,మరియు అల్లాహ్'ను చేరడానికి ప్రజల కొరకు ఆయనను మార్గదర్శనంగా,కారుణ్యంగా,జ్యోతిగా,చేశాడు.

44-ఈ సందేశం చివరలో మేము గుర్తుచేస్తున్నవిషయం అది ప్రజలు విభిన్నకాలాలు,విభిన్నజాతీయతలు మరియు విభిన్నదేశాలుగా చీలి ఉన్నారు,జీవనవిధానంలో,కార్యకలాపాలలో,వాతావరణంలో పూర్తి మానవ సమాజం ఆలోచనల రీత్యా భిన్నంగా ఉంది,వారి లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి,కాబట్టి వారికి మార్గనిర్దేశం చేయడానికి ఒక గైడ్'మార్గదర్శనం,వారిని ఒకచోట చేర్చే వ్యవస్థ,రక్షించడానికి ఒక పాలకుడు అవసరం ఉంది,అంచేత మహనీయ దైవప్రవక్తలు దైవవాణినీడలోవారసులుగా ఉదయించారు,వారు ప్రజలను మంచిమార్గదర్శకమైన రుజుమార్గంలోకి నడిపిస్తారు,దేవుని ధర్మశాస్త్రం ప్రకారం వారిని సంస్కరిస్తారు,వారి మధ్య సత్యంతోన్యాయమైన తీర్పు ఇస్తారు,ఈ ప్రవక్తలను మరియు దైవప్రవక్తల సమీపకాలానికి చెందిన సజ్జనులను అంగీకరించడం వల్ల ప్రజల వ్యవహారాలు సరళమార్గంలోకి వస్తాయి'ఎప్పుడైతే మార్గబ్రష్టత'ఎక్కువై' అజ్ఞానం సర్వసాధారణమైపోయి,విగ్రహారాధన చేయబడిందో ఆ అల్లాహ్ తాలా తన ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం'కు మార్గదర్శకత్వం,నిజమైన ధర్మం ఇచ్చిపంపాడు'తద్వారా ఆయన ప్రజలను అవిశ్వాసకుఫ్ర్'అజ్ఞానం,విగ్రహారాధన నుండి ఈమాను,మరియు హిదాయతు వైపుకు నడిపించసాగారు.

కాబట్టి ఓ మనిషి మూఢసంప్రాదాయాలను,మూఢ అనుసరణలు వదిలి అల్లాహ్ కొరకు చిత్తశుద్దితో స్వచ్ఛంగా నిలబడమని నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను'మరియు నీ మరణాంతరం ఆ అల్లాహ్ వైపుకు మరలడం నిశ్చయం'అనే విషయాన్ని గుర్తుపెట్టుకో!నీ స్వీయ మనుగడను,నీ చుట్టూ ఆవరణాలను పరిశీలించు,ఇస్లాం స్వీకరించు ఇహపరలోకాల సంతోషాలు నీ కైవసం అవుతాయి,ఒకవేళ నీవు ఇస్లాం స్వీకరించాలని ఆశిస్తే నువ్వు పెద్ద కొండలేమీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కేవలం'-అష్'హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్'అని సాక్ష్యామివ్వాలి,మరియు అల్లాహ్'ను వదిలి ఆరాధించే ప్రతీ బూటకపు దైవంతో తెగత్రెంపులు చేసుకోవాలి,మరియు అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని తిరిగి బ్రతికించి లేపుతాడు,లెక్కలు,ప్రతిఫలాలు,శిక్షలు సత్యం'అని మనం విశ్వసించాలి,ఈ సాక్ష్యాన్ని ఇచ్చిన తదుపరి నువ్వు ఒక ముస్లిముగా మారుతావు,దీని తరువాత అల్లాహ్'ను నువ్వు ఆయన షరీఅతు శాసనం ప్రకారం ఆరాధించాలి,అనగా 'నమాజు'జకాతు'ఉపవాసాలు పాటించాలి,స్తోమత ఉంటే హజ్జ్ కూడా చేయవలిసి ఉంటుంది.

అంచేత ఓ మనిషి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను'అల్లాహ్ కొరకు స్థిరంగా సత్యబద్దంగా ప్రతీ అంధఅనుసరణ,అలవాటును పరిత్యజించి నిలబడు,అల్లాహ్ సెలవిచ్చాడు:-{(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే,దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!}[సబా:46]మరియు తెలుసుకో!నిశ్చయంగా నీ మరణాంతరం నీ ప్రభువు వైపుకు నువ్వు మరలుతావు.మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదు;మరియు నిశ్చయంగా అతని కృషిని అతి త్వరలో చూపించబడుతుంది.{అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;(41)మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;(42)[అన్-నజ్మ్ :39-42 ]మరియు మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి,మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?[అల్ ఆరాఫ్:185]ఇస్లాం'స్వీకరించండి-ఇహపరలోకంలో శాంతిని పొందుతారు,మీరు ఇస్లాంలో ప్రవేశించాలనుకుంటే"-{లా ఇలాహ ఇల్లాల్లాహ్ వ అన్నముహమ్మదన్ రసూలుల్లాహ్}"అల్లాహ్ తప్ప వాస్తవ దేవుడు మరొకడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని మీరు సాక్ష్యం చెప్పాలి.మరియు దైవప్రవక్త ము'ఆజ్'ని[రదియల్లాహు అన్హు] ఇస్లాం వ్యాప్తి కై దాయీగా యమన్'కు పంపినప్పుడు అతనికి ఇలా ఉపదేశించారు:-"నిశ్చయంగా నీవు గ్రంధవహులకు చెందిన ఒకజాతి వద్దకు వెళ్తున్నావు,మొదట వారిని 'అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవంలేడు మరియు నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క సందేశ హరుడను'అనే విషయం వైపుకు ఆహ్వానించు,ఒకవేళ వారు ఈ విషయానికి విధేయులైతే అప్పుడు వారికి 'అల్లాహ్ వారిపై రాత్రిపగలు కలిపి రోజుకు ఐదు వేళల నమాజులను విధి పరిచినవిషయం తెలియజేయి,ఒకవేళ వారు దీనికి కూడా విధేయత చూపినట్లైతే అప్పుడు వారిపై అల్లాహ్ 'జకాతు'ను విధిగా చేశాడని తెలియజేయి,అది వారిధనికుల నుండి తీసుకోబడి బీదప్రజలకు పంచబడుతుంది,వారు ఒకవేళ దానికి కూడా విధేయతచూపినట్లైతే అప్పుడు వారి ప్రియగౌరవసంపాదకు దూరంగా ఉండండి.సహీహ్ ముస్లిం 19అల్లాహ్'ను వదలి ఆరాధించబడే ప్రతీదాన్ని నీవు నిరాకరించాలి,అలా అల్లాహ్'ను వదలి ఆరాధించబడే ప్రతీదాన్ని నిరాకరించడమే ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం'-అల్-హనీఫియ్య అవుతుంది."వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది."[అల్ ముమ్తహీన :4]మరియు సమాధి వాసులను అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపుతాడని విశ్వసించాలి.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-{ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.(6)మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది.అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు.{అల్ హజ్జ్ : 6-7}నిశ్చయంగా లెక్కలు మరియు ప్రతిఫలాలు సత్యం.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:-మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వబడుతుంది మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.}[అల్ జాసియా :22 ]

{(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే,దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!}

[సబా:46]

మరియు తెలుసుకో!నిశ్చయంగా నీ మరణాంతరం నీ ప్రభువు వైపుకు నువ్వు మరలుతావు.

మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదు;

మరియు నిశ్చయంగా అతని కృషిని అతి త్వరలో చూపించబడుతుంది.

{అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;(41)

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;(42)

[అన్-నజ్మ్ :39-42 ]

మరియు మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి,మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

ఏమీ? వారు భూమ్యాకాశాలపై గల (అల్లాహ్) ఆధిపత్యాన్ని మరియు అల్లాహ్ సృష్టించిన ప్రతివస్తువును గమనించి చూసి, బహుశా తమ గడువు కూడా సమీపించిందేమోనని అనుకోలేరా? దీని తరువాత వారు మరేవిధమైన సందేశాన్ని విశ్వసిస్తారు?

[అల్ ఆరాఫ్:185]

ఇస్లాం'స్వీకరించండి-ఇహపరలోకంలో శాంతిని పొందుతారు,మీరు ఇస్లాంలో ప్రవేశించాలనుకుంటే"-{లా ఇలాహ ఇల్లాల్లాహ్ వ అన్నముహమ్మదన్ రసూలుల్లాహ్}"అల్లాహ్ తప్ప వాస్తవ దేవుడు మరొకడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని మీరు సాక్ష్యం చెప్పాలి.

మరియు దైవప్రవక్త ము'ఆజ్'ని[రదియల్లాహు అన్హు] ఇస్లాం వ్యాప్తి కై దాయీగా యమన్'కు పంపినప్పుడు అతనికి ఇలా ఉపదేశించారు:-

"నిశ్చయంగా నీవు గ్రంధవహులకు చెందిన ఒకజాతి వద్దకు వెళ్తున్నావు,మొదట వారిని 'అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవంలేడు మరియు నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క సందేశ హరుడను'అనే విషయం వైపుకు ఆహ్వానించు,ఒకవేళ వారు ఈ విషయానికి విధేయులైతే అప్పుడు వారికి 'అల్లాహ్ వారిపై రాత్రిపగలు కలిపి రోజుకు ఐదు వేళల నమాజులను విధి పరిచినవిషయం తెలియజేయి,ఒకవేళ వారు దీనికి కూడా విధేయత చూపినట్లైతే అప్పుడు వారిపై అల్లాహ్ 'జకాతు'ను విధిగా చేశాడని తెలియజేయి,అది వారిధనికుల నుండి తీసుకోబడి బీదప్రజలకు పంచబడుతుంది,వారు ఒకవేళ దానికి కూడా విధేయతచూపినట్లైతే అప్పుడు వారి ప్రియగౌరవసంపాదకు దూరంగా ఉండండి.

సహీహ్ ముస్లిం 19

అల్లాహ్'ను వదలి ఆరాధించబడే ప్రతీదాన్ని నీవు నిరాకరించాలి,అలా అల్లాహ్'ను వదలి ఆరాధించబడే ప్రతీదాన్ని నిరాకరించడమే ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం'-అల్-హనీఫియ్య అవుతుంది.

"వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది."

[అల్ ముమ్తహీన :4]

మరియు సమాధి వాసులను అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపుతాడని విశ్వసించాలి.మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

{ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ! ఆయనే సత్యం, మరియు నిశ్చయంగా ఆయన మాత్రమే చచ్చిన వారిని తిరిగి బ్రతికించగలవాడు మరియు నిశ్చయంగా ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.(6)

మరియు అంతిమ ఘడియ నిశ్చయంగా రానున్నది.అందులో ఎలాంటి సందేహం లేదు మరియు నిశ్చయంగా, అల్లాహ్ గోరీలలో నున్న వారిని మరల బ్రతికించి లేపుతాడు.

{అల్ హజ్జ్ : 6-7}

నిశ్చయంగా లెక్కలు మరియు ప్రతిఫలాలు సత్యం.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:-

మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వబడుతుంది మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.}

[అల్ జాసియా :22 ]

మీరు ఈ 'షహాద'యొక్క సాక్ష్యమిచ్చినప్పుడు,మీరు ముస్లిం అవుతారు,అప్పుడు మీరు తప్పకుండా అల్లాహ్ శాసించినట్లుగా 'నమాజ్'ఉపవాసం'మరియు స్తోమత కలిగి ఉంటే హజ్జ్'చేయడం వంటివి ఆచరిస్తూ ఆరాధించాలి.

19'-11-1441 "నాటి కాపీ

ప్రొఫెసర్ డాక్టర్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ సహీమ్'- దీన్ని రచించారు.

ఇస్లామిక్ అధ్యయనాల విభాగంలో 'అఖీదా ప్రొఫెసర్'(మాజీ)

ట్రైనింగ్ కళాశాల,కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం

రియాద్,సౌదీ అరేబియా రాజ్యం